జీడీపీ @ 7.2 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి వృద్ధిని సాధించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంత వృద్ధిని నమోదు చేస్తున్న వర్థమాన దేశంగా తన హవాను కొనసాగించింది.
2022-23లో అంచనాలకు మించి వృద్ధి
నాలుగో త్రైమాసికంలో 6.1 శాతంగా నమోదు
రాణించిన వ్యవసాయం, తయారీ, గనులు
దిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి వృద్ధిని సాధించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంత వృద్ధిని నమోదు చేస్తున్న వర్థమాన దేశంగా తన హవాను కొనసాగించింది. 2022-23 జనవరి-మార్చి త్రైమాసికంలో 6.1% వృద్ధి చెందడంతో, పూర్తి ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7.2 శాతానికి చేరింది. వ్యవసాయం (5.5%, తయారీ 4.5%, గనులు 4.3%, నిర్మాణ రంగం 10.4% రాణించడం ఇందుకు ఉపకరించింది. బుధవారమిక్కడ విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం ఆర్థిక వ్యవస్థ 3.3 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.272 లక్షల కోట్ల) స్థాయికి చేరింది. కొన్నేళ్లలో మన ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్న లక్ష్యానికి ఇది దన్నుగా నిలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. 2021-22లో భారత జీడీపీ 9.1% రాణించగా.. అదే ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చిలో వృద్ధిరేటు 4 శాతంగా ఉంది.
గత అంచనా 7 శాతమే: జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన రెండో ముందస్తు అంచనాల్లో, 2022-23 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 7 శాతంగా నమోదవ్వొచ్చని పేర్కొంది. తాజా గణాంకాల్లో అంతకు మించి 7.2 శాతంగా నమోదైంది.
2.8 లక్షల కోట్ల డాలర్ల నుంచి..
ప్రస్తుత ధరల వద్ద జీడీపీ లేదా నామినల్ జీడీపీ 2022-23లో రూ.272.41 లక్షల కోట్లు (3.3 లక్షల కోట్ల డాలర్లు)గా నమోదైంది. 2021-22లో ఇది రూ.234.71 లక్షల కోట్లు (2.8 లక్షల కోట్ల డాలర్లు)గా ఉంది. అంటే 16.1% వృద్ధి చెందిందని ఎన్ఎస్ఓ పేర్కొంది.
నీ స్థిర ధరల వద్ద (2011-12 ప్రకారం) నాలుగో త్రైమాసికం (2022-23)లో జీడీపీ రూ.43.62 లక్షల కోట్లుగా నమోదైంది. 2021-22 ఇదే కాలంలో నమోదైన రూ.41.12 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 6.1 శాతం ఎక్కువ.
* ప్రస్తుత ధరల వద్ద జీడీపీ 2022-23 నాలుగో త్రైమాసికంలో రూ.71.82 లక్షల కోట్లుగా నమోదైంది. 2021-22 నాలుగో త్రైమాసికం నాటి రూ.65.05 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 10.4% పెరిగినట్లు లెక్క.
* స్థూల విలువ జోడింపు (జీవీఏ) వృద్ధి 2022-23లో 7 శాతానికి చేరగా.. అంతక్రితం ఏడాది 8.8 శాతంగా ఉంది. 2022-23లో జాతీయ ఆదాయం రూ.3,80,964 కోట్లకు చేరింది. 2021-22లో నమోదైన రూ.4,47,182 కోట్లతో పోలిస్తే ఇది తక్కువ.
6.4 శాతంగా ద్రవ్యలోటు: గత ఆర్థిక సంవత్సరం(2022-23)లో ద్రవ్యలోటు.. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 6.4 శాతంగా నమోదైంది. రూపాయల్లో ద్రవ్యలోటు రూ.17,33,131 కోట్ల (తాత్కాలికం)కు చేరిందని సీజీఏ పేర్కొంది.
6 నెలల కనిష్ఠానికి మౌలికం: ఈ ఏడాది ఏప్రిల్లో మౌలిక రంగ వృద్ధి 6 నెలల కనిష్ఠమైన 3.5 శాతానికి పరిమితమైంది. ముడిచమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్ రంగాల ఉత్పత్తి తగ్గడంతో 8 కీలక రంగాల వృద్ధి 3.5 శాతంగా నమోదైంది. మౌలిక రంగాల వృద్ధి 2022 ఏప్రిల్లో 9.5 శాతంగా ఉండగా, ఈ ఏడాది మార్చిలో 3.6 శాతంగా ఉంది.
అంతర్జాతీయ సవాళ్లలోనూ.. భారత ఆర్థిక వ్యవస్థ 7.2% మేర రాణించడం.. అంతర్జాతీయ సవాళ్లను భారత్ ఎంత సమర్థంగా ఎదుర్కుందో వెల్లడిస్తోంది. పూర్తి ఆశావహ దృక్పథంతో సాగి, బలమైన పనితీరును నమోదు చేశాం. భవిష్యత్లోనూ మన ఆర్థిక వ్యవస్థకు ఢోకా ఉండదన్న ధీమానిచ్చాం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
అంచనాలకు మించే రాణిస్తుంది
భారత్ మరో ఏడాదీ బలమైన పనితీరును ప్రదర్శిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదవుతుందన్న అంచనాలున్నాయి. ఇంతకు మించి కూడా నమోదు కావచ్చు. స్థూల ఆర్థిక పరిస్థితులు, ద్రవ్య స్థిరత్వం కారణంగా దేశం స్థిరమైన వృద్ధి బాటలో పయనిస్తున్నందుకు మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ భారత్ అంచనాలకు మించి రాణించగలదని భావిస్తున్నాం.
ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. సోషల్మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రీమియం, ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. -
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM