రెండేళ్లలో అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్!
వచ్చే రెండేళ్లలో భారత్ నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2014 నుంచి మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, క్షేత్రస్థాయి కార్యక్రమాలతో దేశం సామాజికంగా, ఆర్థికంగా ఎంతగానో మారిందని తెలిపారు.
ఆరేళ్లలో మూడో స్థానానికి..
కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్
దిల్లీ: వచ్చే రెండేళ్లలో భారత్ నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2014 నుంచి మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, క్షేత్రస్థాయి కార్యక్రమాలతో దేశం సామాజికంగా, ఆర్థికంగా ఎంతగానో మారిందని తెలిపారు. మోదీ సర్కారు 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘ప్రపంచానికి భారత్ ప్రస్తుతం ఒక ఆశాదీపంగా కనిపిస్తోంది. ప్రపంచం మొత్తం భారత్పై ఎంతో విశ్వాసంతో ఉంది. దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మోదీ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది. తద్వారా 2047 నాటికి దేశం సరికొత్త శిఖరాలను అధిరోహిస్తుంది. అప్పటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవస్థ పరంగా పదో స్థానంలో ఉన్న మన దేశం ప్రస్తుతం అయిదో స్థానానికి చేరింది. వచ్చే రెండేళ్లలో నాలుగో స్థానానికి, ఆరేళ్లలో మూడో స్థానానికి చేరుకుంటుంద’ని ఆశాభావం వ్యక్తం చేశారు.
* కొవిడ్ కాలంలో సమయానికి టీకాల పంపిణీ మొదలుకొని సురక్షిత తాగునీరు అందించడం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అందుబాటు ధరలో ఇళ్లు ఇవ్వడం, రైలు, విమాన, రహదారి మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి నాణ్యమైన, నిజమైన మార్పును దేశంలో తీసుకొచ్చాయని మంత్రి వివరించారు. పీఎం ఆవాస్ యోజన కింద 3.5 కోట్ల ఇళ్లు నిర్మించారన్నారు. 12 కోట్ల మందికి నీటి కనెక్షన్లు, 9.6 కోట్ల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు అందించినట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ బీమా కార్యక్రమం ‘ఆయుష్మాన్ భారత్’ను తీసుకొచ్చినట్లు తెలిపారు. దీని కింద రూ.5 లక్షల వరకు కవరేజీ అందిస్తున్నట్లు తెలిపారు. అమెరికా, రష్యా జనాభాను కలిపినా అంతకంటే ఎక్కువ మందిని ఈ పథకంలో చేర్చినట్లు వెల్లడించారు. డిజిటల్ విప్లవం పేదవారికి కూడా కొత్త అవకాశాలు కల్పిస్తోందన్నారు.
2027 నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు.. సునీల్ మిత్తల్: 2027 నాటికి మన దేశ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.410 లక్షల కోట్లు)కు చేరే అవకాశం ఉందని భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ సునీల్ మిత్తల్ వెల్లడించారు. గత 5 ఏళ్లలో దేశం సాధిస్తున్న అభివృద్ధిని వ్యక్తిగతంగా గమనిస్తున్నానని పేర్కొన్నారు. 2024 నాటికి దేశ వ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని, ప్రపంచంలోనే అతి వేగంగా సాంకేతికత వైపు అడుగులు వేస్తున్న దేశంగా భారత్ నిలుస్తోందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది. -
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
Wipro Q4 results: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. -
ఓపెన్ ఏఐకి భారత్లో తొలి ఉద్యోగి.. ఎవరీ ప్రగ్యా మిశ్రా?
OpenAI: చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ప్రగ్యా మిశ్రాను తన తొలి ఉద్యోగిగా నియమించింది. -
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 599, నిఫ్టీ 151 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!