రాణించిన లోహ, వాహన షేర్లు
లోహ, టెలికాం, వాహన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో రెండు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు కోలుకున్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు దన్నుగా నిలిచాయి.
సమీక్ష
లోహ, టెలికాం, వాహన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో రెండు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు కోలుకున్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు దన్నుగా నిలిచాయి. మేలో వాహన విక్రయాలు, జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా నమోదుకావడం సెంటిమెంట్ను బలపరిచింది. డాలర్తో పోలిస్తే రూపాయి 9 పైసలు పెరిగి 82.31 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 1.74 శాతం లాభపడి 75.57 వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 62,601.97 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ప్రారంభ ట్రేడింగ్లో 62,719.84 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. అనంతరం ఒకదశలో 62,379.86 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. మళ్లీ కోలుకుని 118.57 పాయింట్ల లాభంతో 62,547.11 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 46.35 పాయింట్లు పెరిగి 18,534.10 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,478.40- 18,573.70 పాయింట్ల మధ్య కదలాడింది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్ 45.42 పాయింట్లు, నిఫ్టీ 34.75 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
* మేలో వాహన విక్రయాలు 7 శాతం పెరగడంతో హీరో మోటోకార్ప్ షేరు 3.25 శాతం లాభంతో రూ.2,891.95 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,819.11 కోట్లు పెరిగి రూ.57,793.21 కోట్లకు చేరింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 20 మెరిశాయి. టాటా స్టీల్ 1.93%, మారుతీ 1.73%, ఎం అండ్ ఎం 1.71%, సన్ఫార్మా 1.20%, ఎల్ అండ్ టీ 1.19%, టైటన్ 1.16%, భారతీ ఎయిర్టెల్ 0.98%, ఎస్బీఐ 0.79% చొప్పున లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ 1.58% వరకు నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో లోహ 1.71%, స్థిరాస్తి 1.33%, టెలికాం 1.06%, వాహన 0.98%, పరిశ్రమలు 0.85%, వినియోగ 0.83%, కమొడిటీస్ 0.73%, ఆరోగ్య సంరక్షణ 0.72% పెరిగాయి. ఐటీ, టెక్, యుటిలిటీస్, ఇంధన, చమురు-గ్యాస్ నీరసపడ్డాయి. బీఎస్ఈలో 2181 షేర్లు లాభపడగా, 1364 స్క్రిప్లు నష్టపోయాయి.
* కోల్ ఇండియా ఓఎఫ్ఎస్కు పూర్తి స్పందన: కోల్ ఇండియాలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 3 శాతం ప్రభుత్వ వాటా విక్రయానికి రిటైల్, సంస్థాగత మదుపర్ల నుంచి పూర్తి స్పందన లభించింది. ప్రభుత్వం 18.48 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 28.76 కోట్లకు పైగా షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. గురువారం రిటైల్ మదుపర్ల నుంచి 2.58 కోట్లకు పైగా షేర్లకు బిడ్లు వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.4,000 కోట్లకు పైగా చేరే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.51,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
* ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాలకు ఇండిగో విమానాలు: ఈ ఏడాది నైరోబి, తబలిసీ, తాష్కెంట్ సహా ఆరు ఆఫ్రికా, మధ్య ఆసియా గమ్యస్థానాలకు నేరుగా విమానాలు ప్రారంభించనున్నట్లు ఇండిగో వెల్లడించింది. జులై చివర్లో లేదా ఆగస్టు ప్రారంభంలో ముంబయి నుంచి నైరోబి (కెన్యా), జకార్తా (ఇండోనేషియా)లకు విమానాలు ప్రారంభించనుంది. ఆగస్టులో దిల్లీ నుంచి తబలిసీ (జార్జియా), బాకు (అజర్బైజార్)కు, సెప్టెంబరులో తాష్కెంట్ (ఉజ్బెకిస్థాన్), అల్మాటీ (కజకిస్థాన్)లకు ఇండిగో సేవలు మొదలుపెట్టనుంది. ప్రస్తుతం 26 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ఇండిగో విమానాలు నడుపుతుండగా.. వీటితో ఈ సంఖ్య 32కు పెరగనుంది. ఆగస్టులో దిల్లీ-హాంకాంగ్ మధ్య రోజువారీ విమాన సేవలను పునరుద్ధరించనున్నట్లు కంపెనీ తెలిపింది.
* కెనరా బ్యాంక్ నేతృత్వంలోని 19 బ్యాంకుల కన్సార్షియంకు రూ.6,524 కోట్లకు పైగా నష్టం చేశారన్న ఆరోపణలపై ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ లిమిటెడ్, కంపెనీ అప్పటి డైరెక్టర్లపై సీబీఐ ఎఫ్ఐఆర్ను దాఖలు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం ఆరోపణలతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద ముంబయికి చెందిన ఐటీఎన్ఎల్, దాని డైరెక్టర్లు కరుణాకరన్ రామ్చంద్, దీపక్దాస్ గుప్తా, ముకుంద్ గజానన్ సప్రే, అప్పటి సీఎఫ్ఓ దిలీప్ లాల్చంద్ భాటియాలపై ఎఫ్ఐఆర్లో అభియోగాలు మోపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్