కొత్త విమానాలకు అమిత గిరాకీ
అంతర్జాతీయంగా విమాన ప్రయాణికుల రద్దీలో వృద్ధి ఎక్కువగా ఉన్న మార్కెట్లలో ఒకటైన భారత్.. ప్రపంచంలోనే అత్యంత కీలక విమానాల మార్కెట్గా అవతరించనుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది.
మధ్యతరగతి పెరుగుతుండడమే కారణం
భారత విపణిపై బార్క్లేస్ నివేదిక
దిల్లీ: అంతర్జాతీయంగా విమాన ప్రయాణికుల రద్దీలో వృద్ధి ఎక్కువగా ఉన్న మార్కెట్లలో ఒకటైన భారత్.. ప్రపంచంలోనే అత్యంత కీలక విమానాల మార్కెట్గా అవతరించనుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. ప్రయాణికుల, రక్షణ విమానాలు సరికొత్తవి భారత్కు అధికంగా కావాల్సి ఉందని పేర్కొంది. అమెరికా, చైనా తరవాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన విపణిగా భారత్ ఉంది. విమానాల మార్కెట్లో భారత్కు ప్రాధాన్యం పెరగడంపై, ఇతరత్రా అంశాలపై బార్క్లేస్ నివేదిక ఏమంటోందంటే..
* మధ్యతరగతి జనాభా పెరుగుతుండడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాంతీయ అనుసంధాన పథకం (ఉడాన్) వల్ల విమాన ప్రయాణాలకు ఊతం లభిస్తోంది. ఇందువల్లే
మరిన్ని విమానాల అవసరం పెరుగుతోంది.: 2006 నుంచి 2019 మధ్య దేశీయ విమాన ప్రయాణికుల రద్దీలో 11 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) నమోదైంది. దీర్ఘకాల అంతర్జాతీయ సగటు అంచనా కంటే 2 శాతం అధికంగానే భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశం ఉంది.
* 2009-22 మధ్య భారత విమానయాన సంస్థలు 1400 విమానాలకు ఆర్డర్లు పెట్టాయి. ఇపుడు అమెరికా తర్వాత అత్యధిక విమానాలకు ఆర్డర్లు మనవే. బోయింగ్, ఎయిర్బస్ అన్ని డెలివరీల్లో 7 శాతం భారతే తీసుకుంటోంది. * ఇండిగో, ఆకాశ ఎయిర్ సంస్థలు తమ మార్కెట్ వాటా పెంచుకోవడం కోసం విమానాలకు ఆర్డర్లు పెడుతున్నాయి. కార్యకలాపాలు మొదలు పెట్టనున్న జెట్ ఎయిర్వేస్ కూడా కొత్త విమానాలను చూస్తోంది. * 2009 నుంచి ఇప్పటిదాకా భారత విమాన సంస్థల నుంచి 65 శాతం ఆర్డర్లు ఎయిర్బస్ పొందింది. దేశీయ సంస్థలు తక్కువ వెడల్పు (నారో బాడీ) విమానాల వైపు మొగ్గుచూపుతుండడం ఇందుకు కారణం.
రక్షణ రంగం విషయానికొస్తే.. 2022లో భారత మొత్తం రక్షణ వ్యయాలు 81.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా అత్యధిక రక్షణ కేటాయింపుల్లో ఇవి నాలుగో స్థానంలో ఉన్నాయి. అమెరికా, చైనా, రష్యా ఇంతకంటే ముందున్నాయి. * భారత రక్షణ వ్యయాలు గత రెండు దశాబ్దాల్లో 9 శాతం పైగా సీఏజీఆర్తో పెరుగుతూ వచ్చాయి. చైనా మిలటరీ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇవి మరింతగా వృద్ధి చెందొచ్చు. * రక్షణ సామగ్రి విషయంలో సౌదీ అరేబియా కంటే ముందు నిలిచి అతిపెద్ద దిగుమతిదారుగా భారత్ అవతరించింది. 2018-22 మధ్య అంతర్జాతీయ మిలటరీ సామగ్రి దిగుమతుల్లో 11 శాతం మనవే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప