Gold Rates: 20 ఏళ్లలో 10 రెట్లు... బంగారం ధర పెరిగిన తీరిదీ
అక్షయం.. అంటే నాశనము లేనిది అని అర్థం. అక్షయతృతీయ నాడు పసిడి, వెండి వంటి విలువైన లోహాలతో పాటు గృహోపకరణాలు కొనుగోలు చేసుకున్నా, ఇల్లు/ఫ్లాట్కు ఒప్పందం చేసుకున్నా, మరింత సంపద జతచేరుతుందన్నది నమ్మకం.
కొవిడ్ తరవాత ఈ ఏడాదిలో పెరుగుదల ఎక్కువ
ఈనాడు వాణిజ్య విభాగం
అక్షయం.. అంటే నాశనము లేనిది అని అర్థం. అక్షయతృతీయ నాడు పసిడి, వెండి వంటి విలువైన లోహాలతో పాటు గృహోపకరణాలు కొనుగోలు చేసుకున్నా, ఇల్లు/ఫ్లాట్కు ఒప్పందం చేసుకున్నా, మరింత సంపద జతచేరుతుందన్నది నమ్మకం. క్రమంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సందర్భంగా పసిడి కొనే అలవాటు పెరిగింది. వివాహాది శుభకార్యాలు ముందున్నందున, శుభముహూర్తంగా భావించి, ఈ సమయంలో ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. తప్పనిసరి అవసరం లేకున్నా సెంటిమెంటుగా బంగారు నాణేలు, బిస్కెట్ల రూపంలో మేలిమి బంగారాన్ని పలువురు ఈ సందర్భంగా కొనుగోలు చేస్తుంటారని వ్యాపారులు చెబుతున్నారు. గత 20 ఏళ్లలో అక్షయతృతీయ నాడు బంగారం ధరలను చూస్తే, అంతకుముందు ఏడాది కంటే మరుసటి ఏడాది ధర తగ్గడం 4 సంవత్సరాల్లోనే కనిపించింది. మిగిలిన అన్ని సంవత్సరాల్లో ధర పెరగడం వల్ల, తమ సంపద విలువ పెరుగుతోందనే సంతృప్తితో స్థోమతకు తగ్గట్లు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈనెల 22న అక్షయతృతీయ నేపథ్యంలో, ఇప్పటికే ఆభరణాలకు బుకింగ్లు జరుగుతున్నాయని విక్రేతలు చెబుతున్నారు.
మూడేళ్లలో ధర పెరుగుదల మరీ ఎక్కువ
గత 20 ఏళ్ల వ్యవధిలో అక్షయ తృతీయ తేదీల నాటి ధరలను పరిశీలిస్తే, మొత్తంమీద పసిడి ధర 10 రెట్లకు మించి పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం (999 స్వచ్ఛత ) ధర 2004లో రూ.5800 కాగా, ఇప్పుడు రూ.62,400కు మించి ఉంది. ముడిచమురు ధరలు పెరగడం ప్రారంభమై, వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకుల నుంచి గిరాకీ గణనీయంగా పెరగడంతో 2006లో బంగారం ధర 58% హెచ్చింది. 2005లో రూ.6100గా ఉన్న 10 గ్రాముల మేలిమి బంగారం ధర 2006లో రూ.9630కు చేరింది. అదే ఏడాది రూ.10,000ను తాకినా మళ్లీ వెనక్కి వచ్చింది. మళ్లీ కొవిడ్ కేసుల వ్యాప్తి ప్రారంభమైన 2020లో కూడా బంగారం ధర 47% దూసుకెళ్లింది. అంతకుముందు ఏడాది రూ.31,700 ఉంటే ఒక్కసారిగా రూ.46,500ను మించింది. మళ్లీ ఈ ఏడాదిలో ఇప్పటికే 21% మేర లాభపడింది.
వ్యాపార అంచనా ఇలా: ఈ పండుగ సందర్భంగా జరిగే వ్యాపారంలో దక్షిణాది రాష్ట్రాల్లో 40%, పశ్చిమ ప్రాంతంలో 25%, తూర్పు రాష్ట్రాల్లో 20%, ఉత్తరాదిలో 15% జరుగుతుందనేది బులియన్ వర్గాల అంచనా. వాస్తవానికి ఈ పండుగను మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిశాలలో ఎక్కువగా జరుపుతుంటారు.
వ్యాపారుల భావన ఇదీ
దేశీయంగా సగటు కుటుంబీకుల వద్ద నగదు లభ్యత ఉంటే, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. తమ సామాజిక హోదాను ప్రతిబింబించడానికి, ఆర్థిక స్థోమతకు చిహ్నంగా ఖరీదైన ఆభరణాలను మహిళలు ధరిస్తుంటారు. ప్రపంచ దేశాల్లో లోహ రూపంలో బంగారానికి మనదేశంతో పాటు, చైనా నుంచే అధిక గిరాకీ ఉంటోంది. ఇప్పటికే అన్నిరకాల వస్తు, సేవల ధరలు పెరిగి మధ్యతరగతి ప్రజలూ ఇబ్బంది పడుతున్నారు. గతేడాదితో పోలిస్తే 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.12,000 వరకు పెరిగినందున, గతేడాదితో పోలిస్తే ఈసారి అక్షయతృతీయకు గిరాకీ 10-20% వరకు తగ్గొచ్చనే అభిప్రాయాన్ని ఆలిండియా జెమ్స్ అండ్ జువెలరీ దేశీయ మండలి ఛైర్మన్ సైయమ్ మెహ్రా వ్యక్తం చేశారు. అయితే శుభకార్యాలు ముందున్నవారు, ఈ పండుగ సందర్భంగా కొనుగోలు చేస్తే శుభమనే భావనతో ముందుకొస్తారనే అభిప్రాయాన్ని తెలుగు రాష్ట్రాల ఆభరణాల వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసమే కార్పొరేట్ సంస్థలతో పాటు స్థానిక వ్యాపారులు కూడా తరుగు, తయారీ ఛార్జీలు, వజ్రాల ధరల్లో ఆఫర్లను ప్రకటిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు