63,000 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. సానుకూల ఆర్థిక గణాంకాలు, చమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు కొనసాగడం సెంటిమెంట్ను బలోపేతం చేశాయి.
సమీక్ష: సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. సానుకూల ఆర్థిక గణాంకాలు, చమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు కొనసాగడం సెంటిమెంట్ను బలోపేతం చేశాయి. దేశీయంగా చూస్తే.. 2022-23 మార్చి త్రైమాసికంలో భారత జీడీపీ 6.1 శాతం వృద్ధి చెందగా.. మొత్తం వార్షిక వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదైంది. ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.17.33 లక్షల కోట్లకు తగ్గింది. మేలో తయారీ పీఎంఐ 31 నెలల గరిష్ఠమైన 58.7 పాయింట్లుగా నమోదైంది. జీఎస్టీ వసూళ్లు 12% వృద్ధితో రూ.1.57 లక్షల కోట్లకు చేరాయి. వాహన కంపెనీలు గత నెలలో మంచి అమ్మకాలు నమోదు చేశాయి. బ్యారెల్ ముడిచమురు 1.8% తగ్గి 75.7 డాలర్ల వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి 82.71 నుంచి 82.31కు బలపడింది. అంతర్జాతీయంగా చూస్తే.. చైనా పారిశ్రామికోత్పత్తి వరుసగా రెండో నెలా తగ్గింది. అమెరికా రుణ పరిమితి పెంచే బిల్లుకు సెనేట్ ఆమోదం లభించడంతో మార్కెట్లకు ఉపశమనం లభించింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్ 0.1 శాతం లాభంతో 62,547 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 0.2% పెరిగి 18,534 పాయింట్ల దగ్గర స్థిరపడింది. రంగాల వారీ సూచీల్లో స్థిరాస్తి, మన్నికైన వినిమయ వస్తువులు, ఆరోగ్య సంరక్షణ లాభపడగా.. చమురు-గ్యాస్, విద్యుత్, బ్యాంకింగ్ నష్టపోయాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) నికరంగా రూ.6,520 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.1,043 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. మేలో విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు (ఎఫ్పీఐలు) నికరంగా రూ.43,838 కోట్ల పెట్టుబడులు పెట్టారు. గతేడాది ఆగస్టులో రూ.51,204 కోట్ల పెట్టుబడుల తర్వాత ఇదే అత్యధికం.
లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 3:2గా నమోదు కావడం..
ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్లను సూచిస్తోంది.
ఈ వారంపై అంచనా: గరిష్ఠ స్థాయుల్లో స్థిరీకరణ జరగడంతో గతవారం సెన్సెక్స్ స్తబ్దుగా ముగిసింది. సెన్సెక్స్ 61,500 పాయింట్ల ఎగువన కొనసాగినంత వరకు సానుకూల ధోరణిలోనే కదలాడొచ్చు. స్వల్పకాలంలో 63,000 పాయింట్ల పైన ముగిస్తే.. 63,600 పాయింట్ల దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని పరీక్షించొచ్చు.
ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సంకేతాల నుంచి దేశీయ సూచీలు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. 8న ఆర్బీఐ ప్రకటించనున్న ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు కీలకం కానున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. గరిష్ఠ స్థాయుల్లో లాభాల స్వీకరణతో సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చు. స్వల్పకాంలో షేరు ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించొచ్చు. దేశీయంగా చూస్తే.. మే భారత సేవల పీఎంఐ, ఏప్రిల్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదల కానున్నాయి. రుతుపవనాలకు సంబంధించిన వార్తలపై మార్కెట్లు దృష్టి పెట్టొచ్చు. వర్షాలు ఆలస్యం కావడం, ఎల్నినో వంటివి సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపొచ్చు.
అంతర్జాతీయంగా చూస్తే.. ఎస్ అండ్ పీ సేవల పీఎంఐ గణాంకాలు, ఆస్ట్రేలియా, కెనడా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల నిర్ణయాలను ప్రకటించనున్నాయి. చైనా, అమెరికా వాణిజ్య గణాంకాలపై కన్నేయొచ్చు. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్ఐఐ కొనుగోళ్ల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు. ఒపెక్+ సమావేశ నిర్ణయాలు స్వల్పకాలంలో ప్రభావం చూపనున్నాయి. ఉత్పత్తి కోతల వల్ల చమురు ధరలు పెరిగితే సెంటిమెంట్ దెబ్బతినే అవకాశం ఉంది.
తక్షణ మద్దతు స్థాయులు: 61,872, 61,484, 61,000
తక్షణ నిరోధ స్థాయులు: 63,036, 63,583, 64,200
సెన్సెక్స్ 63,000 ఎగువన జీవనకాల గరిష్ఠాలను తాకొచ్చు.
సతీశ్ కంతేటి, జెన్ మనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
విమానాల్లో తల్లిదండ్రులకు పక్కనే చిన్నారులకు సీటు కేటాయించాలని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది. -
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
Patanjali: పతంజలి ఉత్పత్తుల ప్రయోజనాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఆ కంపెనీపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని తెలపగా.. అది ఏ సైజ్లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది. -
జొమాటో ప్లాట్ఫాం ఫీజు రూ.5కు పెంపు
ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది. -
సంక్షిప్త వార్తలు(5)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్ పికప్ జోన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా