అథెనా గ్లోబల్ టెక్నాలజీస్కు పెరిగిన నష్టాలు
హైదరాబాద్కు చెందిన అథెనా గ్లోబల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.2.07 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.3.32 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన అథెనా గ్లోబల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.2.07 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.3.32 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. మొత్తం ఆదాయంలో ఇతర ఆదాయం రూ.50 లక్షలు ఉంది. సబ్సిడరీ కంపెనీలైన మెడ్లే మెడికల్ సొల్యూషన్స్కు ఇచ్చిన అప్పు మీద రావలసి వడ్డీ రూ.27.35 లక్షలు, ట్యూటరూట్ టెక్నాలజీస్కు ఇచ్చిన అప్పు మీద వడ్డీ రూ.18.93 లక్షలు ఇతర ఆదాయంలో ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో అథెనా గ్లోబల్ మొత్తం ఆదాయం రూ.3.92 కోట్లు, నికర నష్టం రూ.65.18 లక్షలు ఉన్నాయి. దీంతో పోల్చితే ప్రస్తుతం ఆదాయం తగ్గి, నష్టాలు పెరిగిన విషయం స్పష్టమవుతుంది. గత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి మొత్తం ఆదాయం రూ.11.54 కోట్లు, నికర నష్టం రూ.8.90 కోట్లు ఉన్నాయి. కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో రూ.12.59 కోట్ల మొత్తం ఆదాయాన్ని, రూ.22.02 కోట్ల నికర నష్టాన్ని ఈ సంస్థ నమోదు చేసింది.
16 రోజుల్లోనే ఐటీ రిఫండు: సీబీడీటీ
దిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారికి సగటున 16 రోజుల్లోనే రిఫండును వెనక్కి ఇచ్చినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఛైర్మన్ నితిన్ గుప్తా అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 80 శాతానికి పైగా రిటర్నులు 30 రోజుల్లోపే అందించినట్లు వివరించారు. స్వచ్ఛందంగా పన్ను దాఖలు చేసే వారిని ప్రోత్సహించేందుకు ఐటీ విభాగం ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతికత వినియోగాన్ని పెంచుతోందని తెలిపారు. 2021-22లో సగటున 26 రోజుల్లో రిఫండు అందగా, 2022-23లో ఈ వ్యవధి 16 రోజులకు తగ్గిందని వివరించారు. రిటర్నులు దాఖలు చేసిన ఒక రోజులోనే వాటిని ప్రాసెస్ చేయడం 100% పెరిగిందన్నారు.
* నియంత్రణ నిబంధనలు సరిగా పాటించనందుకు ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)పై రూ.2.20 కోట్ల అపరాధ రుసుమును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విధించింది.
* విద్యుత్ను ఆదా చేసే ఉపకరణాలు, ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్ లైట్లు, అధిక సామర్థ్యంతో కూడిన ఫ్యాన్లను వినియోగించేలా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) విద్యుత్ ఆదా చేసే 10 మిలియన్ల ఎలక్ట్రిక్ ఫ్యాన్లను భారత్లో తీసుకురావాలని లక్ష్యంగా పని చేస్తోంది.
* సైబర్ భద్రతా రిస్కులను సమర్థంగా పరిష్కరించేందుకు అధీకృత బ్యాంకింగేతర చెల్లింపుల వ్యవస్థ ఆపరేటర్ల(పీఎస్ఓలు) కోసం పటిష్ఠమైన పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆర్బీఐ ప్రతిపాదించింది.
* లిథియం అయాన్ బ్యాటరీల కోసం గ్రాఫైట్ ఆనోడ్ మెటీరియల్ను ఫీడ్స్టాక్గా తయారు చేయడానికి పెట్ కోక్ను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంధన అవసరాల కోసం పెట్ కోక్ దిగుమతుల్ని పూర్తిగా నిషేధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు