స్థిరీకరణ దిశగా సూచీలు
ఈ వారం స్టాక్మార్కెట్లు స్థిరీకరణకు గురికావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తక్కువ స్థాయిల వద్ద కొనుగోలు అవకాశం కోసం మదుపర్లు ఎదురుచూస్తున్నందున మొత్తం మీద మార్కెట్లో ధోరణి సానుకూలంగానే కనిపిస్తోంది.
ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలపై దృష్టి
రుతుపవనాల పురోగతీ కీలకమే
యంత్ర పరికరాలు, ఐటీ షేర్లకు సానుకూలతలు
విశ్లేషకుల అంచనాలు
స్టాక్ మార్కెట్ ఈ వారం
ఈ వారం స్టాక్మార్కెట్లు స్థిరీకరణకు గురికావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తక్కువ స్థాయిల వద్ద కొనుగోలు అవకాశం కోసం మదుపర్లు ఎదురుచూస్తున్నందున మొత్తం మీద మార్కెట్లో ధోరణి సానుకూలంగానే కనిపిస్తోంది. ఎంపిక చేసిన మధ్య, చిన్న స్థాయి షేర్లలో కదలికలు ఉండొచ్చని అంటున్నారు. నిఫ్టీ-50 ఈ వారం 18400-18600 మధ్య చలించొచ్చని బ్రోకరేజీల అంచనాగా ఉంది. అంతర్జాతీయంగా చూస్తే అమెరికా మే నెల ఉద్యోగ నివేదిక సోమవారం వెలువడనుంది. ఎల్నినో ప్రభావాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా.. రుతుపవనాల్లో ఏవైనా అసాధారణ పరిస్థితులు ఎదురైతే వ్యవసాయ ఆధారిత షేర్లు, ఎఫ్ఎమ్సీజీ షేర్లపై ప్రభావం పడొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఈ వారంలో రుతుపవనాలు రావొచ్చన్న అంచనాల మధ్య వ్యవసాయ ఆధారిత షేర్లపై మదుపర్లు దృష్టిసారించొచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకుల అంచనాలు..
* యంత్రపరికరాల షేర్లు సానుకూలంగా చలించొచ్చు. అయితే లార్జ్ క్యాప్ స్క్రిప్లలో కొంత దిద్దుబాటు కనిపించొచ్చు. మిడ్-క్యాప్ షేర్లు రాణించొచ్చు. వరుసగా నాలుగో నెలా ఈ రంగం బలంగా కనిపిస్తోంది. బలమైన ఆర్డర్లు, కమొడిటీ ధరలు తగ్గడం ఇందుకు నేపథ్యం.
* ఎంపిక చేసిన ఐటీ షేర్లలో చలనాలను అంచనా వేస్తున్నారు. హెచ్సీఎల్ టెక్నాలజీ, టెక్ మహీంద్రా, విప్రోలు రాణించే అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ కాస్త డీలా పడొచ్చు.
* సిమెంటు షేర్లు స్తబ్దుగా కదలాడవచ్చు. పరిశ్రమ మొత్తం మీద బలహీన ధరలు కొనసాగుతుండడం గమనార్హం. అల్ట్రాటెక్ సిమెంట్ను కొనొచ్చని, అంబుజా సిమెంట్స్ను అమ్మొచ్చని. ఏసీసీ, శ్రీ సిమెంట్ను అట్టేపెట్టుకోవచ్చని బ్రోకరేజీ ఒకటి సిఫారసు చేస్తోంది.
* వాహన షేర్లు సానుకూల ధోరణిలో చలించొచ్చు. మే నెలలో టోకు విక్రయాలకు తోడు మార్చి త్రైమాసికంలో బలమైన ఫలితాలు ఇందుకు దోహదం చేయొచ్చు. మొత్తం మీద కూడా ఈ రంగ ధోరణిపై విశ్లేషకులు సానుకూలంగానే ఉన్నారు.
