ఎయిర్టెల్ లాభంలో 49% వృద్ధి
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,005.60 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.2,007.80 కోట్లతో పోలిస్తే ఇది 49.2% అధికం.
దిల్లీ: టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,005.60 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.2,007.80 కోట్లతో పోలిస్తే ఇది 49.2% అధికం. ఏకీకృత ఆదాయం రూ.31,500.30 కోట్ల నుంచి 14.31% పెరిగి రూ.36,009 కోట్లకు చేరింది. ఎయిర్టెల్ భారత వ్యాపారం సమీక్షా త్రైమాసికంలో 12.2% పెరిగి రూ.25,250 కోట్లకు చేరగా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి 19% పెరిగి రూ.82,487.70 కోట్లకు ఎగబాకింది. 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎయిర్టెల్ నికర లాభం రూ.4,255 కోట్ల నుంచి రూ.8,346 కోట్లకు చేరింది. కార్యకలాపాల ఏకీకృత ఆదాయం రూ.1,16,546.90 కోట్ల నుంచి 19.3% పెరిగి రూ.1,39,144.80 కోట్లకు చేరింది.
ఆర్పు రూ.178 నుంచి రూ.193కు..: ‘మరొక బలమైన త్రైమాసికాన్ని నమోదు చేశాం. నాణ్యమైన ఖాతాదార్లను చేజిక్కించుకోవడంపైనే దృష్టి నిలిపి 74 లక్షల మంది కొత్త 4జీ వినియోగదార్లను సొంతం చేసుకున్నాం. దీంతో ఒక్కో వినియోగదారుడిపై సరాసరి ఆర్జన (ఆర్పు) రూ.178 నుంచి రూ.193కు చేరింద’ని భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విత్తల్ వెల్లడించారు.
ఫలితాల్లో మరిన్ని అంశాలు..: ఎయిర్టెల్ ఇండియా మొబైల్ సేవల ఆదాయం సమీక్షా త్రైమాసికంలో రూ.17,526.20 కోట్ల నుంచి 12% పెరిగి రూ.19,549.30 కోట్లకు చేరింది. ఈ సేవల వ్యాపార వార్షిక ఆదాయం రూ.62,915.10 కోట్ల నుంచి 21% పెరిగి రూ.75,924.60 కోట్లకు చేరింది.
* కంపెనీ మూలధన వ్యయాలు సమీక్షా త్రైమాసికంలో రూ.8,989.40 కోట్లకు చేరాయి. 2021-22 ఇదే త్రైమాసికంలో ఇవి రూ.4,276.70 కోట్లు మాత్రమే. దేశ వ్యాప్తంగా 5జీ నెట్వర్క్ నిర్మాణానికే ఇందులో అధిక భాగం (రూ.6,647.10 కోట్లు) నిధులు వెచ్చించింది. నెట్వర్క్ కవరేజీని బలోపేతం చేసేందుకు 12,500 అదనపు టవర్లను ఏర్పాటు చేసినట్లు ఎయిర్టెల్ తెలిపింది.
* కంపెనీకి మొత్తం చందాదార్ల సంఖ్య 48.97 కోట్ల నుంచి 51.84 కోట్లకు చేరింది. భారత్లో 35.83 కోట్ల నుంచి 4.7 శాతం పెరిగి 37.53 కోట్లకు చేరారు. ఇందులో 4జీ వినియోగదార్లు 20.84 కోట్ల నుంచి 11.6 శాతం పెరిగి 22.41 కోట్లకు చేరారు.
* ఒక్కో వినియోగదారుడి డేటా వినియోగం సరాసరిన 18.77 జీబీ నుంచి 20 జీబీకి చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన మాత్రం ఇది తగ్గడం గమనార్హం.
ఐఓసీ లాభం రూ.10,059 కోట్లు
దిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) మార్చి త్రైమాసికంలో రూ.10,058.69 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.6,021.88 కోట్లతో పోలిస్తే ఇది 67 శాతం అధికం. నాలుగో త్రైమాసికంలో ఇంధన మార్కెటింగ్ మార్జిన్లలో రికవరీ, మంచి రిఫైనింగ్ మార్జిన్లతో నికర లాభం బాగా పెరిగిందని కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఇది పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.8,241.82 కోట్లకు పెరిగేందుకూ దోహదం చేసింది.
* 2022-23 తొలి అర్ధ భాగంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచకపోవడంతో నష్టాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిని పూడ్చుకుని పూర్తి ఆర్థిక సంవత్సరంలో లాభాలు నమోదు చేయడానికి మార్చి త్రైమాసికం బాగా తోడ్పడింది. గత ఏడాది ఏప్రిల్ 6 నుంచి పెట్రోలు, డీజిల్ ధరలను ఐఓసీతో పాటు బీపీసీఎల్, హెచ్పీసీఎల్లు పెంచలేదు. అప్పట్లో బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్ల దరిదాపుల్లో ఉండటంతో నష్టాలు వచ్చాయి. ఇప్పుడు బ్యారెల్ ధర 75 డాలర్ల కంటే తక్కువకు చేరడంతో కంపెనీలు మంచి మార్జిన్లు పొందుతున్నాయి.
* 2021-22లో నమోదు చేసిన రూ.24,184 కోట్లతో పోలిస్తే మాత్రం గత ఆర్థిక సంవత్సరం లాభం తక్కువగా నమోదైంది. మార్కెటింగ్, పెట్రో రసాయనాల మార్జిన్లు తగ్గడం, మారకపు నష్టాలు ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది.
* రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.3 తుది డివిడెండు చెల్లించేందుకు బోర్డు ప్రతిపాదించింది.
* మార్చి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 10 శాతం పెరిగి రూ.2.26 లక్షల కోట్లకు చేరింది. మార్కెటింగ్ విక్రయాలు 21.789 మిలియన్ టన్నుల నుంచి 22.95 మిలియన్ టన్నులకు చేరాయి.
* పూర్తి ఆర్థిక సంవత్సరానికి 90.65 మి.టన్నుల ఇంధనాన్ని ఐఓసీ విక్రయించింది. 2021-22లో 80.49 మి.టన్నుల ఇంధనాన్ని అమ్మింది. ప్రతి బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చే క్రమంలో ఐఓసీ స్థూల రిఫైనింగ్ మార్జిన్ (జీఆర్ఎం) 11.25 డాలర్ల నుంచి 19.52 డాలర్లకు చేరింది. ఇన్వెంటరీ నష్టం/లాభం సర్దుబాటు తర్వాత జీఆర్ఎం 20.14 డాలర్లుగా నమోదైంది.
* 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులతో కలిపి మొత్తం 95.714 మి.టన్నుల ఉత్పత్తులను ఇండియన్ ఆయిల్ విక్రయించిందని ఐఓసీ ఛైర్మన్ ఎస్ఎం వైద్య వెల్లడించారు. 72.408 మి.టన్నుల ముడి చమురును శుద్ధి చేసినట్లు పేర్కొన్నారు.
బీఓబీ లాభం రూ.4,775 కోట్లు
దిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) 2022-23 మార్చి త్రైమాసికంలో రూ.4,775.33 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.1,778.77 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపునకు పైగా పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.18,174 కోట్ల నుంచి రూ.25,857 కోట్లకు చేరింది. మొండి బకాయిలు, ఆకస్మిక నిధికి కేటాయింపులు రూ.3,736 కోట్ల నుంచి రూ.1,420 కోట్లకు తగ్గాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి బీఓబీ నికర లాభం రూ.7,272 కోట్ల నుంచి రూ.14,109 కోట్లకు చేరింది.
* సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 33.8 శాతం పెరిగి రూ.11,525 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 3.07 శాతం నుంచి 3.53 శాతానికి పెరిగింది. ఫీజు ఆదాయం రూ.1,638 కోట్ల నుంచి 4.6 శాతం పెరిగి రూ.1,714 కోట్లకు చేరింది.
* అధిక ఎన్ఐఎం ఆశ్చర్యానికి గురి చేసిందని బ్యాంక్ ఎండీ, సీఈఓ సంజీవ్ చద్దా వెల్లడించారు. 2023-24లోనూ 3.5 శాతం ఎన్ఐఎంను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 11-13 శాతం కార్పొరేట్ రుణ వృద్ధితో మొత్తం రుణ వృద్ధి 13-14 శాతం ఉండేలా చూస్తామన్నారు.
* సమీక్షా త్రైమాసికంలో మొండి బకాయిలకు కేటాయింపులు రూ.5,200 కోట్ల నుంచి 94 శాతం తగ్గి రూ.320 కోట్లకు పరిమితమయ్యాయి.
* స్థూల నిరర్థక ఆస్తులు 6.61 శాతం నుంచి 3.79 శాతానికి మెరుగయ్యాయి. డిసెంబరు త్రైమాసికంలో ఇవి 4.53 శాతంగా ఉన్నాయి.
* ఇటీవల దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసుకున్న గోఫస్ట్కు బ్యాంక్ రూ.1,300 కోట్ల రుణాలు అందించిందని, అందుకే రూ.500 కోట్ల కేటాయింపులు చేసినట్లు చద్దా వివరించారు.
* 2023 మార్చి 31 నాటికి బ్యాంక్ కనీస మూలధన నిష్పత్తి 16.24 శాతంగా ఉంది.
* జీవిత బీమా అనుబంధ సంస్థను మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఐపీఓకు తీసుకురావాలనుకుంటన్నట్లు తెలిపారు. దీనికి 2024 మార్చి వరకు సమయం ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె