ఆర్థికం జోష్
ఈ ఏడాది మార్చిలో జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) వసూళ్లు రూ.1,60,122 కోట్లకు చేరాయి. పరోక్ష పన్నుల్లో జీఎస్టీ వ్యవస్థ ప్రారంభమయ్యాక, వసూలైన రెండో అత్యధిక మొత్తమిది.
మార్చి జీఎస్టీ వసూళ్లు రూ.1,60,122 కోట్లు
రెండో అత్యధిక మొత్తం ఇది
ఆర్థిక సంవత్సరం మొత్తం వసూళ్లు రూ.18.10 లక్షల కోట్లు
ఈనాడు, దిల్లీ: ఈ ఏడాది మార్చిలో జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) వసూళ్లు రూ.1,60,122 కోట్లకు చేరాయి. పరోక్ష పన్నుల్లో జీఎస్టీ వ్యవస్థ ప్రారంభమయ్యాక, వసూలైన రెండో అత్యధిక మొత్తమిది. 2022 ఏప్రిల్లో వసూలైన రూ.1,67,540 కోట్లు ఇప్పటివరకు వసూలైన అత్యధిక మొత్తం. గత ఏడాది మార్చిలో వసూలైన రూ.1,42,095 కోట్లతో పోలిస్తే ఈసారి 13% పెరిగాయి.
* మార్చి వసూళ్లలో సీజీఎస్టీ రూ.29,546 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.37,314 కోట్లు, ఐజీఎస్టీ రూ.82,907 కోట్లు, సెస్సు రూ.10,355 కోట్లుగా ఉన్నాయి.
* 2022-23లో నెలవారీ వసూళ్లు రూ.1.50 లక్షల కోట్లను మించడం ఇది నాలుగోసారి. ఐజీఎస్టీ వసూళ్లు మాత్రం గత నెలలోనే అత్యధికం.
* ఐజీఎస్టీ కింద వచ్చిన మొత్తంలో రూ.33,408 కోట్లు సీజీఎస్టీ, రూ.28,187 కోట్లు ఎస్జీఎస్టీ కింద సర్దుబాటు చేశారు. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వానికి రూ.62,954 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.65,501 కోట్ల ఆదాయం దక్కింది.
* దిగుమతి చేసుకున్న వస్తువులపై ఆదాయం గత ఏడాది మార్చితో పోలిస్తే 8% పెరిగింది. దేశీయ లావాదేవీలపై వసూళ్లు 14% వృద్ధి చెందాయి. మార్చిలో రిటర్న్స్ కూడా గతంలో ఎన్నడూలేనంతగా దాఖలయ్యాయి.
ఆర్థిక సంవత్సరం మొత్తంమీద: 2022-23 మొత్తంమీద జీఎస్టీ స్థూల వసూళ్లు రూ.18.10 లక్షల కోట్లకు చేరాయి. అంటే నెలవారీ సగటు రూ.1.51 లక్షల కోట్లకు చేరింది. 2021-22తో పోలిస్తే 2022-23లో స్థూల ఆదాయం 22% మేర పెరిగింది.
తెలంగాణకు రూ.4,804 కోట్లు, ఆంధ్రాకు రూ.3,532 కోట్లు: మార్చిలో జీఎస్టీ కింద తెలంగాణకు రూ.4,804 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు రూ.3,532 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది మార్చితో పోలిస్తే ఈసారి తెలంగాణ ఆదాయంలో 13.25%, ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో 11.26% వృద్ధి నమోదైంది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక 18.40%, తమిళనాడు 15.24%, కేరళ 12.67% వృద్ధిరేటు నమోదుచేశాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిలో చివరిస్థానంలో నిలిచింది.
యూపీఐ లావాదేవీలు 870 కోట్లు
జీవన కాల గరిష్ఠమిదే
దిల్లీ: దేశీయంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు ఈ ఏడాది మార్చిలో రికార్డు గరిష్ఠమైన 870 కోట్లను అధిగమించాయి. వీటి విలువ రూ.14.05 లక్షల కోట్లుగా నమోదైంది. యూపీఐ సేవలు ప్రారంభమైన 2016 తరవాత ఒక నెలలో నమోదైన అత్యధిక లావాదేవీలు ఇవేనని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) గణాంకాలు వెల్లడించాయి. 2022 మార్చిలో రూ.9.6 లక్షల కోట్ల విలువైన 540 కోట్ల లావాదేవీలు జరిగాయి. అప్పటితో పోలిస్తే గత నెలలో పరిమాణం పరంగా 60 శాతం, విలువ పరంగా 46 శాతం మేర లావాదేవీలు పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో యూపీఐ లావాదేవీలు తొలిసారిగా 800 కోట్ల మైలురాయిని అధిగమించాయి. 2019 అక్టోబరులో తొలిసారిగా 100 కోట్ల లావాదేవీల మార్కును అధిగమించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 599, నిఫ్టీ 151 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల