మెటా ‘వెరిఫైడ్’ ఖాతా సేవ జీ రూ.699
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాలను నిర్వహిస్తున్న మెటా.. మన దేశంలో తమ మొబైల్ యాప్లకు రూ.699 నెలవారీ చందాతో ‘వెరిఫైడ్’ ఖాతా సేవలను ప్రారంభించింది.
దిల్లీ: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాలను నిర్వహిస్తున్న మెటా.. మన దేశంలో తమ మొబైల్ యాప్లకు రూ.699 నెలవారీ చందాతో ‘వెరిఫైడ్’ ఖాతా సేవలను ప్రారంభించింది. వెబ్కు కూడా రూ.599 నెలవారీ చందాతో వెరిఫైడ్ సేవలను ప్రారంభించే యోచనలో మెటా ఉంది. ‘వెరిఫైడ్ సేవలను ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్లో కొనుగోలు చేయొచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్పై రూ.699 నెలవారీ చందాతో దీనిని తీసుకోవచ్చ’ని కంపెనీ తెలిపింది. వెరిఫైడ్ ఖాతా సబ్స్క్రిప్షన్ పొందాలంటే.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వినియోగదార్లు ప్రభుత్వ గుర్తింపు కార్డు ద్వారా తమ ఖాతాను ధ్రువీకరించుకోవాలి. ఈ ఖాతాలకు సైబర్ మోసగాళ్ల నుంచి భద్రత, ఖాతా సహకారం లాంటివి లభిస్తాయి. వెరిఫైడ్ ఖాతాకు అర్హత సాధించాలంటే.. ఇంతకుమునుపు చేసిన పోస్టింగ్లు సహా కనీస యాక్టివిటీ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. దరఖాస్తుదార్లకు కనీసం 18 ఏళ్ల వయస్సు ఉండాలి. ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్లో ఏ ఖాతాకైతే వెరిఫైడ్ కోసం దరఖాస్తు చేస్తున్నారో ఆ ఖాతాకు సంబంధించి పేరు, ఫొటోకు సరిపోయేలా ప్రభుత్వ గుర్తింపు పత్రాన్ని సమర్పించాలి.
బొగ్గు, లిగ్నైట్ల అన్వేషణపథకానికి రూ.2,980 కోట్లు
దిల్లీ: బొగ్గు, లిగ్నైట్ అన్వేషణ పథకాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. ఇందుకు అంచనా వ్యయం రూ.2,980 కోట్లుగా నిర్ణయించింది. ఈ పథకం కాలపరిమితిని 2021-22 నుంచి 2025-26 వరకు పొడిగించినట్లు ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గం తెలిపింది. 15వ ఆర్థిక సంఘంతో పాటు ఇది ముగిసిపోతుందని పేర్కొంది. ఈ పథకంలో భాగంగా బొగ్గు, లిగ్నైట్ అన్వేషణను రెండు దశల్లో- 1) ప్రమోషనల్ (ప్రాంతీయ) ఎక్స్ప్లోరేషన్ 2) కోల్ ఇండియాకు చెందని నిక్షేపాల్లో డీటెయిల్డ్ ఎక్స్ప్లోరేషన్- చేపడతారు. ఈ పథకానికి నిర్ణయించిన రూ.2980 కోట్ల అంచనా వ్యయంలో మొదటి దశ కోసం రూ.1,650 కోట్లు, రెండో దశ కోసం రూ.1,330 కోట్లు చొప్పున ఖర్చు పెడతారు.
హోండా బళ్లకు 10 ఏళ్ల వరకు అదనపు వారెంటీ
దిల్లీ: హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) 250 సీసీ విభాగం వరకు స్కూటర్లు, మోటర్ సైకిల్ మోడళ్లన్నింటికీ వారెంటీ పొడిగింపు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా వాహనం కొనుగోలు చేసిన తేదీ నుంచి 91 రోజులు- తొమ్మిదో సంవత్సరం వరకు అదనపు వారెంటీని వినియోగదార్లు కొనుగోలు చేసుకోవచ్చు. దీని వల్ల పూర్తి స్థాయిలో 10 ఏళ్ల వారెంటీ కవరేజీని పొందడమే కాకుండా.. వేరే వాళ్లకు వాహనాన్ని అమ్మినప్పుడు వారెంటీని బదలాయించేందుకు వీలుగా రెన్యువల్ సదుపాయమూ ఉంటుందని హెచ్ఎమ్ఎస్ఐ తెలిపింది. ‘ విక్రయానంతర సేవల్లో కొత్త ప్రమాణాలు నిర్దేశించాలన్నది మా లక్ష్యమ’ని హెచ్ఎమ్ఎస్ఐ డైరెక్టర్ (విక్రయాలు, మార్కెటింగ్) యోగేశ్ మాథుర్ తెలిపారు. అధిక విలువ ఉండే విడి భాగాలనూ కలుపుతూ 10 ఏళ్ల వరకు అదనపు వారెంటీ సదుపాయాన్ని అందించడం పరిశ్రమలో ఇదే మొదటి సారి అని పేర్కొన్నారు.
* వాహనం ఏడో సంవత్సరంలో 3 ఏళ్లకు; 8వ సంవత్సరంలో రెండేళ్లకు; తొమ్మిదో సంవత్సరంలో 1 ఏడాదికి- అదనపు వారెంటీని ఎంచుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇందువల్ల స్కూటర్లకు 1.2 లక్షల కి.మీటర్ల వరకు, మోటర్ సైకిళ్లకు 1.3 లక్షల కి.మీటర్ల వరకు వారెంటీ కవరేజీ లభిస్తుందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!