రాణించిన ఔషధ, ఫైనాన్స్ షేర్లు
ఔషధ, ఫైనాన్స్ షేర్లు రాణించడంతో వరుసగా రెండో రోజూ సూచీలు లాభపడ్డాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు కలిసొచ్చాయి.
సమీక్ష
ఔషధ, ఫైనాన్స్ షేర్లు రాణించడంతో వరుసగా రెండో రోజూ సూచీలు లాభపడ్డాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు కలిసొచ్చాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయానికి ముందు కొంత అప్రమత్తత కనిపించింది. గుడి పడ్వా పండగ సందర్భంగా బుధవారం ఫారెక్స్ మార్కెట్లు పనిచేయలేదు. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు అదే ధోరణిలో ట్రేడయ్యాయి. బ్యారెల్ ముడిచమురు 0.31% తగ్గి 75.09 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ ఉదయం 58,245.26 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అదే జోరులో 58,418.78 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. అమ్మకాలతో కాస్త తగ్గి, చివరకు 139.91 పాయింట్ల లాభంతో 58,214.59 వద్ద ముగిసింది. నిఫ్టీ 44.40 పాయింట్లు పెరిగి 17,151.90 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,107.85- 17,207.25 పాయింట్ల మధ్య కదలాడింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 19 మెరిశాయి. బజాజ్ ఫైనాన్స్ 2.16%, బజాజ్ ఫిన్సర్వ్ 2.15%, సన్ఫార్మా 1.65%, ఇండస్ఇండ్ బ్యాంక్ 0.93%, టాటా మోటార్స్ 0.89%, ఐసీఐసీఐ బ్యాంక్ 0.89% చొప్పున లాభపడ్డాయి. ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, నెస్లే, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.50% వరకు నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో ఆరోగ్య సంరక్షణ, కమొడిటీస్, ఎఫ్ఎమ్సీజీ, యుటిలిటీస్, ఆర్థిక సేవలు, చమురు-గ్యాస్ రాణించాయి. టెలికాం, మన్నికైన వినిమయ వస్తువులు, లోహ, స్థిరాస్తి పడ్డాయి. బీఎస్ఈలో 1984 షేర్లు లాభాల్లో ముగియగా, 1523 స్క్రిప్లు నష్టపోయాయి. 124 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
* ఐఓసీ రూ.61,077 కోట్ల పెట్టుబడులు: ఒడిశా పారదీప్లో పెట్రోరసాయనాల కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.61,077 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఐఓసీ ప్రకటించింది. ఒక ప్రదేశంలో కంపెనీకి ఇదే అతిపెద్ద పెట్టుబడి కావడం గమనార్హం. ప్రాజెక్టు పూర్తికి గడువును కంపెనీ తెలియజేయలేదు. ముడిచమురును రసాయనాలుగా మార్చడం, ప్రస్తుతం 5-6 శాతంగా ఉండగా, కొత్త ప్రాజెక్టు సాయంతో దీనిని 10-12% వరకు పెంచాలని కంపెనీ భావిస్తోంది.
* ఉదయ్శివకుమార్ ఇన్ఫ్రా ఐపీఓ మూడోరోజు ముగిసే సరికి 5.15 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 2 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా, 10,29,54,972 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఎన్ఐఐల నుంచి 8.47 రెట్లు, రిటైల్ విభాగంలో 4.14 రెట్లు, క్యూఐబీల నుంచి 1.21 రెట్ల స్పందన కనిపించింది. ఈ ఇష్యూ నేటితో ముగియనుంది.
* జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్లో 5.6 శాతం వాటాను ప్రపంచ బ్యాంక్ గ్రూప్ విభాగమైన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్సీ) 30 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.240 కోట్ల)కు కొనుగోలు చేసింది.
* కంపెనీ యూనిట్లో ఐఎఫ్సీ రూ.600 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది.
* ఎన్బీఎఫ్సీ సంస్థ ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ తమ ఐపీఓ పరిమాణాన్ని రూ.1600 కోట్ల నుంచి రూ.1200 కోట్లకు తగ్గించుకుంది. ఇష్యూలో ఆఫర్ సేల్ సేల్ పరిమాణాన్ని రూ.750 కోట్ల నుంచి రూ.450 కోట్లకు పరిమితం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 లక్షల వాహనాల ఉత్పత్తే టార్గెట్.. హ్యుందాయ్ మోటార్ గ్రూప్
హ్యుందాయ్ మోటార్ గ్రూప్ భారత్లో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!