Samantha: నరిష్‌ యులో సమంత పెట్టుబడులు

పోషకాహార ఉత్పత్తులను అందిస్తున్న నరిష్‌ యులో సినీ నటి సమంత పెట్టుబడులు పెట్టినట్లు సంస్థ తెలిపింది. సీడ్‌ ఫండింగ్‌లో భాగంగా సమీకరించిన రూ.16.5 కోట్ల (2మి.డాలర్లు)లో ఆమె భాగస్వామ్యమూ ఉందని పేర్కొంది.

Published : 30 Mar 2023 07:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: పోషకాహార ఉత్పత్తులను అందిస్తున్న నరిష్‌ యులో సినీ నటి సమంత పెట్టుబడులు పెట్టినట్లు సంస్థ తెలిపింది. సీడ్‌ ఫండింగ్‌లో భాగంగా సమీకరించిన రూ.16.5 కోట్ల (2మి.డాలర్లు)లో ఆమె భాగస్వామ్యమూ ఉందని పేర్కొంది. ఆమె పెట్టుబడి ఎంత అనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు. ఇప్పటికే ట్రయంఫ్‌ గ్రూపునకు చెందిన వై.జనార్థన రావు, డార్విన్‌బాక్స్‌ సహ వ్యవస్థాపకుడు రోహిత్‌ చెన్నమనేని, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌, కిమ్స్‌ హాస్పిటల్స్‌ సీఈఓ అభినయ్‌ బొల్లినేని తదితరులు తమ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు నరిష్‌ యు సహ వ్యవస్థాపకులు కృష్ణా రెడ్డి, సౌమ్యా రెడ్డి తెలిపారు. పాతకాలపు ఆహార పద్ధతులను పరిచయం చేయడంతోపాటు, కొత్త ఉత్పత్తులనూ అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమంత భాగస్వామ్యంతో మార్కెట్లో తమ ఉత్పత్తులకు మరింత ప్రచారం లభిస్తుందన్నారు. క్వినోవా, చియా సీడ్స్‌ వంటి వాటిని భారత్‌కు పరిచయం చేయడంలో  నరిష్‌ యు కీలక పాత్ర పోషించదని, తృణధాన్యాల ఆధారిత ఆహార ఉత్పత్తులు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని సమంత పేర్కొన్నారు. మొక్కల ఆధారిత ‘మిల్లెట్‌ మిల్క్‌’ను ఆమె విడుదల చేశారు. రాగి, జొన్న, ఓట్స్‌, సజ్జలతో దీన్ని తయారు చేసినట్లు, పాల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చని సౌమ్యా రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని