తెలంగాణలో రూ.76,568 కోట్ల పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్రంలో 2021-22లో కొత్త పెట్టుబడులు 150 శాతం పెరిగినట్లు ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వెల్లడించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్స్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీస్ అనే సంస్థతో కలిసి ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఈపీసీ) ఒక అధ్యయనాన్ని చేపట్టింది.
2020-21తో పోలిస్తే 150% వృద్ధి
కొత్తగా 60,000 ఉద్యోగాల కల్పన
7 లక్షలకు మించి ఐటీ ఉద్యోగాలు
ఎంఎస్ఎంఈ ఈపీసీ నివేదిక
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 2021-22లో కొత్త పెట్టుబడులు 150 శాతం పెరిగినట్లు ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వెల్లడించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్స్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీస్ అనే సంస్థతో కలిసి ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఈపీసీ) ఒక అధ్యయనాన్ని చేపట్టింది. తదుపరి రూపొందించిన నివేదికను ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఛైర్మన్ డి.ఎస్.రావత్ గురువారం విడుదల చేశారు. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2020-21లో కొత్త పెట్టుబడులు రూ.31,274 కోట్లు కాగా, 2021-22లో దీని కంటే 150 శాతం అధికంగా రూ.76,568 కోట్లు లభించాయి. ఇందులో ప్రైవేటు రంగ పెట్టుబడులు ఎంతో అధికంగా రూ.60,618 కోట్ల వరకు ఉండటం ప్రత్యేకత. అదే సమయంలో కొత్త పెట్టుబడి ప్రాజెక్టుల్లో, పూర్తయిన ప్రాజెక్టుల వాటా కూడా ఎక్కువగా ఉన్నట్లు ఈ నివేదిక వివరించింది.
వ్యవసాయం బలంగా ఉన్నందునే కొవిడ్ కాలంలోనూ వృద్ధి: ‘కొవిడ్’ మహమ్మారి విస్తరించిన కాలంలో అన్ని చోట్లా వృద్ధి రేటు మందగిస్తే తెలంగాణ రాష్ట్రం 2.2% వృద్ధి రేటు నమోదు చేసినట్లు పేర్కొంది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు బలంగా ఉండటం దీనికి కారణమని వివరించింది. కృత్రిమ మేధ (ఏఐ), బ్లాక్చైన్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి తెలంగాణ ఎంతో అనువైన ప్రదేశంగా ఉన్నట్లు వెల్లడించింది. ఐటీ ఎగుమతులు తెలంగాణ నుంచి 2014-15లో రూ.66,276 కోట్లు కాగా, 2021-22 నాటికి రూ.1.45 లక్షల కోట్లకు పెరిగినట్లు పేర్కొంది. అదే సమయంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య 3.71 లక్షల నుంచి 7 లక్షలకు మించిపోయినట్లు వివరించింది.
ఆరోగ్య పర్యాటకంలోనూ: ఆరోగ్య పర్యాటక విభాగంలో తెలంగాణ ఆకర్షణీయ వృద్ధి నమోదు చేస్తున్నట్లు ఈ నివేదిక తెలియజేసింది. ఆఫ్రికా, సీఐఎస్, గల్ఫ్ దేశాల నుంచి పెద్దఎత్తున ప్రజలు వైద్య చికిత్స కోసం హైదరాబాద్ వస్తున్నట్లు తెలిపింది. ఆయా దేశాల నుంచి ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఇక్కడ చికిత్స పొందారని, ఈ సంఖ్య మున్ముందు ఇంకా పెరుగుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా యూనిట్లు గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో అధికంగా ఉన్నట్లు వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్