ఏఐ వల్ల మా ఉద్యోగాలు పోతాయ్
కృత్రిమ మేధ(ఏఐ) తమ ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా మారుతుందేమోనని భారత్లోని 74 శాతం సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మైక్రోసాఫ్ట్ తన సర్వేలో పేర్కొంది. గురువారం వెలువడ్డ ఈ సర్వే ‘మైక్రోసాఫ్ట్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2023’ ప్రకారం..
74% భారతీయుల ఆందోళన
మైక్రోసాఫ్ట్ నివేదిక
దిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ) తమ ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా మారుతుందేమోనని భారత్లోని 74 శాతం సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మైక్రోసాఫ్ట్ తన సర్వేలో పేర్కొంది. గురువారం వెలువడ్డ ఈ సర్వే ‘మైక్రోసాఫ్ట్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2023’ ప్రకారం..
* భారత్లో నాలుగింట మూడొంతుల మంది తమ పనిని సాధ్యమైనంత వరకు ఏఐకు అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
* 90 శాతం మంది భారతీయ కంపెనీల నిర్వాహకులు, ఏఐ వృద్ధికి తగ్గట్లుగా ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
* వినూత్నత కొరవడుతోందని నాలుగింట మూడొంతుల(84%) సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. సమావేశాలు సరిగ్గా జరగకపోవడమే. తాము సగం సమావేశాలకు హాజరుకాకపోయినా సహచరులు గుర్తించలేకపోతున్నారని 46% మంది సిబ్బంది భావిస్తున్నారు.
* ఏఐ నిపుణులే కాదు.. ప్రతి ఉద్యోగి తమ రోజువారీ పనుల్లో భాగంగా కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలని నివేదిక అభిప్రాయపడింది.
* ప్రస్తుతం తమ పనులు పూర్తి చేయడానికి తగిన సామర్థ్యాలు తమ వద్ద లేవని భారతీయ సిబ్బంది అనుకుంటున్నారు.
ఏఐతో సులువుగా పనులు: ‘ఏఐ వల్ల రోజువారీ పనుల్లో భారీ మార్పులు రావొచ్చు. సరికొత్త ఉత్పాదకత వృద్ధి దశకు తదుపరి తరం ఏఐ తలుపులు తెరవగలదు. వీటి వల్ల పనుల్లో కఠినత్వం తొలగుతుంది. ఉల్లాసంగా, వినూత్నంగా ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. అయితే ప్రతి సంస్థా, ఉన్నతాధికారులు ఆ దిశగా ఏఐను అందిపుచ్చుకోవాలి. ప్రతి ఉద్యోగి భవిష్యత్ అవసరాలకు కొత్త దారులు వేసేలా ఏఐని పరీక్షించి, అందించాల’ని మైక్రోసాఫ్ట్ కంట్రీ హెడ్ భాస్కర్ బసు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
-
నగదుంటేనే రైడ్ రైట్
-
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్