EPFO - Higher pension: అధిక పింఛను దరఖాస్తుల ఆమోదం ఎలా?
ఈపీఎఫ్వో ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్) కింద చందాదారులు అధిక పింఛను కోసం ఆన్లైన్లో నమోదు చేసిన ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తులు కనిపించడం లేదు. ప్రక్రియ మొదలై.. దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు దరఖాస్తు చేసినవారి వివరాలు యాజమాన్యాల పోర్టల్ లాగిన్లోకి రావడం లేదు.
యాజమాన్యాల లాగిన్లో కనిపించని అర్జీలు
పీఎఫ్ కేంద్ర కార్యాలయం వద్దే నిలిచిన ఉమ్మడి ఆప్షన్లు
ఈనాడు, హైదరాబాద్: ఈపీఎఫ్వో ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్) కింద చందాదారులు అధిక పింఛను కోసం ఆన్లైన్లో నమోదు చేసిన ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తులు కనిపించడం లేదు. ప్రక్రియ మొదలై.. దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు దరఖాస్తు చేసినవారి వివరాలు యాజమాన్యాల పోర్టల్ లాగిన్లోకి రావడం లేదు. దరఖాస్తులు స్వీకరిస్తున్న ఈపీఎఫ్వో కేంద్ర కార్యాలయం.. ఆ దరఖాస్తులు ఎక్కడ ఉన్నాయి? యజమాని వద్దకు ఎందుకు రావడం లేదు? తదితర సమాచారం ఇవ్వడంలేదు. అధిక పింఛనుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తులు యజమానులు ఎప్పటిలోగా ఆమోదించి ప్రాంతీయ కార్యాలయాలకు పంపించాలి? ఏయే వివరాలు, ఆధారాలు జతచేయాలన్న వివరాలపై స్పష్టత లేదు. దీంతో దరఖాస్తుల ఆమోదంలో తీవ్రజాప్యం జరిగే అవకాశం ఉందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధిక పింఛను పొందేందుకు, ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసిన తరువాత ఈపీఎఫ్వో ఆన్లైన్ దరఖాస్తుకు వివిధ ఆంక్షలు పెట్టింది. తీర్పు వచ్చిన మూడు నెలల వరకు కూడా అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కార్మిక సంఘాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడం, సుప్రీం కోర్టు తీర్పును నాలుగు నెలల్లో అమలు చేయాల్సి ఉండటంతో ఎట్టకేలకు ఫిబ్రవరి 26న ఆన్లైన్ దరఖాస్తును అందుబాటులోకి తీసుకువచ్చింది. అర్హులైన ఉద్యోగులు, పింఛనుదారులు మే 3వ తేదీలోగా దరఖాస్తు చేయాలని సూచించింది. దరఖాస్తు చేసిన వెంటనే లేదా ఒకరోజు తరువాత ఇవన్నీ యాజమాన్యాల లాగిన్లోకి రావాల్సి ఉన్నప్పటికీ కేంద్ర కార్యాలయం వాటిని అక్కడే నిలిపి వేస్తోంది. ప్రస్తుతం 2014 సంవత్సరానికి ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, కార్మికులకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పింఛనుదారుల దరఖాస్తులు యాజమాన్యాల లాగిన్లోకి వస్తున్నాయి. కానీ 2014 సెప్టెంబరు ఒకటి తరువాత సర్వీసులో కొనసాగిన వారి దరఖాస్తులు మాత్రం రావడం లేదన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అధిక పింఛనుకు 1.4 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. తొలుత వచ్చిన వాటిని తొలుత పరిష్కారం చేస్తామని చెప్పిన ఈపీఎఫ్వో ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. ప్రాంతీయ కార్యాలయాల్లోనూ స్పష్టమైన సమాచారం ఇవ్వట్లేదు. ఆయా సంస్థల యాజమాన్యాలు ఆమోదించిన దరఖాస్తులను ప్రాంతీయ కార్యాలయాల అధికారులు పరిశీలించి... దరఖాస్తుదారులు అర్హులా? కాదా? అని నిర్ణయిస్తారు. కానీ అసలు దరఖాస్తులు యాజమాన్యాలకు పంపకుండా.. కేంద్ర కార్యాలయం వద్దే నిలిపివేయడంతో చందాదారుల్లో ఆందోళన నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్