మూడో రోజూ లాభాల పరుగు
సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో వరుసగా మూడో రోజూ సూచీలు లాభాలు కొనసాగించాయి. అమెరికా రుణ పరిమితి పెంచేందుకు ఆదివారం ఒప్పందం కుదరడమే ఇందుకు నేపథ్యం.
సమీక్ష
సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో వరుసగా మూడో రోజూ సూచీలు లాభాలు కొనసాగించాయి. అమెరికా రుణ పరిమితి పెంచేందుకు ఆదివారం ఒప్పందం కుదరడమే ఇందుకు నేపథ్యం. లోహ, స్థిరాస్తి, ఫైనాన్స్ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 3 పైసలు తగ్గి 82.63 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.17 శాతం నష్టంతో 76.82 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై లాభపడగా, హాంకాంగ్ నష్టపోయాయి. ఐరోపా సూచీలు నిరాశపరిచాయి.
సెన్సెక్స్ ఉదయం 62,801.54 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదలాడిన సూచీ.. ఇంట్రాడేలో 63,026 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 344.69 పాయింట్లు లాభంతో 62,846.38 వద్ద ముగిసింది. నిఫ్టీ 99.30 పాయింట్లు పెరిగి 18,598.65 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,581.25- 18,641.20 పాయింట్ల మధ్య కదలాడింది.
* మార్చి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో ఎం అండ్ ఎం షేరు ఇంట్రాడేలో 5.31% లాభపడి రూ.1350 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 3.71% రాణించి రూ.1329.45 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.5,919.2 కోట్లు పెరిగి రూ.1.65 లక్షల కోట్లకు చేరింది.
* వచ్చే 16 నెలల్లో సాధారణ బీమా విభాగం ఐసీఐసీఐ లాంబార్డ్లో తమ వాటాను మరో 4 శాతం పెంచుకోనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. ప్రస్తుతం ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్లో బ్యాంకుకు 48.02% వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం.. మరో 4 శాతం వాటా కొనుగోలుకు దాదాపు రూ.2,352.5 కోట్లు అవసరమవుతాయి. ఈ వార్తల నేపథ్యంలో ఐసీఐసీఐ లాంబార్డ్ షేరు 8.19% దూసుకెళ్లి రూ.1190 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.4,427.87 కోట్లు పెరిగి రూ.58,446.72 కోట్లుగా నమోదైంది.
* ఇండియా ఐఎన్ఎక్స్పై బాండ్ల జారీ ద్వారా 750 మి.డాలర్లు సమీకరించినట్లు ఎస్బీఐ వెల్లడించింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 20 రాణించాయి. ఎం అండ్ ఎం 3.71%, టైటన్ 2.48%, టాటా స్టీల్ 1.88%, ఎస్బీఐ 1.55%, హెచ్డీఎఫ్సీ 1.53%, అల్ట్రాటెక్ 1.49%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.30%, ఐటీసీ 1.22%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.20% చొప్పున లాభపడ్డాయి. పవర్గ్రిడ్, హెచ్సీఎల్ టెక్, మారుతీ, విప్రో, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ 1.14% వరకు నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో మన్నికైన వినిమయ వస్తువులు 1.58%, లోహ 1.38%, ఆర్థిక సేవలు 0.81%, స్థిరాస్తి 0.80%, కమొడిటీస్ 0.79%, వాహన 0.63% పెరిగాయి. చమురు-గ్యాస్, ఐటీ, టెక్, ఇంధన నీరసపడ్డాయి. బీఎస్ఈలో 1967 షేర్లు లాభపడగా, 1661 స్క్రిప్లు నష్టపోయాయి. 183 షేర్లలో ఎటువంటి మార్పులేదు.
* అదానీ గ్రూప్ సంస్థ ఎన్డీటీవీని మంగళవారం నుంచి స్వల్పకాల ఏఎస్ఎం నియమావళిలో చేరుస్తున్నట్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వెల్లడించాయి. ఇప్పటికే అదానీ ఎంటర్ప్రైజెస్ ఏఎస్ఎం నియామవళిలో ఉంది.
నేటి బోర్డు సమావేశాలు: అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, రామ్కీ ఇన్ఫ్రా, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్, ఈఐడీ ప్యారీ, ఐబీ రియల్ ఎస్టేట్, రాజేశ్ ఎక్స్పోర్ట్స్, రిలయన్స్ ఇన్ఫ్రా, టెగా ఇండస్ట్రీస్, టొరెంట్ ఫార్మా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’