ఆదుకున్న రిలయన్స్, మారుతీ షేర్లు
రిలయన్స్, మారుతీ, ఎస్బీఐ వంటి పెద్ద షేర్లు ఆదుకోవడంతో సూచీల రెండు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. అమెరికా, ఐరోపా బ్యాంకింగ్ వ్యవస్థల సంక్షోభం నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు.
సమీక్ష
రిలయన్స్, మారుతీ, ఎస్బీఐ వంటి పెద్ద షేర్లు ఆదుకోవడంతో సూచీల రెండు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. అమెరికా, ఐరోపా బ్యాంకింగ్ వ్యవస్థల సంక్షోభం నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. రూపాయి బలపడడం సెంటిమెంట్ను మెరుగుపరచగా, విదేశీ అమ్మకాలు లాభాలను పరిమితం చేశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 3 పైసలు పెరిగి 82.37 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.39% లాభపడి 75.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో జపాన్ మినహా మిగతావి నష్టపోయాయి. ఐరోపా సూచీలు రాణించాయి.
సెన్సెక్స్ ఉదయం 57,566.90 వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్లో 57,415.02 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. మళ్లీ పుంజుకుని లాభాల్లోకి వచ్చింది. ఒకదశలో 58,019.55 వద్ద గరిష్ఠానికి చేరింది. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో 126.76 పాయింట్ల లాభంతో 57,653.86 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 40.65 పాయింట్లు పెరిగి 16,985.70 దగ్గర స్థిరపడింది.
* సోమవారం అదానీ గ్రూప్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదానీ పవర్ 4.98%, అదానీ ట్రాన్స్మిషన్ 4.98%, అదానీ విల్మర్ 4.93%, అదానీ టోటల్ గ్యాస్ 4.91% చొప్పున తగ్గి లోయర్ సర్క్యూట్ను తాకాయి. ఎన్డీటీవీ 4.60%, అదానీ గ్రీన్ 4.40%, అదానీ పోర్ట్స్ 1.43%, ఏసీసీ 1.01%, అదానీ ఎంటర్ప్రైజెస్ 0.99%, అంబుజా 0.59% పడ్డాయి.
* సెన్సెక్స్ 30 షేర్లలో 16 లాభపడ్డాయి. రిలయన్స్ 1.54%, సన్ఫార్మా 1.15%, ఎస్బీఐ 0.87%, కోటక్ బ్యాంక్ 0.80% చొప్పున రాణించాయి. ఎం అండ్ ఎం, పవర్గ్రిడ్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ 1.06% వరకు నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో ఆరోగ్య సంరక్షణ, ఎఫ్ఎమ్సీజీ, బ్యాంకింగ్, లోహ, టెక్ మెరిశాయి. విద్యుత్, యుటిలిటీస్, పరిశ్రమలు, వాహన, స్థిరాస్తి, సేవలు డీలాపడ్డాయి.
* ఏప్రిల్ 1 నుంచి డెట్ మ్యూచువల్ ఫండ్లకు కొత్త పన్ను నిబంధనలు అమల్లోకి రానున్న తరుణంలో పెట్టుబడులు పెంచుకునేందుకు పలు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు చూస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్, మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్, ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్లు అంతర్జాతీయ పథకాలను పునరుద్ధరించాయి.
* ముఖం, నాలుక, ఇతర శరీర భాగాల కదలికల ఇబ్బందుల చికిత్సలో వినియోగించే వాల్బెనైజ్ జనరిక్ క్యాప్సూళ్లకు యూఎస్ఎఫ్డీఏ తాత్కాలిక అనుమతి ఇచ్చినట్లు లుపిన్ తెలిపింది.
* ఆఫ్లైన్ రిటైల్ చెల్లింపుల పైలెట్ ప్రాజెక్ట్కు స్వీడన్ కంపెనీ క్రంచ్ఫిష్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తెలిపింది.
* ఆఫ్రికా దేశం ఘనాలో అపాచీ 180, నియో ఎన్ఎక్స్ సహా ఏడు కొత్త మోడళ్లను టీవీఎస్ మోటార్ కంపెనీ విడుదల చేసింది.
* భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు స్మార్ట్ సిటీలు, గ్రామాల అభివృద్ధిలో ప్రజా-ప్రైవేట్ భాగస్వామ్యాలు (పీపీపీ) కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
* రాఘవ్ బాల్కు చెందిన డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ క్వింటిలియన్ బిజినెస్ మీడియాలో 49 శాతం వాటాను రూ.48 కోట్లకు గౌతమ్ అదానీ సంస్థ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ కొనుగోలు చేసింది.
* బీమా బ్రోకింగ్ వ్యాపారం నుంచి ఆదిత్య బిర్లా క్యాపిటల్ నిష్క్రమించింది. ఈ విభాగాన్ని ఎడ్మీ సర్వీసెస్ వెల్లడించని మొత్తానికి కొనుగోలు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.