టెక్నో పెయింట్స్‌ ప్రచారకర్తగా మహేష్‌ బాబు

హైదరాబాద్‌కు చెందిన రంగుల కంపెనీ, టెక్నో పెయింట్స్‌ ప్రముఖ సినీ హీరో మహేష్‌ బాబును ప్రచారకర్తగా నియమించుకుంది.

Published : 08 Jun 2023 02:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన రంగుల కంపెనీ, టెక్నో పెయింట్స్‌ ప్రముఖ సినీ హీరో మహేష్‌ బాబును ప్రచారకర్తగా నియమించుకుంది. రెండేళ్ల పాటు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తారు. 2 దశాబ్దాలుగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న తమ సంస్థ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 1,000 కి పైగా ప్రాజెక్టులను నిర్వహించిందని టెక్నో పెయింట్స్‌ ఎండీ ఎ.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రిటైల్‌ మార్కెట్లో విస్తరించేందుకు మహేష్‌ బాబుకు ఉన్న ఆకర్షణ, బ్రాండ్‌ ఇమేజ్‌ తమకు కలిసి వస్తుందని ఆయన వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రంగుల విక్రయాలకు రూ.12,000 కోట్ల విపణి ఉందని, ఇందులో 25% వాటా సాధించాలనే లక్ష్యంతో సాగుతున్నామని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని