రూ.164 లక్షల కోట్ల ఎగుమతులు!
దేశ ఎగుమతులను 2030 కల్లా 2 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.164 లక్షల కోట్ల)కు పెంచుకునే లక్ష్యంతో కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని (ఎఫ్టీపీ) కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది.
2030 లక్ష్యం
కొత్త విదేశీ వాణిజ్య విధానం ఆవిష్కరణ
ఇ-కామర్స్ ఎగుమతులకూ ప్రయోజనాలు
రూపాయల్లో వాణిజ్యం పెంచడంపై దృష్టి
దిల్లీ: దేశ ఎగుమతులను 2030 కల్లా 2 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.164 లక్షల కోట్ల)కు పెంచుకునే లక్ష్యంతో కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని (ఎఫ్టీపీ) కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. శుక్రవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, ఫారిన్ ట్రేడ్ డైరెక్టరు జనరల్ (డీజీఎఫ్టీ) సంతోష్ సారంగి కొత్త ఎఫ్టీపీ ప్రత్యేకతలను విలేకర్లకు తెలియజేశారు. రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చడం, ఇ-కామర్స్ ఎగుమతులకూ ప్రయోజనాలు వర్తింపజేయడం కొత్త ఎఫ్టీపీ ప్రధాన ఉద్దేశాలుగా ఉన్నాయి. రాష్ట్రాలు, జిల్లాల్లోని ఎగుమతిదార్లు, విదేశాల్లోని భారత రాయబార్ల మధ్య పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడం, లావాదేవీల వ్యయాలు తగ్గించడం, మరిన్ని ఎగుమతి కేంద్రాల అభివృద్ధికి ఇందులో ప్రాధాన్యమిచ్చారు.
తుది తేదీ లేదు
సాధారణంగా ఎఫ్టీపీలను అయిదేళ్ల కాలానికి ప్రకటిస్తుంటారు. ఈసారి అలాంటి గడువేమీ లేకుండా, ఎప్పటికీ కొనసాగేలా.. పరిస్థితుల ఆధారంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకునేలా (డైనమిక్ అండ్ రెస్పాన్సివ్) ఈ కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. రంగాలవారీగా లేదంటే దేశీయ ఉత్పత్తులను, సేవలను ప్రపంచానికి చేరువ చేయాలనే ప్రధాన లక్ష్యంతో ముందుకెళ్తున్నామని గోయల్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన వస్తు, సేవల ఎగుమతులు 765 బిలియన్ డాలర్ల విలువను అధిగమించే అవకాశం ఉందని డీజీఎఫ్టీ తెలిపింది. 2021-22లో ఇవి 676 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి..
మన రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చే ఉద్దేశంతో, రూపాయల్లో వాణిజ్య చెల్లింపులకు అనుమతినిచ్చేలా ఎఫ్టీపీలో మార్పులు చేశారు. ‘కరెన్సీ సంక్షోభాలు లేదా డాలర్ల కొరత ఎదుర్కొంటున్న దేశాలతో రూపాయల్లో వాణిజ్యాన్ని జరిపేందుకు భారత్ సిద్ధంగా ఉంద’ని వాణిజ్య కార్యదర్శి సునీల్ భర్త్వాల్ తెలిపారు. మన ఎగుమతిదార్లు అంతర్జాతీయంగా పోటీ సామర్థ్యాన్ని పెంచుకోవాలని, అప్పుడు రాయితీలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. రాయితీలు, ప్రోత్సాహకాలపై మాత్రమే పరిశ్రమ విజయం ఆధారపడి ఉండదని పీయూష్ గోయల్ తెలిపారు.
200- 300 బి.డాలర్లకు ఇ-కామర్స్ ఎగుమతులు
2030 కల్లా ఇ-కామర్స్ ఎగుమతులు 200- 300 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఎఫ్టీపీ అంచనా వేసింది. కొరియర్ ద్వారా ఎగుమతుల విలువ పరిమితిని ఒక్కో ప్యాకెట్కు రెట్టింపు చేసి రూ.10 లక్షలకు పెంచింది. ఇ-కామర్స్ సంస్థలకు సులభ స్టాకింగ్, కస్టమ్స్ అనుమతులు, రిటర్న్ల ప్రాసెసింగ్ విషయంలో తోడ్పాటు అందించేందుకు గిడ్డంగుల సదుపాయాలతో నిర్దేశిత జోన్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఎఫ్టీపీకి సంబంధించిన దరఖాస్తుల డిజిటైజేషన్, ఆటోమేటిక్ సిస్టమ్ ఆధారిత అనుమతులు, అడ్వాన్స్ ఆథరైజేషన్ పొడిగింపు/ రీవ్యాలిడేషన్ దరఖాస్తులు ఒక్క రోజులో ప్రాసెసింగ్, వస్త్ర పరిశ్రమకు ప్రత్యేక అడ్వాన్స్ ఆథరైజేషన్ పథకం పొడిగింపు, సగటు ఈవో (ఎక్స్ఫోర్ట్ ఆబ్లిగేషన్) నిర్వహణ నుంచి పాడి పరిశ్రమకు మినహాయింపు లాంటివీ కొత్త ఎఫ్టీపీలో చేర్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది. -
జొమాటో ప్లాట్ఫాం ఫీజు రూ.5కు పెంపు
ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది. -
సంక్షిప్త వార్తలు(5)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్ పికప్ జోన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
-
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
-
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం