Flight Ticket: విశాఖ నుంచి సింగపూర్‌ విమాన టికెట్‌ రూ.6,200

చౌక విమానయాన సంస్థ స్కూట్‌ నిర్ణీత ప్రాంతాలకు తక్కువ ధరలతో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ (ఎస్‌ఐఏ) అనుబంధ సంస్థ ఇది.

Updated : 17 May 2023 10:00 IST

ఈనాడు, హైదరాబాద్‌: చౌక విమానయాన సంస్థ స్కూట్‌ నిర్ణీత ప్రాంతాలకు తక్కువ ధరలతో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ (ఎస్‌ఐఏ) అనుబంధ సంస్థ ఇది. విశాఖపట్నం, తిరువనంతపురం, కోయంబత్తూర్‌, తిరుచిరాపల్లి, అమృత్‌సర్‌ల నుంచి ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాలోని 17 గమ్యస్థానాలకు ముందుగానే ప్రయాణం టిక్కెట్లు కొనుగోలు చేసే వారికి రాయితీ ధరల్లో టిక్కెట్లను అందిస్తున్నట్లు పేర్కొంది. కనీస టిక్కెట్‌ ధర రూ.6,200 (ఒకవైపు ప్రయాణానికి, పన్నులు అదనం) నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొంది. విశాఖపట్నం నుంచి సింగపూర్‌కు టికెట్‌ ధర రూ.6,200 ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. స్కూట్‌ప్లస్‌లో భాగంగా ప్రయాణికులకు 30 కిలోల చెక్‌-ఇన్‌ బ్యాగేజీ, భోజనంలాంటి ఇతర సౌకర్యాలూ అందిస్తున్నట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని