రష్యాకు మందుల ఎగుమతులు పెంచుకుందాం!
రష్యా ఎన్నో ఏళ్లుగా మనకు మిత్ర దేశం. ప్రధానంగా రక్షణ భాగస్వామ్యానికే ఇది పరిమితమైంది. ద్వైపాక్షిక వాణిజ్యం పెద్దగా విస్తరించలేదు.
తగిన మార్గాలు అన్వేషిస్తున్న ‘ఫార్మాగ్జిల్’
వాణిజ్య లోటు తగ్గించేందుకు ప్రభుత్వ కసరత్తు
ఈనాడు - హైదరాబాద్
రష్యా ఎన్నో ఏళ్లుగా మనకు మిత్ర దేశం. ప్రధానంగా రక్షణ భాగస్వామ్యానికే ఇది పరిమితమైంది. ద్వైపాక్షిక వాణిజ్యం పెద్దగా విస్తరించలేదు. గత కొన్నేళ్లుగా ఇది 9 బిలియన్ డాలర్ల (సుమారు రూ.74,000 కోట్ల) వద్ద ఉండిపోయింది. ఏటా మనదేశం దాదాపు 3.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.29,000 కోట్ల) విలువైన వస్తువులను రష్యాకు ఎగుమతి చేస్తోంది. అదే సమయంలో రష్యా నుంచి 5- 5.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.41,000-45,000 కోట్ల) విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాం. మన ఎగుమతుల కంటే దిగుమతుల బిల్లు భారం (వాణిజ్యలోటు) సుమారు రూ.16,000 కోట్ల వరకే అధికంగా ఉండేది. ఈ గణాంకాలను పరిశీలిస్తే ద్వైపాక్షిక వాణిజ్యం, వాణిజ్య లోటు.. రెండూ తక్కువగానే ఉన్నాయి.
యుద్ధంతో అంతా మారింది
గతేడాది నుంచి రష్యాతో వాణిజ్యం అనూహ్యంగా విస్తరించింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఈ మార్పునకు ప్రధాన కారణం. ఈ యుద్ధం నేపథ్యంలో, రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. అప్పటినుంచి అంతర్జాతీయ ధర కంటే తక్కువకే ముడిచమురును రష్యా మనదేశానికి విక్రయిస్తోంది. ఫలితంగా మనదేశం రష్యా నుంచి పెద్దఎత్తున ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఒక్కసారిగా పెరిగింది. కానీ ఇదంతా ఏకపక్షమే. రష్యా నుంచి మన దేశంలోకి దిగుమతులు పెరిగాయి కానీ, మనదేశం నుంచి రష్యాకు ఎగుమతులు పెరగలేదు. దీంతో వాణిజ్య లోటు విస్తరించింది. 2022-23 ఆర్థిక సంవత్సరాన్నే తీసుకుంటే, రెండు దేశాల మధ్య వాణిజ్యం 39.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.26 లక్షల కోట్ల)కు పెరిగింది. అందులో మన ఎగుమతులు 4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.33,000 కోట్ల)కు మించి ఉండవు. మిగతా అంతా రష్యా నుంచి దిగుమతులే. అందులోనూ దాదాపు 30 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.46 లక్షల కోట్ల) మేరకు చమురు దిగుమతులే ఉంటాయి. వాణిజ్య లోటు ఇంత భారీగా పెరగడంతో, దీన్ని అదుపు చేయడం ఎలా.. అనే అంశంపై కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ దృష్టి సారించింది. తగిన ప్రత్యామ్నాయాలను అన్వేషించేందుకు కసరత్తు ప్రారంభించింది. రష్యాకు మందుల ఎగుమతులను పెంచుకోవాలని భావిస్తూ, తగిన మార్గాలు వెతకాల్సిందిగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మాగ్జిల్ (ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ను కోరింది.
ఔషధాలే ఎందుకు?
రష్యా నుంచి మనదేశం ఇటీవల వరకు ఆయుధ సామగ్రి, ఎరువులు, రసాయనాలు, లోహాలు, ఖనిజాలు దిగుమతి చేసుకునేది. ఇప్పుడు వీటన్నింటినీ ముడి చమురు మించింది. మనదేశం, రష్యాకు మందులు, దుస్తులు, యంత్ర విడిభాగాలు, ఇతర వస్తువులు ఎగుమతి చేస్తోంది. రష్యాకు మనదేశం చేసే ఎగుమతుల్లో మందుల వాటా 10% వరకు ఉంటోంది. సోవియట్ యూనియన్గా ఉన్నప్పటి నుంచీ, రష్యాకు మనదేశం ఔషధాలను ఎగుమతి చేస్తోంది. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, సన్ ఫార్మా, గ్లెన్మార్క్ ఫార్మా, టోరెంట్ ఫార్మా వంటి దిగ్గజ కంపెనీలు ఎన్నో ఏళ్లుగా రష్యాకు మందులు సరఫరా చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు మనదేశం ఎగుమతులు పెంచుకునే అవకాశం ఏదైనా ఉంటే, అది మందుల విభాగంలోనే అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అందువల్లే ఈ అంశాన్ని అధ్యయనం చేసి, తగిన ప్రణాళికను రూపొందించాల్సిందిగా ఫార్మాగ్జిల్ను కోరింది. దీనిపై పరిశీలన చేస్తున్నామని, త్వరలో ప్రణాళిక సిద్ధమవుతుందని ఫార్మాగ్జిల్ వర్గాలు ‘ఈనాడు’ కు వివరించాయి.
ఇతర వస్తువులు కూడా..
ఇతర వస్తువుల ఎగుమతులను ఏమేరకు పెంచుకోగలమనే విషయాన్నీ కేంద్ర వాణిజ్య శాఖ పరిశీలిస్తోంది. దీనిపై దేశంలోని వివిధ ఎగుమతుల ప్రోత్సాహక మండళ్లను ఇప్పటికే సంప్రదించింది. ఎక్కడెక్కడ ఎగుమతులు పెంచుకోవచ్చో చూడమని కోరింది. ఎలక్ట్రానిక్స్, వాహన విడిభాగాలు, తయారు చేసిన వస్తువులు, వ్యవసాయోత్పత్తుల ఎగుమతులూ పెంచుకునే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీనివల్ల కొంతమేరకైనా రష్యాతో వాణిజ్య లోటును తగ్గించుకునే అవకాశం లభిస్తుందని పేర్కొంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
Wipro Q4 results: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. -
ఓపెన్ ఏఐకి భారత్లో తొలి ఉద్యోగి.. ఎవరీ ప్రగ్యా మిశ్రా?
OpenAI: చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ప్రగ్యా మిశ్రాను తన తొలి ఉద్యోగిగా నియమించింది. -
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 599, నిఫ్టీ 151 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!