ఆద్యంతం ఒడుదొడుకులే
ఆద్యంతం ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు, చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు రాణించినప్పటికీ.. ఐటీ, వాహన షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది.
సమీక్ష
ఆద్యంతం ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు, చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు రాణించినప్పటికీ.. ఐటీ, వాహన షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. మార్చి డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపునకు ముందు మదుపర్ల లాభాల స్వీకరణతో సెంటిమెంట్ దెబ్బతింది. డాలరుతో పోలిస్తే రూపాయి 15 పైసలు పెరిగి 82.16 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 78.51 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు మెరిశాయి.
* సెన్సెక్స్ ఉదయం 57,751.50 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అదే జోరులో 57,949.45 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. గరిష్ఠాల్లో లాభాల్లో వెనక్కి వచ్చిన సూచీ.. ఇంట్రాడేలో 57,494.91 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 40.14 పాయింట్ల నష్టంతో 57,613.72 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 34 పాయింట్లు తగ్గి 16,951.70 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,913.75- 17,016.75 పాయింట్ల మధ్య కదలాడింది.
* వరుసగా రెండో రోజూ అదానీ షేర్లు కుదేలయ్యాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 7.06%, అదానీ పోర్ట్స్ 5.66%, అదానీ పవర్ 5%, అదానీ ట్రాన్స్మిషన్ 5%, అదానీ గ్రీన్ ఎనర్జీ 5%, అదానీ టోటల్ గ్యాస్ 5%, అదానీ విల్మర్ 4.99%, ఎన్డీటీవీ 4.99%, ఏసీసీ 4.22%, అంబుజా సిమెంట్స్ 2.91% నష్టాలు నమోదుచేశాయి.
* సెన్సెక్స్ 30 షేర్లలో 19 డీలాపడ్డాయి. టెక్ మహీంద్రా 2.90%, టాటా మోటార్స్ 2.46%, భారతీ ఎయిర్టెల్ 1.80%, విప్రో 1.40%, బజాజ్ ఫిన్సర్వ్ 1.29%, హెచ్సీఎల్ టెక్ 1.26%, బజాజ్ ఫైనాన్స్ 1.04%, ఎల్ అండ్ టీ 0.95% చొప్పున నష్టపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ 2.33% లాభపడ్డాయి.
* అర్షద్ వార్సీకి ఉపశమనం: యూట్యూబ్లో తప్పుదోవ పట్టించే వీడియోలకు సంబంధించిన కేసులో బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ, ఆయన భార్య మరియా గోరెట్టీలకు ఉపశమనం లభించింది. పంప్ అండ్ డంప్ పథకం ఆరోపణలపై మార్చి 2న వార్సీ దంపతులతో పాటు 31 సంస్థలపై సెబీ నిషేధం విధించింది. తాజాగా సెబీ ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రైబ్యునల్ (శాట్) పక్కన పెట్టింది.
* సహారా ఇండియా గ్రూప్ సంస్థ, దాని అధిపతి సుబ్రతా రాయ్, ఇతరుల నుంచి రావాల్సిన రూ.6.57 కోట్ల బకాయిలను వసూలు చేసినట్లు సెబీ తెలిపింది.
* వ్యాపారాన్ని సులభతరం చేయడం, రిజిస్ట్రేషన్కు పట్టే సమయాన్ని తగ్గించడంలో భాగంగా విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్ల (ఎఫ్పీఐల) ఆన్బోర్డింగ్ ప్రక్రియను సెబీ సులభతరం చేసింది.
* ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల సంస్థ అవలాన్ టెక్నాలజీస్ రాబోయే ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.415-436గా నిర్ణయించింది. ఏప్రిల్ 3న ప్రారంభం కానున్న ఈ రూ.865 కోట్ల ఐపీఓ.. 6వ తేదీన ముగియనుంది.
* సెకండ్ స్పెషల్ సిచ్యుయేషన్స్ ఫండ్ కోసం 1.25 బిలియన్ డాలర్లను సమీకరించినట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ అనుబంధ సంస్థ కోటక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రకటించింది.
* పెన్షన్ నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) అంబుడ్స్మన్ వయసు పరిమితిని 65 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచింది. అంబుడ్స్మన్ పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. మరో రెండేళ్ల వరకూ పొడిగించే వీలుంటుంది. ఫిర్యాదులను పరిష్కరించేందుకు పీఎఫ్ఆర్డీఏ అంబుడ్స్మన్ను నియమిస్తుంది.
* కల్యాణ్ జ్యువెలర్స్లో 2.26 శాతం షేర్లను హైడెల్ ఇన్వెస్ట్మెంట్స్ ఓపెన్ మార్కెట్ లావాదేవీలో విక్రయించింది. ఒక్కో షేరును రూ.110.04 చొప్పున మొత్తం 2,33,25,686 షేర్లను రూ.256.67 కోట్లకు విక్రయించింది. డిసెంబరు త్రైమాసికం నాటికి కల్యాణ్ జ్యువెలర్స్లో హైడెల్ ఇన్వెస్ట్మెంట్స్కు 26.36 శాతం వాటా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్
Stock market closing bell: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 736, నిఫ్టీ 238 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
Realme Narzo 70 Pro: ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్తో రియల్మీ నార్జో 70 ప్రో
Realme Narzo 70 Pro 5G: రియల్మీ సంస్థ నార్జో 70 ప్రోను లాంచ్ చేసింది. దీని ధరను రూ.18,999గా నిర్ణయించింది. మార్చి 22 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. -
TCS: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో వేతన పెంపు!
