ఎయిరిండియా, ఏఐ ఎక్స్‌ప్రెస్‌లో 3,900కు పైగా నియామకాలు

ఈ ఏడాది ప్రారంభం నుంచి 3,900 మందికి పైగా ఉద్యోగులను ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లు నియమించుకున్నట్లు కంపెనీ సీఈఓ క్యాంబెల్‌ విల్సన్‌ పేర్కొన్నారు.

Published : 28 May 2023 01:36 IST

కంపెనీ సీఈఓ క్యాంబెల్‌ విల్సన్‌

దిల్లీ: ఈ ఏడాది ప్రారంభం నుంచి 3,900 మందికి పైగా ఉద్యోగులను ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లు నియమించుకున్నట్లు కంపెనీ సీఈఓ క్యాంబెల్‌ విల్సన్‌ పేర్కొన్నారు. ఇందులో 500కు పైగా పైలెట్లు, 2,400 మంది కేబిన్‌ సిబ్బంది ఉన్నారు. టాటా గ్రూప్‌ కింద పునర్‌వ్యవస్థీకరించుకుంటున్న ఎయిరిండియా.. కార్యకలాపాల విస్తరణతో పాటు ఉద్యోగుల నియామకాలపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది 1000వ కొత్త కేబిన్‌ క్రూ బాధ్యతలు చేపట్టినట్లు ఎయిరిండియా ఉద్యోగులకు పంపిన సందేశంలో విల్సన్‌లో వెల్లడించారు. నియామకాలు, శిక్షణ సామర్థ్యాల విషయంలో తమ బృందాలు అద్భుతంగా పనిచేశాయని అన్నారు. ప్రస్తుతం ఎయిరిండియాకు దాదాపు 11,000 మంది, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు 1,900కు ఉద్యోగులు ఉన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని