IRDAI: బీమా ఏజెంట్ల కమీషన్పై పరిమితి తొలగింపు
బీమా కంపెనీలు తమ ఏజెంట్లకు చెల్లించే కమీషన్పై పరిమితిని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) తొలగించింది. బీమా అగ్రిగేటర్లు, బ్రోకర్లకూ ఇది వర్తిస్తుంది.
అగ్రిగేటర్లు, బ్రోకర్లకూ వర్తింపు
అమల్లోకి రానున్న ‘మొత్తం వ్యయాల పరిమితి’ విధానం
నోటిఫికేషన్ జారీ చేసిన ఐఆర్డీఏఐ
ఈనాడు, హైదరాబాద్: బీమా కంపెనీలు తమ ఏజెంట్లకు చెల్లించే కమీషన్పై పరిమితిని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) తొలగించింది. బీమా అగ్రిగేటర్లు, బ్రోకర్లకూ ఇది వర్తిస్తుంది. అదే సమయంలో బీమా కంపెనీల మొత్తం వ్యయాలపై పరిమితిని విధించింది. ఈ మేరకు తాజాగా ఒక నోటిఫికేషన్ను నియంత్రణ సంస్థ జారీ చేసింది. పాలసీదార్లు, ఏజెంట్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బీమా కంపెనీల నూతన కమీషన్ల విధానాన్ని నిర్దేశించుకోవాలని అందులో పేర్కొంది. కమీషన్ల చెల్లింపు, బీమా కంపెనీల మొత్తం వ్యయాల పరిమితికి లోబడి ఉండాలని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిబంధనలను ప్రతి మూడేళ్లకోసారి సమీక్షించనున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకూ ఒక్కో బీమా పాలసీ విషయంలో ఏజెంట్లకు చెల్లించే కమీషన్లకు ఐఆర్డీఏఐ అనుమతి ఇస్తూ వస్తున్న విషయం విదితమే.
పాలసీదార్లకు మేలు జరుగుతుందా?: కొత్త నిబంధనలకు సంబంధించి ఐఆర్డీఏఐ జారీ చేసిన ముసాయిదా ప్రకారం సాధారణ బీమా కంపెనీలు చెల్లించే కమీషన్పై 20 శాతం పరిమితి ఉంది. అంతకు ముందు ఈ పరిమితి 30- 35 శాతం కావటం గమనార్హం. బీమా కంపెనీల వ్యయాలు 70 శాతం కంటే తక్కువ ఉన్న పక్షంలో, ఆ కంపెనీలు తమ కమీషన్ రేట్లను సొంతంగా నిర్ణయించుకోవచ్చు. కానీ వ్యయాలు 70 శాతం కంటే ఎక్కువ ఉన్న బీమా కంపెనీలు మాత్రం పాలసీ ప్రీమియం మొత్తాల్లో 2 నుంచి 20 శాతం వరకూ కమీషన్ చెల్లించటానికి వీలుంది. ప్రస్తుతం అధిక వ్యయాలు మోస్తున్న బీమా కంపెనీలు, ఈ మార్పుల వల్ల గ్యారెంటీడ్ బీమా పాలసీలపై కమీషన్లు తగ్గించాల్సి వస్తుంది. అదే సమయంలో ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి పెద్ద కంపెనీల వ్యయాలు 70 శాతం కంటే తక్కువ ఉన్నందున, ఆ సంస్థలు ఏజెంట్లకు చెల్లించే కమీషన్లను సొంతంగా నిర్ణయించుకోవచ్చు. చిన్న బీమా కంపెనీలకు ఇటువంటి వెసులుబాటు ఉండదు. అదే సమయంలో కమీషన్లు తగ్గితే పాలసీదార్లకు బాగా మేలు జరుగుతుందని చెప్పలేమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
ప్రీమియం మొత్తాలు తగ్గుతాయా?
ఏది ఏదేమైనప్పటికీ ప్రస్తుత మార్పుల వల్ల బీమా కంపెనీలు తమ వ్యయాల విషయంలో విచక్షణను పాటించే అవకాశం ఏర్పడింది. అధిక లాభాలు ఆర్జించటం కోసం కొన్ని చోట్ల వ్యయాలు తగ్గించుకొని, మరికొన్ని చోట్ల వ్యయాలు పెంచుకునేందుకు వీలు కలుగుతుంది. ఇది పరిశ్రమకు ఎంతో మేలు చేసే నిర్ణయమని శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ అనిల్ కుమార్ అగర్వాల్ అన్నారు. ఏజెంట్లకు కమీషన్ చెల్లింపుపై పరిమితి ఎత్తివేయటం వల్ల పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందని విశ్లేషించారు. అంతేగాక వినూత్నమైన బీమా పాలసీలు ఆవిష్కరించే వీలు కలుగుతుందని, మార్కెటింగ్-పంపిణీ విషయాల్లో కొత్తదనాన్ని తీసుకురావచ్చని అన్నారు. ప్రధానంగా వినియోగదారుడిని దృష్టిలో పెట్టుకొని బీమా పాలసీలను రూపొందించే అవకాశం ఉంటుందన్నారు. ఎక్కువ మంది ప్రజలకు బీమా సదుపాయాలు దగ్గరయ్యేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని వివరించారు. ఐఆర్డీఏఐ సరైన నిర్ణయం తీసుకున్నట్లు బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ తపన్ సింఘేల్ వివరించారు. పాలసీ స్థాయిలో కమీషన్లు చెల్లించటం కాకుండా, కంపెనీ మొత్తానికి వ్యయాల పరిమితిని నిర్దేశించటం బీమా కంపెనీలకు మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతేగాక బీమా కంపెనీల్లో వ్యయ క్రమశిక్షణను ఈ నిర్ణయం తీసుకువస్తుందని అన్నారు. తత్ఫలితంగా సమీప భవిష్యత్తులో బీమా పాలసీల ప్రీమియం మొత్తాలు తగ్గే అవకాశం ఉంటుందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Elon Musk: ‘అవును కెటమిన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్
మానసిక కుంగుబాటు నుంచి బయటపడేందుకు గతంలో డ్రగ్స్ వినియోగించినట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు. -
‘ఆ వార్తలు అవాస్తవం’: అమెరికా దర్యాప్తు చేపట్టిందన్న కథనంపై అదానీ గ్రూప్ స్పందన
లంచం ఆరోపణల విషయంలో దర్యాప్తు గురించి వెలువడిన మీడియా కథనం అవాస్తవమని అదానీ గ్రూప్(Adani Group) వెల్లడించింది. -
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. -
2024-25లోనూ ఐటీ నియామకాలు అంతంతే
ఐటీ రంగం ఆకర్షణీయ వృద్ధి బాట పట్టేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పరిస్థితి ఉంటుందనే అంశమే కాస్త ఊరట కలిగిస్తోంది. -
దీర్ఘకాలంలో చిన్న, మధ్య షేర్లు బలంగానే
చిన్న, మధ్య స్థాయి షేర్ల విలువలు మరీ అధిక స్థాయికి చేరాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చేసిన వ్యాఖ్యలతో ఈ షేర్లు గత 3 వారాల్లో భారీగా కుదేలయ్యాయి. -
ఆఫీసుకు వస్తేనే పదోన్నతులు
కార్యాలయాలకు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని తమ ఉద్యోగులకు స్పష్టం చేస్తూ ల్యాప్ట్యాప్ల తయారీ కంపెనీ డెల్ లేఖ పంపినట్లు తెలుస్తోంది. -
రూ.1991కే ఫ్లై91 ప్రయాణం
ఫ్లై91 సంస్థ సోమవారం తన విమాన సర్వీసులను ప్రారంభించింది. మొదటి విమానం గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం గం.7.55కు బయలుదేరి వెళ్లింది. -
ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగింది: హైర్ ప్రో
అంతక్రితం ఏడాదితో పోలిస్తే, 2022-23 ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగినట్లు ఏఐ పవర్డ్ రిక్రూట్మెంట్ ఆటోమేషన్ సంస్థ హైర్ ప్రో నివేదిక వెల్లడించింది. -
అంకురాలకు విలువే సర్వస్వం కాదు
పారదర్శకత, నైతిక ప్రవర్తన కోసం స్వీయ నియంత్రణ విధానాన్ని దేశీయ అంకుర సంస్థలు అవలంబించాలని జీ20లో భారత తరపు ప్రధాన ప్రతినిధి (షెర్పా) అమితాబ్ కాంత్ తెలిపారు. -
మదుపర్ల అప్రమత్తత
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనున్నందున, మదుపర్లు అప్రమత్తత పాటించారు. -
బీమా రంగంలోకి రూ.54,000 కోట్ల ఎఫ్డీఐ
గత తొమ్మిదేళ్లలో బీమా రంగం రూ.54,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను ఆకర్షించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. -
బెంగళూరు- లక్షద్వీప్ విమాన సర్వీసు: ఇండిగో
లక్షద్వీప్కు విమాన సదుపాయాన్ని విస్తరించడంలో భాగంగా ఈనెల 31 నుంచి బెంగళూరు- అగత్తి మధ్య నేరుగా విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఇండిగో సోమవారం వెల్లడించింది. -
మనవడికి రూ.240 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, తన మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి భారీ బహుమతి ఇచ్చారు. -
సంక్షిప్త వార్తలు
ఈ వేసవిలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అంతర్జాతీయ విమాన సర్వీసులను 20 శాతానికి పైగా పెంచనుంది. దేశ, విదేశీ మార్గాల్లో రోజువారీ 360కి పైగా విమాన సర్వీసులను నడపబోతోంది. -
WhatsApp: వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువుగా.. ఇక చాట్ లిస్ట్లోనే
WhatsApp payments: వాట్సప్లో పేమెంట్స్ ఇక మరింత సులువు కానుంది. చాట్ లిస్ట్లోనే ఇకపై క్యూఆర్ కోడ్ స్కానర్ కనిపించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
Hyd News: నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
-
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
-
Elon Musk: ‘అవును కెటమిన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్
-
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగిన క్రికెటర్
-
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్దేవ్బాబాకు సుప్రీంకోర్టు సమన్లు
-
SS Rajamouli: త్వరలో షూటింగ్.. మహేశ్ మూవీపై జక్కన్న అప్డేట్