Twitter: ప్రముఖుల ట్విటర్ ఖాతాలకు.. మళ్లీ బ్లూ టిక్ వచ్చేసింది
ట్విటర్ ఖాతాలకు ‘బ్లూటిక్’కు సంబంధించి.. మరో ఆశ్చర్యకర పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం బ్లూటిక్ను కోల్పోయిన.. చాలా మంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల ట్విటర్ ఖాతాలకు ఆదివారం మళ్లీ ఆ బ్లూటిక్ వచ్చింది.
కనీసం 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నవారికి పునరుద్ధరణ!
వాషింగ్టన్: ట్విటర్ ఖాతాలకు ‘బ్లూటిక్’కు సంబంధించి.. మరో ఆశ్చర్యకర పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం బ్లూటిక్ను కోల్పోయిన.. చాలా మంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల ట్విటర్ ఖాతాలకు ఆదివారం మళ్లీ ఆ బ్లూటిక్ వచ్చింది. ‘ట్విటర్ బ్లూ’ సర్వీసులకు డబ్బులు చెల్లించని వారికి బ్లూ చెక్మార్కును తొలగించే ప్రక్రియను ట్విటర్ అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే శుక్రవారం పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ ట్విటర్ ఖాతాలకు ‘బ్లూ టిక్’ను కోల్పోయారు. అయితే తాజాగా కనీసం 10 లక్షల మంది వరకు ఫాలోవర్లు ఉన్న వ్యక్తుల ఖాతాలకు బ్లూ టిక్ను పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బ్లూ టిక్ను ఇచ్చే విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చేందుకు ఆ సంస్థ యజమాని ఎలాన్ మస్క్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీని ప్రకారమే.. బాలీవుడ్ తారలు షారుక్ ఖాన్, అలియా భట్, క్రికెటర్లు కోహ్లీ, ధోనీ సహా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిలియనీర్ బిల్ గేట్స్, రాజకీయ ప్రముఖులు రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారి ట్విటర్ ఖాతాలన్నింటికీ ఇప్పుడు మళ్లీ బ్లూ టిక్ మార్క్ వచ్చింది. అయితే, వీరంతా డబ్బులు చెల్లించి ట్విటర్ బ్లూ సేవలను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అనే విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. ట్విటర్ బ్లూటిక్ తిరిగి పొందేందుకు తాము ఎలాంటి రుసుము చెల్లించలేదని జమ్మూ- కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేయడం గమనార్హం. ‘ఎలాన్ మస్క్.. మీరు నా తరపున కూడా డబ్బులు చెల్లించారా’? అని అందులో అబ్దుల్లా పేర్కొన్నారు. ఈయనే కాకుండా పలువురు ప్రముఖులు తమ ట్విటర్ ఖాతాలకు తిరిగి బ్లూమార్క్ రావడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కాగా.. బ్లూటిక్ పునరుద్ధరణకు సంబంధించి ట్విటర్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
దివంగత ప్రముఖుల ఖాతాలకూ..
దివంగతులైన కొందరు ప్రముఖుల ఖాతాలకు సైతం బ్లూ టిక్ తిరిగి రావడం గమనార్హం. పైగా వారు ట్విటర్ బ్లూను సబ్స్క్రైబ్ చేసుకొని డబ్బులు చెల్లించారని టిక్పై క్లిక్ చేసినప్పుడు కనిపిస్తోంది. ఇలా బ్లూ టిక్ పొందిన వారిలో దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్, ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్, రిషి కపూర్, గాయకుడు మైకేల్ జాక్సన్, బాస్కెట్బాల్ ఆటగాడు కోబే బ్రయంట్, క్రికెటర్ షేన్ వార్న్ వంటి ప్రముఖుల ఖాతాలు ఉన్నాయి. అయితే, ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సేకు ట్విటర్లో 6.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కానీ, ఆయన ఖాతాలో మాత్రం ఇప్పటికీ బ్లూ టిక్ కనిపించడం లేదు. కాగా.. కొంతమంది ట్విటర్ ఖాతాలకు తానే వ్యక్తిగతంగా చెల్లించి ట్విటర్ బ్లూ సబ్స్క్రిప్షన్ సేవలను అందిస్తున్నట్లు ఇటీవల ఎలాన్ మస్క్ వెల్లడించిన సంగతి తెలిసిందే. లెబ్రాన్ జేమ్స్, విలియం శాట్నర్, స్టీఫెన్ కింగ్ వంటి వారి ఖాతాలకు తానే స్వయంగా డబ్బులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. వీరంతా తాము ట్విటర్ బ్లూను సబ్స్క్రైబ్ చేసుకోబోమని బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఏ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు