కార్యాలయాల లీజింగ్ తగ్గింది
ఈ ఏడాది జనవరి-మార్చిలో హైదరాబాద్లో కార్యాలయాల లీజింగ్ 0.04 మిలియన్ చదరపు అడుగుల మేరే జరిగిందని కొలియర్స్ ఇండియా తాజా నివేదికలో పేర్కొంది.
జనవరి-మార్చిపై కొలియర్స్ ఇండియా
ఈనాడు, హైదరాబాద్: ఈ ఏడాది జనవరి-మార్చిలో హైదరాబాద్లో కార్యాలయాల లీజింగ్ 0.04 మిలియన్ చదరపు అడుగుల మేరే జరిగిందని కొలియర్స్ ఇండియా తాజా నివేదికలో పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో జరిగిన 0.23 మి.చ.అ.తో పోలిస్తే, ఇది 83% తక్కువ. ముంబయి, పుణె, చెన్నై ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. బెంగళూరులో మాత్రం 343% వృద్ధితో 1.02 మి.చ.అ. లీజింగ్ జరిగింది. దిల్లీలో 294 శాతం వృద్ధితో 0.63 మి.చ.అ. నమోదైంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 2022లో 2.05 మి.చ.అ. లీజింగ్ జరగ్గా.. 2023లో 2.06 మి.చ.అ. లీజింగ్ నమోదైంది.
టెక్నాలజీ సంస్థలే ఎక్కువగా..: కార్యాలయాలను లీజ్కు తీసుకుంటున్న వాటిలో టెక్నాలజీ సంస్థల వాటా 22 శాతంగా ఉంది. ఫ్లెక్సీ స్పేస్ లీజింగ్ 20 శాతమని తెలిపింది. ఆ తర్వాత స్థానాల్లో బీఎఫ్ఎస్ఐ, కన్సల్టింగ్, ఇంజినీరింగ్, ఇ-కామర్స్, ఎఫ్ఎంసీజీ, ఆరోగ్య, ఫార్మా, ఇతర విభాగాల సంస్థలున్నాయి. ‘కార్పొరేట్ సంస్థలు హైబ్రిడ్ విధానంలో కార్యాలయాల నిర్వహణపై దృష్టి సారించడంతో.. కొత్త కార్యాలయాల లీజింగ్లో సాంకేతిక రంగం వాటా 2022లోని 34 శాతం నుంచి 2023 నాటికి 22 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ఫ్లెక్సీ స్పేస్కు డిమాండ్ పెంచింది’ అని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ ఎండీ పీష్ జైన్ అన్నారు.
సరఫరా పరంగా..: కొత్త భవనాల సరఫరా పరంగా దిల్లీ, ముంబయి నగరాల్లో వృద్ధి నమోదైంది. ముంబయిలో 200 శాతం, దిల్లీలో 15 శాతం పెరగ్గా, పుణెలో 80 శాతం తగ్గింది. హైదరాబాద్లో 11 శాతం, బెంగళూరులో 4 శాతం, చెన్నైలో 74 శాతం తగ్గింది. దేశవ్యాప్తంగా చూస్తే 2022 మొదటి త్రైమాసికంలో 14.4 మి.చ.అ. ఆఫీస్ స్పేస్ కొత్తగా అందుబాటులోకి రాగా... 2023లో 34% తక్కువగా 9.5 మి.చ.అ. మాత్రమే కొత్తగా అందుబాటులోకి వచ్చింది.
3 నెలల గరిష్ఠానికి నిరుద్యోగిత రేటు
మార్చిలో 7.8 శాతానికి
ముంబయి: దేశ నిరుద్యోగిత రేటు మార్చిలో 7.8 శాతానికి చేరినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎమ్ఐఈ) శనివారం వెల్లడించింది. ఇది మూడు నెలల గరిష్ఠ స్థాయి. 2022 డిసెంబరులో ఇది 8.3 శాతంగా నమోదైనా, జనవరిలో 7.14 శాతానికి తగ్గింది. ఫిబ్రవరిలో 7.45 శాతంగా నమోదైంది. మార్చిలో ఇంకా పెరిగింది. మార్చిలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 8.4 శాతంగా; గ్రామీణ ప్రాంతాల్లో 7.5 శాతంగా నమోదైనట్లు సీఎమ్ఐఈ ఎండీ మహేశ్ వ్యాస్ పేర్కొన్నారు.
* రాష్ట్రాల వారీగా నిరుద్యోగ రేటు హరియాణాలో అత్యధికంగా 26.8 శాతం ఉండగా.. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్(26.4%), జమ్ము-కశ్మీర్(23.1%), సిక్కిం(20.7%), బిహార్(17.6%), జార్ఖండ్(17.5%) ఉన్నాయి.
* అతి తక్కువ నిరుద్యోగ రేటు ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్(0.8%), ఛత్తీస్గఢ్(0.8%), పుదుచ్ఛేరి(1.5%), గుజరాత్(1.8%), కర్ణాటక(2.3%), మేఘాలయ (2.6%), ఒడిశా(2.6%) ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.