20% వార్షిక వృద్ధి సాధిస్తాం
మౌలిక సదుపాయాల రంగానికి చెందిన కంపెనీ అయిన ఎన్సీసీ లిమిటెడ్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో స్టాండ్ అలోన్ ఖాతాల ప్రకారం ఆదాయాల్లో 20 శాతం వృద్ధిని ఆశిస్తోంది.
ఎన్సీసీ లిమిటెడ్ అంచనా
రూ.50,000 కోట్లను మించిన ఆర్డరు పుస్తకం
తగ్గుతున్న రుణభారం
ఈనాడు, హైదరాబాద్: మౌలిక సదుపాయాల రంగానికి చెందిన కంపెనీ అయిన ఎన్సీసీ లిమిటెడ్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో స్టాండ్ అలోన్ ఖాతాల ప్రకారం ఆదాయాల్లో 20 శాతం వృద్ధిని ఆశిస్తోంది. అదే విధంగా నికరలాభం 50 బేసిస్ పాయింట్ల మేరకు పెరిగే అవకాశం ఉన్నట్లు కంపెనీ యాజమాన్యం ఇటీవల ఇన్వెస్టర్లతో నిర్వహించిన ‘కాన్ఫరెన్స్ కాల్’లో వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి అత్యధిక స్థాయిలో కొత్త ఆర్డర్లు లభించాయి. అదే స్థాయిలో ఆర్డర్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనూ లభిస్తాయని అంచనా వేస్తోంది. మరోపక్క, రుణభారాన్ని తగ్గించుకుంటున్నట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అప్పు ఇంకా తగ్గుతుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం ఎన్సీసీ లిమిటెడ్ రూ.15,701 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. వార్షిక ఈపీఎస్ రూ.9.77 నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఈపీఎస్ రూ.7.91 మాత్రమే కావటం గమనార్హం.
ఈ ఏడాదీ భారీగా కొత్త ఆర్డర్లు
ఎన్సీసీ లిమిటెడ్ ఆర్డర్ బుక్ రూ.50,000 కోట్లను మించిపోయింది. కంపెనీ చేతిలో ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి రూ.50,244 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోనే రూ.25,895 కోట్ల ఆర్డర్లు లభించటం ప్రత్యేకత. ఇదే స్థాయిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొత్త ఆర్డర్లు లభిస్తాయని ఎన్సీసీ లిమిటెడ్ యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో (ఏప్రిల్) రూ.3,000 కోట్ల ఆర్డర్లు లభించటం గమనార్హం. ఇదే కాకుండా మే నెలలో మరో రూ.2,088 కోట్ల ఆర్డర్లు లభించినట్లు సంస్థ వెల్లడించింది. ఇందులో నీటి పారుదల విభాగానికి చెందిన రూ.1,668 కోట్ల మేరకు ఆర్డర్లు ఉన్నాయి. పెద్దఎత్తున ఆర్డర్లు చేతిలో ఉన్నందున నిర్దేశించుకున్న వృద్ధి లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉన్నట్లు సంస్థ యాజమాన్యం భావిస్తోంది.
ఆదాయాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో రుణభారాన్ని తగ్గించుకోవడంపై సంస్థ దృష్టి పెట్టింది. గత ఆర్థిక సంవత్సరాంతం నాటికి నికర రుణభారం రూ.1,000 కోట్ల కంటే కిందకు దిగివచ్చింది. ప్రస్తుతం కంపెనీకి నికరంగా రూ.974 కోట్ల అప్పు మాత్రమే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకూ రుణభారం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. కొంతకాలం క్రితం విక్రయించిన సెంబ్కార్ప్, ఎన్సీసీ వైజాగ్ అర్బన్ ప్రాజెక్టుల నుంచి ఎన్సీసీ లిమిటెడ్కు ఇంకా కొంత సొమ్ము రావలసి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ సొమ్ము వస్తే, దాన్ని అప్పు తీర్చటానికి కేటాయించాలని భావిస్తున్నారు. అదే జరిగితే రుణభారం ఇంకా తగ్గిపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడి కింద రూ.275 కోట్లు కేటాయించినట్లు ఎన్సీసీ యాజమాన్యం వెల్లడించింది. నిధుల వ్యయం (ఫైనాన్స్ కాస్ట్) ఇప్పటి వరకూ ఉన్న 4.6 శాతం నుంచి 3.9 -4 శాతానికి దిగివచ్చే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రకారం చూస్తే.. నిధుల వ్యయం రూ.500 కోట్ల నుంచి రూ.520 కోట్లు ఉండవచ్చు. ‘ట్రేడ్ రిసీవబుల్స్’ రోజులు 97 రోజుల నుంచి 87 రోజులకు తగ్గినట్లు వివరించింది. దీనివల్ల నిర్వహణ మూలధనంపై ఒత్తిడి తగ్గుతుంది. వడ్డీ భారం కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్