సంక్షిప్త వార్తలు(7)
మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) 1986-87 నుంచి ఇప్పటి వరకు 25 లక్షల వాహనాల ఎగుమతుల మైలురాయిని అధిగమించినట్లు పేర్కొంది.
మారుతీ వాహన ఎగుమతులుజీ @ 25 లక్షలు
దిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) 1986-87 నుంచి ఇప్పటి వరకు 25 లక్షల వాహనాల ఎగుమతుల మైలురాయిని అధిగమించినట్లు పేర్కొంది. భారత్కు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్లకు 1986-87 నుంచి ఎగుమతులు ప్రారంభించిన ఎంఎస్ఐ ప్రస్తుతం ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, మధ్య ప్రాచ్యంలోని సుమారు 100 దేశాలకు వాహనాలను ఎగుమతి చేస్తోంది. గుజరాత్ ముంద్రా పోర్టు నుంచి లాటిన్ అమెరికాకు ఎగుమతి చేసిన బాలెనోతో 25 లక్షల మార్కును అధిగమించినట్లు కంపెనీ తెలిపింది.
మహీంద్రా థార్ ఉత్పత్తి జీ 1,00,000: తమ స్పోర్ట్స్ వినియోగ వాహనం థార్ల సంచిత (క్యుములేటివ్) ఉత్పత్తి 2.5 ఏళ్లలో లక్ష మైలురాయిని అధిగమించినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) బుధవారం వెల్లడించింది.
గ్రాన్యూల్స్ గాబాపెంటిన్ మాత్రలకు యూఎస్ఎఫ్డీఏ అనుమతి
ఈనాడు, హైదరాబాద్: గ్రాన్యూల్స్ ఇండియా తన గాబాపెంటిన్ మాత్రలకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్ఎఫ్డీఏ) నుంచి అనుమతి సంపాదించింది. ఈ ఔషధాన్ని నరాల సంబంధిత వ్యాధి చికిత్సలో వినియోగిస్తున్నారు. గాబాపెంటిన్ 600 ఎంజీ, 800 ఎంజీ ట్యాబ్లెట్లకు అనుమతి లభించినట్లు గ్రాన్యూల్స్ ఇండియా పేర్కొంది. వయాట్రిస్ స్పెషాలిటీ ఎల్ఎల్సీ. అనే సంస్థ న్యూరాంటిన్ అనే బ్రాండు పేరుతో ఈ ఔషధాన్ని విక్రయిస్తోంది. యూఎస్లో ఏటా దాదాపు 145 మిలియన్ డాలర్ల అమ్మకాలను ఈ మందు నమోదు చేస్తోంది. దీంతో కలిసి యూఎస్తో తమకు 55 ఔషధాలకు అనుమతి లభించినట్లు అవుతుందని గ్రాన్యూల్స్ ఇండియా వెల్లడించింది.
అసోచామ్ అధ్యక్షుడిగా అజయ్ సింగ్
ఈనాడు, హైదరాబాద్: భారత్లోని పరిశ్రమ సంఘాల్లో ఒకటైన అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్) అధ్యక్షుడిగా స్పైస్జెట్ సీఎండీ అజయ్ సింగ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అసోఛామ్ సీనియర్ ఉపాధ్యక్షుడిగా సోరిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఛైర్మన్ సంజయ్ నాయర్ వ్యవహరిస్తారు. వందేళ్లకు పైగా సేవలు అందిస్తున్న అసోచామ్ వంటి ప్రతిష్ఠాత్మకమైన సంస్థకు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు అజయ్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎంతో వేగంగా మారుతున్న ప్రస్తుత ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్థిక వేత్తలు, విద్యావేత్తలతో కలిసి పనిచేసేందుకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన వివరించారు.
ఈ ఏడాది సరాసరి వేతన పెంపు 9.1%
డెలాయిట్ ఇండియా అధ్యయనం
ముంబయి: ఈ ఏడాది సరాసరి వేతన పెంపు 9.1 శాతానికి తగ్గొచ్చని డెలాయిట్ ఇండియా టాలెంట్ అవుట్లుక్ 2023 నివేదికలో వెల్లడించింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, ఆర్థిక వ్యవస్థలో మందగమనం వంటి అంశాలు వేతనాలపై ప్రభావం చూపుతాయని పేర్కొంది. 2022లో సరాసరి వేతన పెంపు 9.4 శాతంగా ఉన్నట్లు తెలిపింది. 2023లో లైఫ్సైన్సెస్ రంగంలో అత్యధిక వేతన పెంపు ఉండొచ్చని అంచనా వేసింది. ఐటీ రంగంలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి వేతనాల పెంపు తక్కువగా ఉంటుందని తెలిపింది. దేశంలో వలసల రేటు 2022లో 19.7 శాతానికి పెరిగిందని, 2021లో ఈ రేటు 19.4 శాతంగా ఉందని వివరించింది. 2023 జనవరిలో 7 రంగాలు, 25 ఉప రంగాల్లోని 300 సంస్థలపై అధ్యయనం చేసి డెలాయిట్ ఇండియా ఈ నివేదికను రూపొందించింది.
జేఎస్డబ్ల్యూ ఎనర్జీ చేతికి మిత్రా ఎనర్జీ ఆస్తులు
దిల్లీ: మిత్రా ఎనర్జీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన 1753 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఆస్తులను రూ.10,150 కోట్లకు కొనుగోలు చేయడం పూర్తి చేసినట్లు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ప్రకటించింది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ ఈ కొనుగోలును పూర్తి చేసింది. దేశంలోని దక్షిణ, పశ్చిమ, మధ్య రాష్ట్రాల్లో కంపెనీకి 1331 మెగావాట్ల పవన విద్యుత్, 422 మెగావాట్ల సౌరశక్తి విద్యుత్ పోర్ట్ఫోలియో ఉంది. వీటికి ఇంకా 17 ఏళ్ల సగటు కాలవ్యవధి ఉంది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ స్థాపించిన తర్వాత ఇదే అతిపెద్ద కొనుగోలు కావడం గమనార్హం.
కీలక రేట్లు మరో పావు శాతం పెంపు!
యాక్సిస్ బ్యాంకు ఆర్థికవేత్తల అంచనా
ముంబయి: వచ్చే నెల జరగనున్న పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు (పావు శాతం) పెంచే అవకాశం ఉందని యాక్సిస్ బ్యాంకుకు చెందిన ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత రేట్ల పెంపు ప్రక్రియలో.. ఇదే చివరిది కావొచ్చని అభిప్రాయపడ్డారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కీలక రేట్లను తగ్గించడాన్ని ఆర్బీఐ ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. కాగా.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ఉద్దేశంతో మే 2022 నుంచి ఆర్బీఐ కీలక రేట్లను 250 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం రుణ గ్రహీతల ఈఎంఐల (నెలవారీ వాయిదాల) భారాన్ని పెంచింది.
సంక్షిప్తంగా..
* భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే దశాబ్దం పాటు 6.5 శాతం వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ వెల్లడించారు.
* 4 సహారా గ్రూప్ సహకార సంఘాలకు చెందిన 10 కోట్ల మంది మదుపర్లకు 9 నెలల్లోగా వారి నగదు వెనక్కి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. సహారా-సెబీ రిఫండ్ ఖాతా నుంచి రూ.5,000 కోట్లను సెంట్రల్ రిజిస్ట్రార్కు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడం ఇందుకు నేపథ్యం.
* దేశీయ మొబైల్ తయారీని ప్రోత్సహించే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద పెట్టుబడుల లక్ష్యాన్ని రూ.5,124 కోట్లకు పెంచినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పార్లమెంటుకు తెలిపారు.
* 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాతో పాటు మొత్తం 6 టెలికాం కంపెనీలకు రూ.4.17 లక్షల కోట్ల అప్పులున్నాయని కేంద్ర టెలికాం సహాయ మంత్రి దేవ్సిన్హ్ చౌహాన్ పార్లమెంట్కు తెలిపారు.
* ఇండస్ఇండ్ బ్యాంక్తో ఉన్న వివాదాలను పరిష్కరించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీ ఎంటర్టైన్మెంట్ తెలిపింది. దీంతో షేరు 3 శాతానికిపైగా పెరిగి బీఎస్ఈలో రూ.216 వద్ద ముగిసింది.
* భారతీయ రైల్వేలకు 300 విద్యుత్ లోకోలను డెలివరీ చేసినట్లు ఫ్రెంచ్ బహుళజాతి రోలింగ్ స్టాక్ తయారీ సంస్థ ఆల్స్టోమ్ బుధవారం వెల్లడించింది.
* మధ్యప్రాచ్యం, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో విమానయాన ధరలు పెరుగుతుండటంతో ఈ రంగ రికవరీకి ప్రమాదం పొంచి ఉందని అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి (ఏసీఐ)-ఆసియా పసిఫిక్ తెలిపింది.
* వచ్చే మే నుంచి కృష్ణా-గోదావరి (కేజీ-డి5) బ్లాక్లో చమురు ఉత్పత్తిని, 2024లో సహజ వాయువు ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఓఎన్జీసీ వెల్లడించింది.
* 2030 నాటికి ఏడాదికి 10 లక్షల విద్యుత్ వాహనాలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో కర్ణాటకలో నర్సాపుర ప్లాంటును ఏర్పాటు చేసినట్లు హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తెలిపింది.
* ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త నవీన్ జిందాల్కుడల్లాస్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం జీవనకాల సాఫల్య పురస్కారం అందించింది.
* బహరామ్పోర్-ఫరక్కా హైవేస్ లిమిటెడ్ను రూ.1,323 కోట్లకు క్యూబ్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వి ప్రై.లిమిటెడ్కు విక్రయించినట్లు హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ (హెచ్సీసీ) బుధవారం వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 599, నిఫ్టీ 151 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!