ఐటీ హార్డ్వేర్ తయారీకి రూ.17,000 కోట్ల ప్రోత్సాహకాలు
ఐటీ హార్డ్వేర్ తయారీని ప్రోత్సహించేందుకు రూ.17,000 కోట్ల బడ్జెట్ వ్యయంతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం 2.0కి బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
పీఎల్ఐ 2.0 పథకానికి మంత్రిమండలి ఆమోదం
దిల్లీ
ఐటీ హార్డ్వేర్ తయారీని ప్రోత్సహించేందుకు రూ.17,000 కోట్ల బడ్జెట్ వ్యయంతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం 2.0కి బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. దేశీయంగా గత 8 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్ తయారీ స్థిరంగా 17% సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్) సాధించింది. ఈ ఏడాది ఐటీ హార్డ్వేర్ పరికరాల ఉత్పత్తి కీలకమైన 105 బి.డాలర్ల (సుమారు రూ.9 లక్షల కోట్ల)ను అధిగమించనుంది. ‘ఐటీ పీఎల్ఐకు రూ.17,000 కోట్ల బడ్జెట్ వ్యయం కేటాయించాం. ఈ పథకానికి ఆరేళ్ల కాల వ్యవధిని నిర్ణయించామ’ని ఐటీ, టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకర్లకు వెల్లడించారు. భారీగా పరికరాలు తయారు చేసే యాపిల్, హెచ్పీ, డెల్, ఏసర్, ఆసుస్ వంటి సంస్థలు ఈ పథకాన్ని ఆసక్తిగా పరిశీలిస్తున్నాయని పేర్కొన్నారు. 2025-26కు దేశీయంగా 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.25 లక్షల కోట్ల) విలువైన ఎలక్ట్రానిక్స్ తయారీతో పాటు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రూ.82 లక్షల కోట్లకు చేరాలన్న లక్ష్యానికి ఈ పథకం తోడ్పడుతుందని మంత్రి వివరించారు.
ఈ పరికరాలకు
ఐటీ హార్డ్వేర్ పీఎల్ఐ 2.0 పథకం ల్యాప్టాప్లు, టాబ్లెట్ పీసీలు, ఆల్ ఇన్ వన్ పీసీలు, సర్వర్లు, అల్ట్రా-స్మాల్ ఫామ్ ఫ్యాక్టర్ పరికరాలకు వర్తిస్తుంది.
ప్రోత్సాహకాలు పెరుగుతాయ్
పీఎల్ఐ 2.0 పథకం కింద కంపెనీలు 5 శాతం వరకు ప్రోత్సాహకాలు అందుకోనున్నాయి. అలాగే వస్తువుల ఉత్పత్తి కోసం దేశీయంగా తయారైన విడిభాగాలను వినియోగించుకుంటే మరో 4 శాతం అదనపు ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. పాత పీఎల్ఐ పథకంలో ఇది 2 శాతంగానే ఉంది.
75,000 ఉద్యోగాలు
తాజా పథకం వల్ల రూ.2,430 కోట్ల పెట్టుబడులు వస్తాయన్నది అంచనాగా మంత్రి తెలిపారు. ఇందువల్ల రూ.3.35 లక్షల కోట్ల విలువైన అదనపు ఉత్పత్తితో పాటు, నిర్దేశించిన కాలంలో 75,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
* 2021 ఫిబ్రవరిలో ఐటీ హార్డ్వేర్ తయారీకి రూ.7,350 కోట్ల విలువైన తొలి పీఎల్ఐ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ల్యాప్టాప్లు, టాబ్లెట్ పీసీలు, ఆల్ ఇన్ వన్ పీసీలు, సర్వర్లకు వర్తింప చేశారు. ఈ విభాగంలో బడ్జెట్ వ్యయాలు పెంచాలని ప్రభుత్వాన్ని పరిశ్రమ వర్గాలు అభ్యర్థించిన నేపథ్యంలో తాజాగా పీఎల్ఐ 2.0 పథకాన్ని ప్రకటించారు.
* పీఎల్ఐ పథకాన్ని 2020 ఏప్రిల్ నుంచి ప్రారంభించారు. ప్రధానంగా మొబైల్ ఫోన్ల ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇది ఫలితాన్నిచ్చింది. మొబైల్ ఫోన్ల తయారీ/అసెంబ్లింగ్లో ప్రపంచంలో రెండో అతి పెద్ద ఉత్పత్తిదారుగా మన దేశం నిలిచింది. ఈ ఏడాది మార్చిలో మొబైల్ ఫోన్ల ఎగుమతులు 11 బి.డాలర్ల (సుమారు రూ.90,000 కోట్ల) మైలురాయిని అధిగమించాయి. చైనాతో పాటు మరో దేశంలోనూ తయారీ చేపట్టేందుకు చూస్తున్న అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు.. అందుకు మన దేశాన్ని ఎంచుకోవడం కలిసి వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం