ప్రపంచ స్టాక్ మార్కెట్లలో మనకు 5వ స్థానం
ప్రపంచంలో 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా భారత్ మళ్లీ అవతరించింది. జనవరిలో ఈ స్థానాన్ని ఫ్రాన్స్కు మన దేశం కోల్పోయింది. విదేశీ మదుపర్ల కొనుగోళ్లు స్థిరంగా కొనసాగడం, దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో ఈ ఏడాది మార్చి 28 నుంచి భారత మార్కెట్లు మళ్లీ దూసుకెళ్తున్నాయి.
ప్రపంచంలో 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా భారత్ మళ్లీ అవతరించింది. జనవరిలో ఈ స్థానాన్ని ఫ్రాన్స్కు మన దేశం కోల్పోయింది. విదేశీ మదుపర్ల కొనుగోళ్లు స్థిరంగా కొనసాగడం, దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో ఈ ఏడాది మార్చి 28 నుంచి భారత మార్కెట్లు మళ్లీ దూసుకెళ్తున్నాయి. ఫలితంగా మళ్లీ తొలి విలువ పరంగా 5 స్టాక్మార్కెట్ల జాబితాలోకి మనదేశం వచ్చింది. ఈ సమయంలో సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 10 శాతం రాణించగా, బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 15%, బీఎస్ఈ బ్యాంకింగ్ సూచీ 13% లాభాలను పంచాయి. విదేశీ మదుపర్లు గత రెండు నెలల్లో భారత మార్కెట్లలో దాదాపు 6.3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.52,000 కోట్ల మేర) పెట్టుబడులు పెట్టారు.
* ప్రస్తుతం మన స్టాక్ మార్కెట్ విలువ 3.4 లక్షల కోట్ల డాలర్లు (రూ.283.92 లక్షల కోట్లు గా ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి భారత మార్కెట్ విలువ దాదాపు 330 బి.డాలర్ల (రూ.27 లక్షల కోట్ల)కు పైగా వృద్ధి చెందింది.
* అమెరికా 44.54 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.3680 లక్షల కోట్ల) మార్కెట్ విలువతో అగ్రస్థానం నిలబెట్టుకుంది.
రూ.700 కోట్ల సమీకరణలో అల్టిగ్రీన్ ప్రొపల్షన్ ల్యాబ్స్!
అంబానీ మద్దతున్న ఈవీ కంపెనీ ఇది
దిల్లీ: విద్యుత్ సరకు రవాణా వాహనాల తయారీ సంస్థ అల్టిగ్రీన్ ప్రొపల్షన్ ల్యాబ్స్ తాజాగా రూ.700 కోట్ల (85 మి. డాలర్లు) మేర నిధులను సమీకరించాలని భావిస్తోంది. ఉత్పత్తిని పెంచడంతో పాటు కొత్త మోడళ్ల అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టడం కోసం ఈ నిధులను కంపెనీ ఉపయోగించనుంది. భారత కుబేరుడు ముకేశ్ అంబానీ మద్దతు ఉన్న ఈ కంపెనీ తాజా నిధుల సమీకరణ కోసం, సంస్థ విలువను 350 మి. డాలర్ల (సుమారు రూ.2900 కోట్ల) దరిదాపుల్లో ఆశిస్తోందని సమాచారం. ఈ సందర్భంలోనే ప్రస్తుత పెట్టుబడిదార్లలో కొంత మంది తమ వాటాలు విక్రయించనున్నట్లు తెలిసింది. చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నందున నిధుల సమీకరణ గణాంకాలు మారొచ్చని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్షమాపణలు యాడ్ సైజ్లోనే ప్రచురించారా? పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
Patanjali: పతంజలి ఉత్పత్తుల ప్రయోజనాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఆ కంపెనీపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని తెలపగా.. అది ఏ సైజ్లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది. -
జొమాటో ప్లాట్ఫాం ఫీజు రూ.5కు పెంపు
ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది. -
సంక్షిప్త వార్తలు(5)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్ పికప్ జోన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
క్షమాపణలు యాడ్ సైజ్లోనే ప్రచురించారా? పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!