జీడీపీలో 9 శాతానికి రవాణా వ్యయాలు
వచ్చే మూడేళ్లలో రవాణా వ్యయాలను జీడీపీలో 9 శాతానికి తగ్గించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
14-16% నుంచి తగ్గించడమే లక్ష్యం : గడ్కరీ
దిల్లీ: వచ్చే మూడేళ్లలో రవాణా వ్యయాలను జీడీపీలో 9 శాతానికి తగ్గించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం ఇవి జీడీపీలో 14-16 శాతంగా ఉన్నాయి. సీఐఐ నిర్వహించిన ఓ సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ.. రవాణా వ్యయాలు దిగివస్తే, ఎగుమతులు పెరుగుతాయని పేర్కొన్నారు. కాగా.. పరిశ్రమలో పోటీ సామర్థ్యాన్ని పెంచేందుకు, రవాణా ఖర్చులను తగ్గించేందుకు జాతీయ రవాణా విధానం, పీఎం గతి శక్తి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలో రవాణా వ్యయాలను మదింపు చేసే నిమిత్తం ఓ విధానాన్ని రూపొందించేందుకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్ఫోర్స్లో సభ్యులుగా నీతి ఆయోగ్, గణాంకాలు- కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయ్డ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) ప్రతినిధులు, ఇతర విశ్లేషకులు ఉండనున్నారు. ప్రస్తుతం తమ మంత్రిత్వ శాఖ వద్ద 260 రోప్వేలు, రూ.1.3 లక్షల కోట్ల విలువైన కేబుల్ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయని గడ్కరీ తెలిపారు. 500 బస్సు డిపోల కోసం రహదారుల మంత్రిత్వ శాఖ స్థలాలను గుర్తించిందని, వీటి అభివృద్ధి కోసం దిగ్గజ పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులనూ ఆహ్వానించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశానికి 2 లక్షల విద్యుత్ బస్సుల అవసరం ఉందని మంత్రి తెలిపారు.
అత్యంత శక్తిమంత ఆర్థిక వ్యవస్థగా భారత్: మౌలిక రంగ అభివృద్ధిలో ప్రైవేట్- ప్రభుత్వ భాగస్వామ్యం, సాంకేతికత వినియోగం ద్వారా త్వరలోనే భారత్ అత్యంత శక్తిమంత ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉంటుందని మంత్రి గడ్కరీ వెల్లడించారు. మనదేశం రూ.16 లక్షల కోట్ల మేర సంప్రదాయ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, దీనిని తగ్గించుకునేందుకు ప్రభుత్వ రవాణా రంగంలో ఇథనాల్, మిథనాల్, విద్యుత్ కార్లు, బయో- సీఎన్జీ, బయో- ఎల్ఎన్జీ వినియోగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించుకునేందుకూ ఇది దోహదం చేయనుందని తెలిపారు. హైడ్రోజన్.. భవిష్యత్ ఇంధనమని మంత్రి తెలిపారు. విద్యుత్ వాహనాల ఉత్పత్తిపై మంత్రి మాట్లాడుతూ... ప్రస్తుతం జపాన్ను వెనక్కి నెట్టి మూడో స్థానంలో భారత్ ఉందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో అగ్రస్థానానికి చేరుకుంటామనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ‘కార్ల ఎగుమతులకు భారత్ ప్రధాన కేంద్రంగా ఉందని, మున్ముందు ట్రాక్టర్లు, బస్సులు, ఆటోలనూ ఎగుమతి చేస్తుంద’ని మంత్రి వివరించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు స్కైబస్సులను తీసుకొచ్చేందుకూ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. ఈ ప్రయత్నాలన్నింటి ద్వారా భారత్ దిగుమతిదారుగానే కాదు.. ఇంధనానికి ప్రధాన ఎగుమతిదారు అవుతుందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మస్క్(Elon Musk) భారత్ పర్యటన మరింత ఆలస్యం కానుంది. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా