బేరింగ్ పీఈ చేతికి హెచ్డీఎఫ్సీ క్రెడిల్లా?
హెచ్డీఎఫ్సీకి చెందిన విద్యా రుణాల సంస్థ ‘హెచ్డీఎఫ్సీ క్రెడిల్లా’లో మెజార్టీ వాటాను హాంకాంగ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కొనుగోలు చేయనుందని తెలుస్తోంది.
90 శాతం వాటా కొనుగోలు చేసే యోచన
దిల్లీ: హెచ్డీఎఫ్సీకి చెందిన విద్యా రుణాల సంస్థ ‘హెచ్డీఎఫ్సీ క్రెడిల్లా’లో మెజార్టీ వాటాను హాంకాంగ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కొనుగోలు చేయనుందని తెలుస్తోంది. దాదాపు 1.3 బిలియన్ డాలర్ల (రూ.10,000 కోట్ల) సంస్థాగత విలువకు ఈ లావాదేవీ జరిగే అవకాశం ఉందని సమాచారం. మార్కెట్ వర్గాల్లో ప్రచారంలో ఉన్న అంశాల ప్రకారం, హెచ్డీఎఫ్సీ క్రెడిల్లాలో 90% వాటాను, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ నుంచి బేరింగ్ పీఈ కొనుగోలు చేస్తుంది. మిగిలిన 10% వాటా హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వద్ద ఉంటుంది. వచ్చే రెండేళ్లలో దశల వారీగా ఈ 10% వాటాను కూడా విక్రయించాలనేది హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఆలోచనగా తెలుస్తోంది. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ త్వరలోనే హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనం కాబోతున్న విషయం విదితమే. ఈ విలీనానికి ముందే హెచ్డీఎఫ్సీ క్రెడిల్లాలో వాటాల విక్రయం పూర్తవుతుందని అంటున్నారు. కేవలం విద్యా రుణాలు ఇచ్చే ప్రైవేటు రంగ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల్లో హెచ్డీఎఫ్సీ క్రెడిల్లా అగ్రగామిగా ఉంది. ప్రధానంగా విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు ఈ సంస్థ అధికంగా రుణాలు ఇస్తోంది.
విజయ డయాగ్నొస్టిక్ లాభం రూ.27 కోట్లు
హైదరాబాద్: రోగ నిర్థారణ సేవల సంస్థ విజయ డయాగ్నొస్టిక్ సెంటర్, మార్చి త్రైమాసికానికి రూ.26.92 కోట్ల స్టాండలోన్ నికరలాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాల లాభం రూ.23.71 కోట్లే. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.117.05 కోట్ల నుంచి రూ.122.86 కోట్లకు పెరిగింది. 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.464.15 కోట్ల ఆదాయంపై రూ.83.23 కోట్ల నికరలాభాన్ని సంస్థ నమోదు చేసింది. 2021-22లో రూ.463.79 కోట్ల ఆదాయంపై రూ.108.29 కోట్ల నికరలాభాన్ని సంస్థ ఆర్జించింది. 1 రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.1 డివిడెండును డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.
50% స్మార్ట్ఫోన్ విడిభాగాలు స్థానికంగా సమీకరిస్తాం: షియామీ
దిల్లీ: విలువపరంగా స్మార్ట్ఫోన్లో వినియోగించే 50 శాతం విడిభాగాలను భారత్ నుంచే సమీకరించడం 2025కు సాకారమవుతుందని షియామీ ఇండియా అధ్యక్షుడు బి.మురళికృష్ణన్ వెల్లడించారు. కంపెనీ తాజాగా హియరబుల్స్ విభాగంలోకి అడుగుపెట్టామని, నోయిడాలో ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలో వీటిని ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరకు స్మార్ట్ఫోన్ తెరలు, ఫింగర్ప్రింట్ సెన్సర్లను కూడా స్థానికంగానే సమీకరించడంపై పనిచేస్తున్నట్లు వివరించారు. 5జీ ఫోన్లను రూ.10,000-15,000 శ్రేణిలో ఆవిష్కరిస్తే, విక్రయావకాశాలు బాగుంటాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
Wipro Q4 results: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. -
ఓపెన్ ఏఐకి భారత్లో తొలి ఉద్యోగి.. ఎవరీ ప్రగ్యా మిశ్రా?
OpenAI: చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ప్రగ్యా మిశ్రాను తన తొలి ఉద్యోగిగా నియమించింది. -
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 599, నిఫ్టీ 151 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి