ప్రపంచ బ్యాంకు అధిపతి మన అజయ్ బంగానే!
ప్రపంచ బ్యాంకు తదుపరి అధ్యక్షుడిగా, భారత-అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగా (63) నియమితులు కానున్నారు.
ఆ స్థానంలో తొలి భారతీయుడు!
మే మొదట్లో ప్రకటించే అవకాశం
ఏకైక నామినేషన్ ఆయనదే
వాషింగ్టన్: ప్రపంచ బ్యాంకు తదుపరి అధ్యక్షుడిగా, భారత-అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగా (63) నియమితులు కానున్నారు. బుధవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియగా, ఈ పదవికి అందిన ఏకైక నామినేషన్ బంగాదేనని ప్రపంచబ్యాంక్ గురువారం ప్రకటించింది. అధికారికంగా బంగా నియామకాన్ని మేలో ప్రకటించొచ్చు. అంతకుముందుగా ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు బంగాను ఇంటర్వ్యూ చేస్తుంది. ఆర్థిక పరిస్థితుల రీత్యా అత్యంత కీలకమైన ప్రస్తుత సమయంలో, ప్రపంచ బ్యాంకుకు నేతృత్వం వహించడానికి అజయ్ బంగాను నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫిబ్రవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బంగా జనరల్ అట్లాంటిక్కు వైస్ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఈయన మాస్టర్కార్డ్కు నేతృత్వం వహించారు.
మనకు చరిత్రే: అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్ఎఫ్), ప్రపంచ బ్యాంకుల్లో ఏదో ఒకదానికి అధిపతిగా మారిన తొలి భారతీయ-అమెరికన్, సిక్కు-అమెరికన్ బంగాయే అవుతారు. ప్రపంచబ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మలపాస్ జూన్లో వైదొలగనున్నారు. ఆయన పదవీకాలం ఇంకా ఏడాది ఉండగానే, తప్పుకుంటున్నారు. పర్యావరణ మార్పులపై ఆయన వ్యక్తిగత అభిప్రాయాలపై తీవ్ర విమర్శలు రావడం ఇందుకు నేపథ్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీటింగ్లో నోట్స్ రాయడం స్టీవ్ జాబ్స్కు నచ్చదట.. ఎందుకో తెలుసా?
Steve Jobs: యాపిల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ గురించి ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఫిల్ షిల్లర్ ఓ ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. -
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
Vivo T3X: వివో టీ2ఎక్స్కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్ విడుదలైంది. కెమెరా, డిస్ప్లే సహా ఇతర ఫీచర్లను అప్గ్రేడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. -
యంగ్ ఇండియాది విరాట్ కోహ్లీ మనస్తత్వం: రఘురామ్ రాజన్
డెమోగ్రఫిక్ డివిడెండ్ కారణంగా రావాల్సిన ప్రయోజనాలను భారత్ అందుకోలేకపోతోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. -
మా రైతులకు ప్రయోజనం చేకూరేలా భారత్ నిర్ణయం: అమెరికా
USA-India: డబ్ల్యూటీఓ వివాదాల పరిష్కారం తర్వాత కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాలు తగ్గించినట్లు అగ్రరాజ్యం తెలిపింది. -
అంతర్జాతీయ మార్గాల్లో జాగ్రత్త
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా, నష్టభయాలను సొంతంగా మదింపు చేసుకుని అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపాలని దేశీయ విమానయాన సంస్థలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించింది. -
2024లో వృద్ధి రేటు 6.8%
ప్రస్తుత సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పెంచింది. -
రూ.లక్ష కోట్లకు పైగా ఐఫోన్ ఎగుమతులు
మన దేశం నుంచి యాపిల్ ఐఫోన్ల ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2022-23లో 6.27 బిలియన్ డాలర్ల (సుమారు రూ.52000 కోట్ల) విలువైన ఐఫోన్లు ఎగుమతి కాగా, 2023-24లో ఈ మొత్తం రెట్టింపై 12.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1,00,430 కోట్ల) విలువైనవి ఎగుమతి అయ్యాయి. -
ఈ కంపెనీల్లో పనిచేయడం ఇష్టం
మన దేశంలో పనిచేయడానికి అనువైన కంపెనీల్లో అగ్రస్థానాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) దక్కించుకుంది. -
3 రోజుల్లో రూ.7.93 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఐటీ షేర్లకు భారీగా అమ్మకాలు వెల్లువెత్తడంతో మూడో రోజూ సూచీలు నష్టపోయాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నడుమ, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగానే ఉన్నాయి. -
ఫండ్లలోకి 35% పెరిగిన పెట్టుబడులు
ఈక్విటీ మార్కెట్లు గణనీయంగా రాణించడానికి తోడు చిన్న మదుపరుల భాగస్వామ్యం అధికంగా ఉండడంతో.. మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) విలువ గత ఆర్థిక సంవత్సరం రూ.14 లక్షల కోట్లు పెరిగి (35% వృద్ధి) రూ.53.40 లక్షల కోట్లకు చేరింది. -
‘ఎక్స్’ నూతన వినియోగదార్లు పోస్ట్, లైక్కు రుసుము చెల్లించాలి
ఎక్స్ (గతంలో ట్విటర్) ఫ్లాట్ఫామ్పై కొత్తగా నమోదయ్యే వినియోగదార్లు ఇకపై లైక్, పోస్ట్, బుక్మార్క్, రిప్లయ్ కోసం తక్కువ మొత్తంలో వార్షిక రుసుము చెల్లించాల్సి రావొచ్చని కంపెనీ తెలిపింది. -
పెద్ద ఆర్డర్ల డెలివరీకి జొమాటో ప్రత్యేక వాహనం
50 మంది వరకు స్నేహితులు/ కుటుంబ సభ్యులు/ సహోద్యోగులతో జరుపుకునే వేడుకలు, ఫంక్షన్లు, కార్యక్రమాల కోసం ఆహార పదార్థాలను డెలివరీ చేస్తామని జొమాటో తెలిపింది. -
రెండేళ్లలో రూ.1000 కోట్ల విక్రయాలు!
ఆధునిక సాంకేతికతతో పరుపులను తయారు చేస్తున్న ద స్లీప్ కంపెనీ, రానున్న రెండేళ్లలో రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధించాలనే లక్ష్యంతో ఉంది. -
రైతులకు నేరుగా రుణాలు ఇవ్వం: నాబార్డ్
తాము రైతులకు నేరుగా రుణాలు అందించబోమని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) మంగళవారం స్పష్టం చేసింది. -
‘కంటెక్చువల్ డిస్కవరీ టెక్నాలజీ’కి భారత పేటెంట్
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కీపాయింట్ టెక్నాలజీస్ ఆవిష్కరించిన ‘కంటెక్చువల్ డిస్కవరీ టెక్నాలజీ’కి ఇండియా పేటెంట్ ఆఫీస్ (ఐపీఓ) పేటెంట్ మంజూరు చేసింది. -
ఫ్లిప్కార్ట్ వేసవి విక్రయాలు నేటి నుంచి
ఫ్లిప్కార్ట్ వార్షిక వేసవి విక్రయాలు ఈనెల 17న ప్రారంభమై 23 వరకు కొనసాగనున్నాయి. ఈ విక్రయాల్లో ఏసీలు, రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లు లాంటి గృహోపకరణాలను ఆకర్షణీయ ధరల్లో వినియోగదార్లు పొందొచ్చని సంస్థ పేర్కొంది. -
సోనీతో విలీనానికి ఎన్సీఎల్టీ వద్ద దరఖాస్తు ఉపసంహరణ: జీ
సోనీ కంపెనీతో విలీనాన్ని అమలు చేయాలని కోరుతూ జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) వద్ద దాఖలు చేసిన దరఖాస్తును ఉపసంహరించుకున్నట్లు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జెడ్ఈఈఎల్) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
పాలు, పాల ఉత్పత్తుల కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్, తన శీతల పానీయాలను.. ప్యాకేజింగ్ టెక్నాలజీ సంస్థ ఎస్ఐజీ అందించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, ఎసెప్టిక్ కార్టన్ ప్యాక్లలో అందుబాటులోకి తెచ్చింది. -
ఆసుస్ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!
Asus: ఆసుస్ సరికొత్త ల్యాప్టాప్ను మంగళవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాపీ ప్రత్యేకలు ఏంటంటే..? -
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మీటింగ్లో నోట్స్ రాయడం స్టీవ్ జాబ్స్కు నచ్చదట.. ఎందుకో తెలుసా?
-
‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను ప్రారంభించిన ఆప్
-
భానుడి భగభగలు.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ
-
దూకుడైన బ్యాటింగ్తోనే కప్ కొట్టగలం..: రికీ పాంటింగ్
-
ఎన్నికల్లో భాజపా తుడిచిపెట్టుకుపోతుంది: అఖిలేష్ యాదవ్
-
వలసలు, పస్తులు లేని వికసిత ఏపీ మనందరి బాధ్యత: పవన్