* అప్స్ట్రీమ్ చమురు కంపెనీలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా షేర్లు చమురు ధరల ఆధారంగా ట్రేడవవచ్చు. ఒపెక్, అనుబంధ దేశాల సమావేశం నేపథ్యంలో చమురు ధరలు ఊగిసలాడొచ్చన్న అంచనాలున్నాయి.
* ఎంపిక చేసిన టెలికమ్యూనికేషన్ స్క్రిప్లు చలించొచ్చు. గత వారం కొత్త గరిష్ఠాలను తాకిన భారతీ ఎయిర్టెల్ ఈ వారమూ రాణించే అవకాశం ఉంది.
* బ్యాంకింగ్ షేర్లపై మదుపర్లు అప్రమత్తత కొనసాగించొచ్చు. బ్యాంక్ నిఫ్టీ 42,500- 44,500 స్థాయుల్లో కదలాడే అవకాశం ఉంది. ఆర్బీఐ వడ్డీ రేట్ల నిర్ణయం ఈ షేర్లకు దిశానిర్దేశం చేయొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ షేర్లపై బ్రోకరేజీలు సానుకూలంగా ఉన్నాయి.
* ఆకర్షణీయమైన విలువల కారణంగా ఔషధ షేర్లు లాభాలు కొనసాగించే అవకాశం ఉంది. ముడివస్తువుల ధరలు తగ్గడం, సరఫరా ఇబ్బందులు మెరుగుపడటంతో పరిశ్రమ రాణించొచ్చని అంటున్నారు. మ్యాన్కైండ్ ఫార్మా, టొరెంట్ ఫార్మా షేర్లపై విశ్లేషకులు బుల్లిష్గా ఉన్నారు.
* ఎఫ్ఎమ్సీజీ షేర్లలో లాభాల స్వీకరణ ఎదురుకావొచ్చు. ఇటీవలి కాలంలో ఈ షేర్లు భారీగా పెరగడం, రుతుపవనాలపై ఇంకా స్పష్టత రాకపోవడమే ఇందుకు కారణం. ఐటీసీ, హెచ్యూఎల్, మారికో షేర్లు సూచీని నడిపించొచ్చని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్
ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 30 శాతం మేర పెరిగింది. -
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
Swiggy: క్విక్- కామర్స్ విభాగమైన ఇన్స్టామార్ట్ను స్విగ్గీ మాల్తో అనుసంధానం చేసినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ గురువారం తెలిపింది. -
బేబీ ఫుడ్లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా
బేబీ ఫుడ్స్లో చక్కెర అధిక స్థాయిలో వినియోగిస్తున్నారంటూ వచ్చిన వార్తలపై నెస్లే ఇండియా వివరణ ఇచ్చింది. -
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో సాయంత్రానికి నష్టాల్లోకి జారుకున్నాయి. -
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
Cab Services: అదనంగా డబ్బులు వసూలు చేసినందుకుగాను ఉబర్ ఇండియాకు కన్జ్యూమర్ కమిషన్ రూ.28 వేలు జరిమానా విధించింది. -
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
మొబైల్లో వచ్చిన మెసేజ్ను హెడ్డర్ సాయంతో ఎవరు పంపారో ఇట్టే కనిపెట్టేయొచ్చు. అదెలాగంటే..? -
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
Air India Express: తొలిసారి ఓటు వేయబోయే వారిని దృష్టిలో ఉంచుకొని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. అదేంటో చూద్దాం.. -
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
Best Airports: స్కైట్రాక్స్ ఏటా ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాను విడుదల చేస్తుంటుంది. వీటిలో తొలి 20 స్థానాల్లో ఏవి నిలిచాయి? భారత్లోని ఎయిర్పోర్టుల పరిస్థితి ఏంటో చూద్దాం.. -
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
Google layoffs: గూగుల్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు జపాన్ కంపెనీ తోషిబా సైతం ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్లు లాభపడి 73,278 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 22,268 దగ్గర కొనసాగుతోంది. -
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు