ఐపీఓ జోష్ అరకొరే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా మొత్తం నిధుల సమీకరణ సగానికి పైగా తగ్గి రూ.52,116 కోట్లకు పరిమితమైంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.52,116 కోట్లే సమీకరణ
2021-22తో పోలిస్తే ఈ విలువ సగం కంటే తక్కువే
ఎల్ఐసీ లేకుంటే మరింత తగ్గేదే
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా మొత్తం నిధుల సమీకరణ సగానికి పైగా తగ్గి రూ.52,116 కోట్లకు పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఐపీఓల ద్వారా కంపెనీలు జీవనకాల గరిష్ఠమైన రూ.1,11,547 కోట్లను సమీకరించాయి. ‘ప్రైమ్ డేటాబేస్’ గణాంకాల ప్రకారం.. 2022-23లో ప్రధాన ప్లాట్ఫామ్పై 37 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి. 2021-22లో ఈ సంఖ్య 53గా ఉంది. అయితే 2022-23లో ఐపీఓల ద్వారా సమీకరించిన మొత్తం నిధుల్లో ఎల్ఐసీ వాటానే 39 శాతంగా ఉంది. ఎల్ఐసీ సమీకరించిన రూ.20,557 కోట్లను మినహాయిస్తే.. మొత్తం నిధుల సమీకరణ రూ.31,559 కోట్లకే పరిమితం అయ్యేదని ప్రైమ్ డేటాబేస్ మేనేజింగ్ డైరెక్టరు ప్రణవ్ హల్దియా తెలిపారు. అయితే నిధుల సమీకరణపరంగా 2022-23.. మూడో అత్యుత్తమ సంవత్సరంగా నిలిచిందని పేర్కొన్నారు.
ఏయే మార్గాల్లో.. ఎంతెంత...
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ ఈక్విటీ మార్గాల ద్వారా నిధుల సమీకరణ రూ.76,076 కోట్లుగా ఉంది. 2021-22లో నమోదైన రూ.1,73,728 కోట్లతో పోలిస్తే బాగా తగ్గింది.
* 2022-23లో ఐపీఓల ద్వారా రూ.54,344 కోట్ల నిధులను సమీకరించగా (ఎస్ఎమ్ఈ ఇష్యూలతో కలిపి).. ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో (ఓఎఫ్ఎస్) రూ.11,231 కోట్లు, క్యూఐపీలు/ ఇన్విట్స్/ రీట్స్ ద్వారా రూ.9,335 కోట్లు వచ్చాయి. దీంతో మొత్తంగా నిధుల సమీకరణ రూ.76,076 కోట్లకు చేరింది. పబ్లిక్ బాండ్ల ద్వారా సమీకరించిన రూ.8,944 కోట్లను కూడా కలిపితే.. కేపిటల్ మార్కెట్ల (ఈక్విటీ, డెట్) ద్వారా మొత్తం నిధుల సమీకరణ రూ.85,021 కోట్లుగా నమోదైంది.
* 2021-22 విషయానికొస్తే.. ఐపీఓల ద్వారా రూ.1,12,512 కోట్లు, ఎస్ఎమ్ఈ ఇష్యూల ద్వారా రూ.4,314 కోట్లు, ఓఎఫ్ఎస్ ద్వారా రూ.14,530 కోట్లు, క్యూఐపీ/ ఇన్విట్స్/ రీట్స్ రూ.13,841 కోట్లు చొప్పున మొత్తంగా ఈక్విటీ రూపేణా రూ.1,73,728 కోట్ల నిధుల సమీకరణ జరిగింది. పబ్లిక్ బాండ్ల ద్వారా సమీకరించిన రూ.11,710 కోట్లతో కలిపితే కేపిటల్ మార్కెట్ల ద్వారా మొత్తం నిధుల సమీకరణ రూ.1,85,438 కోట్లకు చేరింది.
* కొవిడ్ మహమ్మారి పరిణామాలు ప్రభావం చూపినా.. 2020-21లోనే కేపిటల్ మార్కెట్ల ద్వారా అత్యధికంగా రూ.2,00,812 కోట్ల నిధుల సమీకరణ జరిగింది. ఇది జీవనకాల గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం.
3 నెలల్లోనే 25 ఇష్యూలు
* 2022-23లో వచ్చిన మొత్తం 37 పబ్లిక్ ఇష్యూలో మూడు నెలల్లోనే (మే, నవంబరు, డిసెంబరు) 25 ఇష్యూలు జరిగాయి. గత తొమ్మిది ఏళ్లలోనే అత్యంత తక్కువ ఐపీఓలు వచ్చిన త్రైమాసికంగా నాలుగో త్రైమాసికం (జనవరి- మార్చి) నిలిచింది.
* కొత్త తరం సాంకేతికత రంగం నుంచి కేవలం 2 కంపెనీలే (డెలివరీ, ట్రాక్సన్) ఉన్నాయి. 2021-22లో ఈ రంగం నుంచి ఐదు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రాగా.. మొత్తంగా రూ.41,733 కోట్లను సమీకరించాయి. ఈ రంగం నుంచి ఐపీఓకు వస్తున్న కంపెనీలు సంఖ్య తగ్గుముఖం పట్టిందనే సంకేతాన్ని ఈ గణంకాలు తెలియజేస్తున్నాయి.
స్పందన తగ్గింది..
* 2022-23లో పబ్లిక్ ఇష్యూలకు స్పందన కూడా తగ్గింది. 37 ఇష్యూల్లో కేవలం 11 ఇష్యూలకు మాత్రమే 10 రెట్లకు పైగా స్పందన లభించింది. ఇందులో రెండింటికి 50 రెట్లకు పైగా స్పందన వచ్చింది. 7 ఇష్యూలకు 3 రెట్లకు పైగా, 18 ఇష్యూలకు 1-3 రెట్ల మేర స్పందన లభించింది.
* 2021-22తో పోలిస్తే 2022-23లో చిన్న మదుపర్ల నుంచి కూడా ఐపీఓలకు స్పందన తగ్గింది. చిన్న మదుపర్ల సగటు దరఖాస్తులు 5.64 లక్షలకు తగ్గాయి. 2021-22లో 13.32 లక్షలు, 2020-21లో 12.73 లక్షలుగా ఇవి నమోదయ్యాయి. ఎల్ఐసీకి అత్యధికంగా చిన్న మదుపర్ల నుంచి స్పందన (32.76 లక్షల దరఖాస్తులు) లభించింది. ఆ తర్వాతి స్థానాల్లో హర్ష ఇంజినీర్స్ (23.86 లక్షలు), క్యాంపస్ యాక్టివ్వేర్ (17.27 లక్షలు) ఉన్నాయి.
* భవిష్యత్ ఐపీఓల విషయానికొస్తే.. మొత్తంగా 54 కంపెనీల ఐపీఓ ప్రతిపాదనలకు సెబీ ఆమోదం తెలిపింది. ఇవి మొత్తంగా రూ.76,189 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నాయి. మరో 19 కంపెనీల ఇష్యూలు సెబీ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇవి సమీకరించాలని అనుకుంటున్న నిధుల విలువ రూ.32,940 కోట్ల వరకు ఉంటుందని ప్రైమ్ డేటాబేస్ చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’