బలహీనతలు కొనసాగొచ్చు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారమూ బలహీనంగానే కదలాడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ-50 గత వారం 17,200 స్థాయికి ఎగువకు వెళ్లడంలో విఫలం కావడాన్ని దర్పణంగా చూపుతున్నారు.
17,200 పైనే లాభాలకు అవకాశం
సిమెంటు, ఔషధ రంగాలు రాణించొచ్చు
బ్యాంకింగ్ షేర్లలో ఒత్తిడి కనిపించొచ్చు
విశ్లేషకుల అంచనాలు
గురువారం ‘శ్రీరామనవమి’ సెలవు
స్టాక్ మార్కెట్ ఈ వారం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారమూ బలహీనంగానే కదలాడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ-50 గత వారం 17,200 స్థాయికి ఎగువకు వెళ్లడంలో విఫలం కావడాన్ని దర్పణంగా చూపుతున్నారు. ప్రభావం చూపే వార్తలు లేనందున నిఫ్టీ 16,800-17,200 స్థాయిలో కదలాడొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఒక వేళ 17,200 పైన ముగిస్తే 17,600 వరకు వెళ్లేందుకు అవకాశం ఉందని; దిగువకు వస్తే 16,500-16,800 మధ్య చలించొచ్చని చెబుతున్నారు. శ్రీరామ నవమి పండగ సందర్భంగా మార్కెట్లకు గురువారం సెలవు కావడంతో, ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. నెలవారీ ఎఫ్అండ్ఓ కాంట్రాక్టుల గడువు బుధవారం ముగియనుంది. ఈ ప్రభావమూ మార్కెట్పై కనిపించొచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే...
* అంతర్జాతీయ బ్యాంకింగ్ పరిణామాలు, స్థూల ఆర్థిక అంచనాల్లో మార్పుల ఆధారంగా ఐటీ షేర్లు చలించొచ్చు. యాక్సెంచర్ బలమైన ఫలితాలు భారత ఐటీ కంపెనీలకు సానుకూలతలు తీసుకురావొచ్చు. అయితే 19,000 ఉద్యోగాలను తొలగించనుండటం ప్రతికూం.
* అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు క్షీణిస్తున్నందున ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి చమురు శుద్ధి కంపెనీలు రాణించే అవకాశం ఉంది. చమురు ఉత్పత్తి చేసే ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి కంపెనీల షేర్లు ప్రతికూలంగా చలించొచ్చు.
* గత వారం స్థిరీకరించుకున్న ఔషధ కంపెనీల షేర్లు ఈ వారం లాభాలందుకోవచ్చు. రక్షణాత్మకమైన ఈ రంగ కంపెనీలపై దృష్టి సారించొచ్చు.
* బ్యాంకింగ్ షేర్లు ఒత్తిడికి లోనుకావొచ్చు. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభానికి తోడు ఆప్షన్ల విక్రయంపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను పెంపు ఇందుకు కారణం కావొచ్చు. బ్యాంక్ నిఫ్టీకి 38,500 వద్ద మద్దతు; 40,000 వద్ద నిరోధం కనిపించొచ్చు.
* యంత్ర పరికరాల షేర్లు స్వల్పకాలంలో మరింత స్థిరీకరణకు గురికావొచ్చు. సీమెన్స్, ఎల్అండ్టీ కంపెనీల్లో ‘బులిష్’ ధోరణి కనిపించొచ్చు. భెల్లో లాభాల స్వీకరణ కనిపిస్తోంది.
* సిమెంటు కంపెనీల షేర్లు రాణించొచ్చు. మౌలిక వసతుల అభివృద్ధి, స్థిరాస్తి విభాగాల్లో అధిక గిరాకీ ఇందుకు దోహదం చేయొచ్చు. ముడి పదార్థాల ధరలు తగ్గడంతో, సిమెంటు ధరలు పెరగకున్నా, కంపెనీల లాభాలు మెరుగుకావొచ్చు.
* పెరుగుతున్న వడ్డీ రేట్లు, కొన్ని కంపెనీల వాహనాల ధరల పెంపు ప్రకటనలు, మార్కెట్ పరిస్థితుల కారణంగా వాహన కంపెనీల షేర్లు ఒత్తిడిలో కొనసాగొచ్చు.
* ప్రస్తుత ఊగిసలాటల్లో లోహ షేర్లు ప్రతికూలంగా చలించొచ్చు. టాటా స్టీల్లో విక్రయాల ఒత్తిడి కనిపించొచ్చు. జేఎస్డబ్ల్యూ స్టీల్ షేరు 200 రోజుల చలన సగటు కిందకు చేరడంతో, బలహీనంగా కనిపిస్తోంది.
* రక్షణాత్మక రంగం కావడంతో ఎఫ్ఎమ్సీజీ షేర్లు ప్రస్తుత బేరిష్ మార్కెట్ నుంచి ప్రయోజనం పొందొచ్చు. వేసవి నేపథ్యంలో వరుణ్ బేవరేజెస్, రాడికో ఖైతాన్, యునైటెడ్ బ్రూవరీస్ వంటి కంపెనీల అమ్మకాలు పెరగొచ్చన్న అంచనాల మధ్య ఈ కంపెనీలపై ‘బులిష్’గా ఉన్నారు.
* సానుకూల వార్తలు లేనందున.. ఎంపిక చేసిన టెలికాం షేర్లలో చలనాలు కనిపించొచ్చు. భారతీ ఎయిర్టెల్ స్క్రిప్నకు రూ.730-750 మధ్య మద్దతు లభించొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే