IRDAI: బీమా ఏజెంట్ల కమీషన్పై పరిమితి తొలగింపు
బీమా కంపెనీలు తమ ఏజెంట్లకు చెల్లించే కమీషన్పై పరిమితిని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) తొలగించింది. బీమా అగ్రిగేటర్లు, బ్రోకర్లకూ ఇది వర్తిస్తుంది.
అగ్రిగేటర్లు, బ్రోకర్లకూ వర్తింపు
అమల్లోకి రానున్న ‘మొత్తం వ్యయాల పరిమితి’ విధానం
నోటిఫికేషన్ జారీ చేసిన ఐఆర్డీఏఐ
ఈనాడు, హైదరాబాద్: బీమా కంపెనీలు తమ ఏజెంట్లకు చెల్లించే కమీషన్పై పరిమితిని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) తొలగించింది. బీమా అగ్రిగేటర్లు, బ్రోకర్లకూ ఇది వర్తిస్తుంది. అదే సమయంలో బీమా కంపెనీల మొత్తం వ్యయాలపై పరిమితిని విధించింది. ఈ మేరకు తాజాగా ఒక నోటిఫికేషన్ను నియంత్రణ సంస్థ జారీ చేసింది. పాలసీదార్లు, ఏజెంట్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బీమా కంపెనీల నూతన కమీషన్ల విధానాన్ని నిర్దేశించుకోవాలని అందులో పేర్కొంది. కమీషన్ల చెల్లింపు, బీమా కంపెనీల మొత్తం వ్యయాల పరిమితికి లోబడి ఉండాలని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిబంధనలను ప్రతి మూడేళ్లకోసారి సమీక్షించనున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకూ ఒక్కో బీమా పాలసీ విషయంలో ఏజెంట్లకు చెల్లించే కమీషన్లకు ఐఆర్డీఏఐ అనుమతి ఇస్తూ వస్తున్న విషయం విదితమే.
పాలసీదార్లకు మేలు జరుగుతుందా?: కొత్త నిబంధనలకు సంబంధించి ఐఆర్డీఏఐ జారీ చేసిన ముసాయిదా ప్రకారం సాధారణ బీమా కంపెనీలు చెల్లించే కమీషన్పై 20 శాతం పరిమితి ఉంది. అంతకు ముందు ఈ పరిమితి 30- 35 శాతం కావటం గమనార్హం. బీమా కంపెనీల వ్యయాలు 70 శాతం కంటే తక్కువ ఉన్న పక్షంలో, ఆ కంపెనీలు తమ కమీషన్ రేట్లను సొంతంగా నిర్ణయించుకోవచ్చు. కానీ వ్యయాలు 70 శాతం కంటే ఎక్కువ ఉన్న బీమా కంపెనీలు మాత్రం పాలసీ ప్రీమియం మొత్తాల్లో 2 నుంచి 20 శాతం వరకూ కమీషన్ చెల్లించటానికి వీలుంది. ప్రస్తుతం అధిక వ్యయాలు మోస్తున్న బీమా కంపెనీలు, ఈ మార్పుల వల్ల గ్యారెంటీడ్ బీమా పాలసీలపై కమీషన్లు తగ్గించాల్సి వస్తుంది. అదే సమయంలో ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి పెద్ద కంపెనీల వ్యయాలు 70 శాతం కంటే తక్కువ ఉన్నందున, ఆ సంస్థలు ఏజెంట్లకు చెల్లించే కమీషన్లను సొంతంగా నిర్ణయించుకోవచ్చు. చిన్న బీమా కంపెనీలకు ఇటువంటి వెసులుబాటు ఉండదు. అదే సమయంలో కమీషన్లు తగ్గితే పాలసీదార్లకు బాగా మేలు జరుగుతుందని చెప్పలేమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
ప్రీమియం మొత్తాలు తగ్గుతాయా?
ఏది ఏదేమైనప్పటికీ ప్రస్తుత మార్పుల వల్ల బీమా కంపెనీలు తమ వ్యయాల విషయంలో విచక్షణను పాటించే అవకాశం ఏర్పడింది. అధిక లాభాలు ఆర్జించటం కోసం కొన్ని చోట్ల వ్యయాలు తగ్గించుకొని, మరికొన్ని చోట్ల వ్యయాలు పెంచుకునేందుకు వీలు కలుగుతుంది. ఇది పరిశ్రమకు ఎంతో మేలు చేసే నిర్ణయమని శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ అనిల్ కుమార్ అగర్వాల్ అన్నారు. ఏజెంట్లకు కమీషన్ చెల్లింపుపై పరిమితి ఎత్తివేయటం వల్ల పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందని విశ్లేషించారు. అంతేగాక వినూత్నమైన బీమా పాలసీలు ఆవిష్కరించే వీలు కలుగుతుందని, మార్కెటింగ్-పంపిణీ విషయాల్లో కొత్తదనాన్ని తీసుకురావచ్చని అన్నారు. ప్రధానంగా వినియోగదారుడిని దృష్టిలో పెట్టుకొని బీమా పాలసీలను రూపొందించే అవకాశం ఉంటుందన్నారు. ఎక్కువ మంది ప్రజలకు బీమా సదుపాయాలు దగ్గరయ్యేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని వివరించారు. ఐఆర్డీఏఐ సరైన నిర్ణయం తీసుకున్నట్లు బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ తపన్ సింఘేల్ వివరించారు. పాలసీ స్థాయిలో కమీషన్లు చెల్లించటం కాకుండా, కంపెనీ మొత్తానికి వ్యయాల పరిమితిని నిర్దేశించటం బీమా కంపెనీలకు మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతేగాక బీమా కంపెనీల్లో వ్యయ క్రమశిక్షణను ఈ నిర్ణయం తీసుకువస్తుందని అన్నారు. తత్ఫలితంగా సమీప భవిష్యత్తులో బీమా పాలసీల ప్రీమియం మొత్తాలు తగ్గే అవకాశం ఉంటుందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
విమానాల్లో తల్లిదండ్రులకు పక్కనే చిన్నారులకు సీటు కేటాయించాలని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది. -
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
Patanjali: పతంజలి ఉత్పత్తుల ప్రయోజనాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఆ కంపెనీపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని తెలపగా.. అది ఏ సైజ్లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది. -
జొమాటో ప్లాట్ఫాం ఫీజు రూ.5కు పెంపు
ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది. -
సంక్షిప్త వార్తలు(5)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్ పికప్ జోన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం