56147-57000 దిగువన బలహీనం!
అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో వరుసగా మూడో వారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికా, స్విస్ బ్యాంకుల సంక్షోభం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుతో మదుపర్లు అప్రమత్తత పాటించారు.
సమీక్ష: అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో వరుసగా మూడో వారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికా, స్విస్ బ్యాంకుల సంక్షోభం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుతో మదుపర్లు అప్రమత్తత పాటించారు. ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టులపై ప్రభుత్వం పన్ను పెంచడం దేశీయ సెంటిమెంట్ను దెబ్బతీసింది. దేశీయంగా చూస్తే కార్పొరేట్ వార్తల నుంచి మార్కెట్లు సంకేతాలు తీసుకున్నాయి. డెట్ మ్యూచువల్ ఫండ్లు 35 శాతం కన్నా తక్కువగా ఈక్విటీల్లో మదుపు చేస్తే ఏప్రిల్ 1 నుంచి పన్ను పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించడం ప్రతికూల ప్రభావం చూపింది. బ్యారెల్ ముడిచమురు ధర 2.4% పుంజుకుని 75 డాలర్లకు చేరింది. డాలర్తో పోలిస్తే రూపాయి 82.55 నుంచి 82.48కు పెరిగింది. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ 0.25% చొప్పున, స్విస్ నేషనల్ బ్యాంక్ 0.50% మేర వడ్డీ రేట్లు పెంచాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్ 0.8% నష్టంతో 57,527 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 0.9% తగ్గి 16,945 పాయింట్ల దగ్గర స్థిరపడింది. స్థిరాస్తి, లోహ, ఐటీ రంగాలు నష్టపోగా.. విద్యుత్, ఎఫ్ఎమ్సీజీ, ఆరోగ్య సంరక్షణ షేర్లు మెరిశాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) నికరంగా రూ.6,654 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.9,431 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మార్చిలో ఇప్పటివరకు విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు (ఎఫ్పీఐలు) నికరంగా రూ.7,233 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 2:5గా నమోదు కావడం..
పెద్ద షేర్లలో బలహీనతలను సూచిస్తోంది.
ఈ వారంపై అంచనా: ప్రస్తుతం సెన్సెక్స్ మధ్య కాల మద్దతు స్థాయి 56147- 57000 పాయింట్లకు చేరువగా ట్రేడవుతోంది. ఈ శ్రేణిని కోల్పోతే స్వల్పకాలంలో మరింత బలహీనపడే అవకాశం ఉంది. పైకివెళ్తే 200 రోజుల కదలికల సగటు అయిన 58800 పాయింట్ల దగ్గర నిరోధం ఎదురుకావొచ్చు. కీలక సూచీలతో పోలిస్తే పెద్ద షేర్లు బలహీనంగా కనిపిస్తున్నాయి.
ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సంకేతాలను దేశీయ సూచీలు అందిపుచ్చుకోవచ్చు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా గురువారం సెలవు కావడంతో, ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. బుధవారం మార్చి డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు ఉండటంతో సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏప్రిల్ 3-6 తేదీల్లో ఆర్బీఐ ఎంపీసీ సమావేశం నేపథ్యంలో వడ్డీ రేట్ల ఆధారిత షేర్లు వెలుగులోకి రావొచ్చు. రెపోరేటు మరో 0.25% మేర పెంచుతారనే అంచనాలున్నాయి. ఫిబ్రవరి మౌలిక రంగ వృద్ధి, విదేశీ మారకపు నిల్వల గణాంకాలపై దృష్టిపెట్టొచ్చు. కార్పొరేట్ వార్తల ఆధారంగా షేరు/రంగం ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. ఈ వారం పలు ప్రభుత్వ రంగ కంపెనీలు డివిడెండ్ చెల్లించనున్నాయి. దేశంలో కొవిడ్ కేసుల పెరుగుదలను గమనించాలి. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా మదుపర్లు, మ్యూచువల్ ఫండ్లు, దేశీయ సంస్థాగత సంస్థలు లాభాలు లేదా నష్టాలు స్వీకరించే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయంగా చూస్తే.. చైనా పారిశ్రామిక లాభాలు, అమెరికా వాణిజ్య లోటు, బ్రిటన్ కన్జూమర్ క్రెడిట్, ఈసీబీ జనరల్ కౌన్సిల్ సమావేశం, అమెరికా జీడీపీ వృద్ధి గణాంకాలు కీలకం కానున్నాయి. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్ఐఐ కొనుగోళ్ల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు. చమురు ధరల క్షీణత, డీఐఐల కొనుగోళ్లతో దిగువ స్థాయుల్లో సెంటిమెంట్కు మద్దతు లభించొచ్చు.
తక్షణ మద్దతు స్థాయులు: 57,000, 56,147, 55,816
తక్షణ నిరోధ స్థాయులు: 58,067, 58,500, 59510
56,147- 57,000 పాయింట్ల దిగువన సెన్సెక్స్ మరింత బలహీనపడొచ్చు.
సతీశ్ కంతేటి, జెన్ మనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్మన్కు 25 ఏళ్ల జైలు శిక్ష
Sam Bankman Fried: క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడ్డట్లు నవంబరులో తేల్చిన న్యూయార్క్ కోర్టు తాజాగా ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