TCS: ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ ఆన్సైట్, ఆఫ్సైట్ ఉద్యోగుల వేతనాలు పెంచనుంది. పనితీరు కనబరిచిన వారికి ఏకంగా 12-15 శాతం పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
Ashwini Vaishnaw: ఈ ఏడాది చివరి నాటికి ‘మేడిన్ ఇండియా’ చిప్ తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2026లోనే బుల్లెట్ రైలు పట్టాలెక్కనున్నట్లు తెలిపారు. -
Stock market: భారీ నష్టాల్లో మార్కెట్లు.. పతనానికి కారణాలు ఇవే!
Stock market: దేశీయస్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 700 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 22వేల స్థాయిని కోల్పోయింది. -
Elon Musk: ‘అవును కెటమిన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్
మానసిక కుంగుబాటు నుంచి బయటపడేందుకు గతంలో డ్రగ్స్ వినియోగించినట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు. -
‘ఆ వార్తలు అవాస్తవం’: అమెరికా దర్యాప్తు చేపట్టిందన్న కథనంపై అదానీ గ్రూప్ స్పందన
లంచం ఆరోపణల విషయంలో దర్యాప్తు గురించి వెలువడిన మీడియా కథనం అవాస్తవమని అదానీ గ్రూప్(Adani Group) వెల్లడించింది. -
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. -
2024-25లోనూ ఐటీ నియామకాలు అంతంతే
ఐటీ రంగం ఆకర్షణీయ వృద్ధి బాట పట్టేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పరిస్థితి ఉంటుందనే అంశమే కాస్త ఊరట కలిగిస్తోంది. -
దీర్ఘకాలంలో చిన్న, మధ్య షేర్లు బలంగానే
చిన్న, మధ్య స్థాయి షేర్ల విలువలు మరీ అధిక స్థాయికి చేరాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చేసిన వ్యాఖ్యలతో ఈ షేర్లు గత 3 వారాల్లో భారీగా కుదేలయ్యాయి. -
ఆఫీసుకు వస్తేనే పదోన్నతులు
కార్యాలయాలకు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని తమ ఉద్యోగులకు స్పష్టం చేస్తూ ల్యాప్ట్యాప్ల తయారీ కంపెనీ డెల్ లేఖ పంపినట్లు తెలుస్తోంది. -
రూ.1991కే ఫ్లై91 ప్రయాణం
ఫ్లై91 సంస్థ సోమవారం తన విమాన సర్వీసులను ప్రారంభించింది. మొదటి విమానం గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం గం.7.55కు బయలుదేరి వెళ్లింది. -
ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగింది: హైర్ ప్రో
అంతక్రితం ఏడాదితో పోలిస్తే, 2022-23 ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగినట్లు ఏఐ పవర్డ్ రిక్రూట్మెంట్ ఆటోమేషన్ సంస్థ హైర్ ప్రో నివేదిక వెల్లడించింది. -
అంకురాలకు విలువే సర్వస్వం కాదు
పారదర్శకత, నైతిక ప్రవర్తన కోసం స్వీయ నియంత్రణ విధానాన్ని దేశీయ అంకుర సంస్థలు అవలంబించాలని జీ20లో భారత తరపు ప్రధాన ప్రతినిధి (షెర్పా) అమితాబ్ కాంత్ తెలిపారు. -
మదుపర్ల అప్రమత్తత
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనున్నందున, మదుపర్లు అప్రమత్తత పాటించారు. -
బీమా రంగంలోకి రూ.54,000 కోట్ల ఎఫ్డీఐ
గత తొమ్మిదేళ్లలో బీమా రంగం రూ.54,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను ఆకర్షించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. -
బెంగళూరు- లక్షద్వీప్ విమాన సర్వీసు: ఇండిగో
లక్షద్వీప్కు విమాన సదుపాయాన్ని విస్తరించడంలో భాగంగా ఈనెల 31 నుంచి బెంగళూరు- అగత్తి మధ్య నేరుగా విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఇండిగో సోమవారం వెల్లడించింది. -
మనవడికి రూ.240 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, తన మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి భారీ బహుమతి ఇచ్చారు. -
సంక్షిప్త వార్తలు
ఈ వేసవిలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అంతర్జాతీయ విమాన సర్వీసులను 20 శాతానికి పైగా పెంచనుంది. దేశ, విదేశీ మార్గాల్లో రోజువారీ 360కి పైగా విమాన సర్వీసులను నడపబోతోంది. -
WhatsApp: వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువుగా.. ఇక చాట్ లిస్ట్లోనే
WhatsApp payments: వాట్సప్లో పేమెంట్స్ ఇక మరింత సులువు కానుంది. చాట్ లిస్ట్లోనే ఇకపై క్యూఆర్ కోడ్ స్కానర్ కనిపించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నాడు హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
-
IPL: ఐపీఎల్ 2024 సీజన్. కోహ్లీ కొత్త హెయిర్స్టైల్ అదుర్స్.. ఫొటోలు వైరల్
-
Nalgonda: ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి.. పెళ్లి చూపుల్లో బయటపడిన యువతి మోసం
-
NDA: ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు రంగంలోకి రాజ్..!
-
Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్
-
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్