Air India: ఎయిరిండియాలో చాట్జీపీటీ
ఎయిరిండియా తన డిజిటల్ వ్యవస్థలను ఆధునికీకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చాట్జీపీటీ ఆధారిత చాట్బాట్ వినియోగించనుంది. ఇప్పటికే ప్రాథమిక పెట్టుబడుల కింద 200 మి. డాలర్ల (దాదాపు రూ.1600 కోట్ల)ను వెచ్చించింది.
డిజిటల్ వ్యవస్థ ఆధునికీకరణకు రూ.1600 కోట్లు
అయిదేళ్లలో మరిన్ని పెట్టుబడులు
దిల్లీ: ఎయిరిండియా తన డిజిటల్ వ్యవస్థలను ఆధునికీకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చాట్జీపీటీ ఆధారిత చాట్బాట్ వినియోగించనుంది. ఇప్పటికే ప్రాథమిక పెట్టుబడుల కింద 200 మి. డాలర్ల (దాదాపు రూ.1600 కోట్ల)ను వెచ్చించింది. కంపెనీ రూపురేఖలను మార్చడం కోసం విహాన్.ఏఐ పేరిట ఒక పథకాన్ని ఎయిరిండియా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కొత్త డిజిటల్ వ్యవస్థలు, డిజిటల్ ఇంజినీరింగ్ సేవల కోసం 200 మి.డాలర్ల పెట్టుబడులు పెట్టింది. పరిశ్రమలోనే అత్యుత్తమ డిజిటల్ సిబ్బందిని కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ప్రపంచస్థాయి విమానయాన సంస్థల సరసన నిలిచేందుకు వచ్చే అయిదేళ్లలో మరిన్ని పెట్టుబడులు కొనసాగించనుందని అంచనా. సంప్రదాయ డిజిటల్ సాంకేతికత మొదలు కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. పరిశ్రమలో కొన్ని సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించేందుకు క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్లను సైతం వినియోగించాలని అనుకుంటోంది.
వినియోగదార్ల కోసం..: వెబ్సైట్, మొబైల్ యాప్ల ఆధునికీకరణ, సులభంగా వినియోగదార్లకు తెలిసేలా నోటిఫికేషన్ వ్యవస్థ, చాట్జీపీటీ ఆధారిత చాట్బాట్, విమానం లోపల వినోద సేవల ఆధునికీకరణ, రియల్ టైంలో వినియోగదార్లు తమ సపోర్ట్ సేవల విజ్ఞప్తులను ట్రాక్ చేసుకునేలా కస్టమర్ సేవల పోర్టల్ తదితర మార్పులకు శ్రీకారం చుట్టింది. డిజిటల్ మార్కెటింగ్, కాంటాక్ట్ సెంటర్ ఆధునికీకరణ, సెల్ఫ్ సర్వీస్ రీ-అకామడేషన్, కస్టమర్ ఫీడ్బ్యాక్, అనాలసిస్ వంటి వాటిలో కొత్త సాంకేతిక వ్యవస్థలను వినియోగించుకోనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
-
క్రికెట్ అభిమానులకు నో టికెట్.. సోషల్ మీడియాలో ‘బేరసారాలు’
-
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
చెప్పినా చెవికెక్కితేగా?వైకాపా ప్రచారాల్లో వాలంటీర్లు..
-
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!