అధిక వడ్డీ రేట్ల కాలం ముగిసిందా?
పెట్టుబడికి, వడ్డీకి హామీనిచ్చే పథకం అనగానే వెంటనే గుర్తుకొచ్చేవి ఫిక్స్డ్ డిపాజిట్లు(ఎఫ్డీ). కీలక వడ్డీ రేటు పెరుగుతూ వస్తుండటంతో ఎఫ్డీలపై వడ్డీ గరిష్ఠ స్థాయికి చేరుకుంది.
ఆర్బీఐ ఏమంటుందో?
డిపాజిటర్లలో ఆందోళన
ఈనాడు, హైదరాబాద్: పెట్టుబడికి, వడ్డీకి హామీనిచ్చే పథకం అనగానే వెంటనే గుర్తుకొచ్చేవి ఫిక్స్డ్ డిపాజిట్లు(ఎఫ్డీ). కీలక వడ్డీ రేటు పెరుగుతూ వస్తుండటంతో ఎఫ్డీలపై వడ్డీ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అంతకు క్రితం దాదాపు రెండేళ్లపాటు వడ్డీ రేట్లు 5 శాతం లోపే ఉండేవి. ఆర్బీఐ రెపో రేటును పెంచడంతో ఇప్పుడు వీటిపై అందుతున్న ప్రతిఫలం ఆకర్షణీయంగా కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా బ్యాంకులు ఈ డిపాజిట్ రేట్లపై స్తబ్దుగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అధిక వడ్డీ రేట్లకు కాలం చెల్లిందా అనే సందేహం వ్యక్తం అవుతోంది.
గత పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును స్థిరంగా ఉంచింది. ఈసారీ దీన్ని కొనసాగించడం లేదా 25 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించవచ్చనే అంచనాలున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం 5 శాతం ఉండటం, తయారీ రంగంలో కాస్త మందగమనంలాంటి కారణాలతో ఆర్బీఐ వడ్డీ రేటును పెంచేందుకు ఇష్టపడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు దేశ ఆర్థిక వృద్ధి రేటు 6.50 - 7 శాతం మధ్యలో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణం 4.50 శాతం నుంచి 4.75 శాతం లోపు ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లపై కొత్తగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని బ్యాంకింగ్ నిపుణులు పేర్కొంటున్నారు.
సాధారణంగా ఆర్బీఐ విధాన సమీక్ష నిర్ణయానికి ముందు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తుంటాయి. ఈసారి చాలా బ్యాంకులు తమ డిపాజిట్ వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గించాయి. జూన్ 1 నుంచి కొత్త రేట్లను అమల్లోకి తీసుకొచ్చాయి. యాక్సిస్ బ్యాంక్ కొన్ని వ్యవధుల డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్ల మేరకు వడ్డీని తగ్గించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏడాది వ్యవధి డిపాజిట్పై వడ్డీని 5 బేసిస్ పాయింట్లను తగ్గించింది. గత నెలలో 666 రోజుల వ్యవధి వడ్డీని 7.25 శాతం నుంచి 7.05 శాతానికి చేర్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాది నవంబరులో గరిష్ఠంగా 7.30 శాతం వడ్డీని అందిస్తుండగా, ఇప్పుడు అది 7 శాతంగానే ఉంది. సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీని ఇస్తోంది. కొన్ని బ్యాంకులు ఎంసీఎల్ఆర్ను పెంచినప్పటికీ, డిపాజిట్లపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.
రుణాలకు గిరాకీ పెరుగుతున్నా...
బ్యాంకుల్లో రుణాలకు గిరాకీ క్రమంగా పెరుగుతోంది. వివిధ రుణ ఖాతాల్లో 15 శాతానికి పైగా వృద్ధి కనిపిస్తోందని బ్యాంకింగ్ గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని తట్టుకునేందుకు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లను ఆకర్షించేలా వడ్డీ రేట్లను పెంచాలి. కానీ, డిపాజిట్లు సైతం అధికంగానే వస్తుండటంతో ఈ విషయాన్ని బ్యాంకులు అంతగా పట్టించుకోవడం లేదు. మరోవైపు రూ.2,000 నోట్ల ఉపసంహరణతో బ్యాంకుల్లో కరెంట్, పొదుపు ఖాతాల్లో డిపాజిట్లు పెరుగుతున్నాయి. వీటికి వడ్డీ టర్మ్ డిపాజిట్లతో పోలిస్తే చాలా తక్కువ. రానున్న ఒకటి రెండు త్రైమాసికాలపాటు ఈ డిపాజిట్లు రుణాల అవసరాలకు సరిపోయే అవకాశం ఉందని బ్యాంకులు భావిస్తున్నాయి. అందుకే, ఎఫ్డీలను పట్టించుకోవడం లేదనే అభిప్రాయాన్నీ బ్యాంకింగ్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత రెపో రేటు తగ్గడం ప్రారంభిస్తే.. ఎఫ్డీలపై వడ్డీ రేటూ దిగి వస్తుంది. కాబట్టి, ఇప్పుడున్న స్థాయి.. మున్ముందు ఉండకపోవచ్చని పేర్కొంటున్నారు.
డిపాజిటర్లు ఏం చేయాలంటే..
ఫిక్స్డ్ డిపాజిట్లను చేసిన వారు.. వివిధ కాల వ్యవధులకు అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల్లో డిపాజిట్లను వేసుకునే విషయాన్ని పరిశీలించాలి. కొత్తతరం స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో కొన్ని 8 శాతానికి పైగానే వడ్డీ ఇస్తున్నాయి. రూ.5 లక్షల వరకూ వీటిలోనూ డిపాజిట్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. కాబట్టి, డిపాజిట్దారులు మరికొన్నాళ్లు అధిక వడ్డీ ప్రయోజనం పొందేలా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవాలని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా