9 ఏళ్లు.. రూ.197 లక్షల కోట్లు
దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి శుక్రవారానికి 9 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సమయంలో పెద్ద నోట్ల రద్దు, కొవిడ్-19 సంక్షోభం వంటి అవాంతరాలు ఎదురైనా.. పరోక్ష పన్నులన్నింటినీ ఒకటిగా చేసి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి తేవడం, తయారీ ఆధారిత ప్రోత్సాహక పథకాలను అమలు చేయడం, విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు తీసుకున్న చర్యల వల్ల స్టాక్ మార్కెట్ మదుపర్లకు మాత్రం లాభాల పంట పండింది.
మోదీ హయాంలో పెరిగిన బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ
2014 మే 26 సెన్సెక్స్ 24,716.88 నిఫ్టీ 7359.05
బీఎస్ఈ కంపెనీల మార్కెట్ విలువ: రూ.85.21 లక్షల కోట్లు
2023 మే 26 సెన్సెక్స్ 62,501.69 నిఫ్టీ 18,499.35
బీఎస్ఈ కంపెనీల మార్కెట్ విలువ: రూ.282.67 లక్షల కోట్లు
దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి శుక్రవారానికి 9 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సమయంలో పెద్ద నోట్ల రద్దు, కొవిడ్-19 సంక్షోభం వంటి అవాంతరాలు ఎదురైనా.. పరోక్ష పన్నులన్నింటినీ ఒకటిగా చేసి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి తేవడం, తయారీ ఆధారిత ప్రోత్సాహక పథకాలను అమలు చేయడం, విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు తీసుకున్న చర్యల వల్ల స్టాక్ మార్కెట్ మదుపర్లకు మాత్రం లాభాల పంట పండింది. గత 9 ఏళ్లలో సెన్సెక్స్, నిఫ్టీ 150 శాతానికి పైగా దూసుకెళ్లాయి. బీఎస్ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ 2014 మే నుంచి ఇప్పటివరకు రూ.197 లక్షల కోట్లకు మించి పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే సానుకూల వర్షపాత అంచనాలకు తోడు ఇతర అంశాల మద్దతుతో, సూచీలు దూసుకెళ్లడంతో మదుపర్ల సంపద రూ.2.34 లక్షల కోట్లు పెరిగింది.
2014 మే నుంచి 2023 మే మధ్య భారత ఈక్విటీల్లో విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) 49.21 బి.డాలర్ల (దాదాపు రూ.4 లక్షల కోట్ల) పెట్టుబడులు పెట్టారు. ఈ 9 ఏళ్లలో కేవలం రెండేళ్లలోనే వారు నికర విక్రేతలుగా నిలిచారు. ఇదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.7 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడం గమనార్హం. 2020 నుంచి కొవిడ్ రూపంలో సవాళ్లు ఎదురైనా.. స్టాక్మార్కెట్లోకి రిటైల్ మదుపర్లు భారీగా ప్రవేశించేందుకు ఈ సమయమే కారణమైంది. ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా మనదేశం నిలవడంతో, అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానం అవుతోంది.
* 2027 కల్లా జపాన్, జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని.. 2030 కల్లా మూడో అతిపెద్ద స్టాక్మార్కెట్గా ఉంటుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. భారత జీడీపీ ప్రస్తుత 3.5 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.287 లక్షల కోట్ల) స్థాయి నుంచి 2031కి 7.5 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.615 లక్షల కోట్ల)కు చేరుతుందనే అంచనానూ ఆ సంస్థ వ్యక్తం చేసింది.
* అయిదేళ్లలో సెన్సెక్స్ 1,00,000 పాయింట్లకు చేరుతుందనే అంచనాను అమెరికాకు చెందిన జెఫ్రీస్ ఈక్విటీ విభాగాధిపతి క్రిస్ వుడ్ అంచనా వేశారు.
* మోదీ హయాంలో నిఫ్టీ ఐటీ సూచీ అత్యధికంగా 219% దూసుకెళ్లింది. కొవిడ్ పరిణామాల్లో అన్ని రంగాలు డిజిటల్కు మారడం వల్ల ఐటీ కంపెనీలకు భారీగా ప్రాజెక్టులు రావడమే ఇందుకు కారణం
ఉరకలేసిన ఉత్సాహం
మదుపర్ల కొనుగోళ్ల జోరుతో రెండో రోజూ సూచీలు లాభాలను నమోదుచేశాయి. రిలయన్స్, హెచ్యూఎల్ వంటి పెద్ద షేర్లు దుమ్మురేపడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు కలిసొచ్చాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 12 పైసలు బలపడి 82.60 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.24% పెరిగి 76.44 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
* కొనుగోళ్ల మద్దతుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు దుమ్మురేపింది. 2.79% లాభపడిన షేరు రూ.2,506.55 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.45,887.8 కోట్లు పెరిగి రూ.16.95 లక్షల కోట్లకు చేరింది. సానుకూల ఆర్థిక ఫలితాల ప్రభావంతో సన్ఫార్మా షేరు 2.75% పెరిగి రూ.970.65 దగ్గర స్థిరపడింది. జనవరి- మార్చిలో నష్టం తగ్గడంతో వొడాఫోన్ ఐడియా షేరు 1.14% పెరిగి రూ.7.07 వద్ద ముగిసింది.
నేటి బోర్డు సమావేశాలు: అరబిందో ఫార్మా, జీఎంఆర్ ఇన్ఫ్రా, ఆర్కామ్, పీఎఫ్సీ, పాల్రెడ్ టెక్నాలజీస్, గాడ్ఫ్రే ఫిలిప్స్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
Wipro Q4 results: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. -
ఓపెన్ ఏఐకి భారత్లో తొలి ఉద్యోగి.. ఎవరీ ప్రగ్యా మిశ్రా?
OpenAI: చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ప్రగ్యా మిశ్రాను తన తొలి ఉద్యోగిగా నియమించింది. -
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 599, నిఫ్టీ 151 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి