సంక్షిప్త వార్తలు
టెక్నాలజీ రంగంలో స్వీయ నియంత్రణ ముఖ్యమని.. కృత్రిమ మేధ పరిజ్ఞానం కారణంగా కంపెనీల చేతిలోకి ప్రపంచం వెళ్లకూడదని చాట్జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ అభిప్రాయపడ్డారు.
కంపెనీల చేతిలోకి ప్రపంచం వెళ్లకూడదు
ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్
దిల్లీ: టెక్నాలజీ రంగంలో స్వీయ నియంత్రణ ముఖ్యమని.. కృత్రిమ మేధ పరిజ్ఞానం కారణంగా కంపెనీల చేతిలోకి ప్రపంచం వెళ్లకూడదని చాట్జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ అభిప్రాయపడ్డారు. గురువారం ఉదయం ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత్లో కృత్రిమ మేధను అందిపుచ్చుకోవడం, నియంత్రణపరమైన అవసరాలపై చర్చించామని ఆల్ట్మన్ వెల్లడించారు. ఓపెన్ఏఐ సంస్థకు స్వీయ నియంత్రణ ఉందని, చాట్జీపీటీ సురక్షితమని చెప్పడానికి దాదాపు 8 నెలలు వెచ్చించామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆన్లైన్లో సమాచారం వెతకడం నుంచి, చాట్జీపీటీ వినియోగించడానికి మొగ్గుచూపుతున్నారని తెలిపారు. పాఠ్యాంశాలు, టెక్నాలజీ అభివృద్ధి, సాఫ్ట్వేర్ కోడ్ రాయడం వంటివాటికి చాట్జీపీటీని వినియోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
జెన్ టెక్నాలజీస్కు రూ.202 కోట్ల ఆర్డర్
ఈనాడు, హైదరాబాద్: రక్షణ ఉత్పత్తుల రంగానికి చెందిన హైదరాబాద్ కంపెనీ, జెన్ టెక్నాలజీస్కు కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్తగా రూ.202 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది. వచ్చే త్రైమాసికంలో మరికొన్ని ఆర్డర్లు లభించే అవకాశం ఉన్నట్లు జెన్ టెక్నాలజీస్ వెల్లడించింది. 3 దశాబ్దాలుగా మిలటరీ శిక్షణ ఉత్పత్తులు అందిస్తున్న ఈ సంస్థ కొత్తగా డ్రోన్ల విభాగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికి పైగా ‘ట్రైనింగ్ సిస్టమ్స్’ సరఫరా చేసిన ఘనత ఈ సంస్థకు ఉంది. తన ఉత్పత్తులకు సంబంధించి దాదాపు 110 పేటెంట్ల దరఖాస్తులను జెన్ టెక్నాలజీస్ దాఖలు చేసింది.
సీసీఎల్ ప్రోడక్ట్స్ 6 కాఫీ బ్రాండ్ల కొనుగోలు
ఈనాడు, హైదరాబాద్: ఇన్స్టెంట్ కాఫీ పొడిని ఉత్పత్తి చేసే సంస్థ అయిన సీసీఎల్ ప్రోడక్ట్స్ (ఇండియా) లిమిటెడ్, స్వీడన్ కేంద్రంగా పనిచేసే కాఫీ రోస్టర్స్ లాఫ్బర్గ్స్ గ్రూపు నుంచి 6 కాఫీ బ్రాండ్లు కొనుగోలు చేసింది. దీని కోసం 5.50 లక్షల పౌండ్లు (సుమారు రూ.5.68 కోట్లు) చెల్లించింది. ఈ ఆరు కాఫీ బ్రాండ్లలో- పెర్కోల్, రాకెట్ ఫ్యూయల్, ప్లాంటేషన్ వార్ఫ్, ది లండన్ బ్లెండ్, పెర్క్ అప్, పర్కోల్ ఫ్యూజన్ ఉన్నాయి. వీటిని సొంతం చేసుకోవటం వల్ల యూకేలోని కొన్ని ప్రముఖ సూపర్మార్కెట్లకు ఇన్స్టెంట్ కాఫీ అందించే అవకాశం లభిస్తుందని సీసీఎల్ ప్రోడక్ట్స్ పేర్కొంది. ఐరోపాలో పెర్కోల్ బ్రాండు పేరుతో ఇన్స్టెంట్ కాఫీ, రోస్ట్, గ్రౌండ్ కాఫీ, కాఫీ బ్యాగ్లు లభిస్తున్నాయి. ఈ బ్రాండ్లలో కొన్నింటికి సీసీఎల్ ప్రోడక్ట్స్ కొంతకాలంగా ఇన్స్టెంట్ కాఫీ సరఫరా చేస్తోంది.
ఇళ్ల అమ్మకాలు బాగుంటాయ్: క్రెడాయ్
కీలక రేట్లలో ఎటువంటి మార్పు చేయకపోవడంతో నెలవారీ కిస్తీ పెరగదు కాబట్టి ఇళ్ల అమ్మకాల్లో వృద్ధి కొనసాగుతుందని క్రెడాయ్ అంచనా వేస్తోంది. ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠ స్థాయిలో ఉన్నందున, వచ్చే సమావేశంలో రేట్ల కోతను ఆశిస్తున్నట్లు పేర్కొంది.
ఔషధ ఉత్పత్తుల ఎగుమతులు-దిగుమతులకు అదనపు వివరాలివ్వాలి
దిల్లీ: జులై 1 నుంచి ఔషధ ఉత్పత్తుల ఎగుమతులు-దిగుమతులకు అదనపు వివరాల ఇచ్చే ప్రక్రియను కస్టమ్స్ విభాగం తీసుకొచ్చింది. త్వరితగతిన షిప్మెంట్లకు అనుమతులు ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఔషధ ప్లాంట్లు, రసాయనాల వాణిజ్యం చేసే ఎక్సిమ్ వ్యాపారులు తరచుగా అడిగే ప్రశ్నలు ఈ అదనపు వివరాల వల్ల తగ్గనున్నాయి. ఔషధ ప్లాంట్లు, ప్లాంట్ భాగాల పేర్లను తప్పనిసరి చేయాలని నిర్ణయించామని, ఆయుష్ మంత్రిత్వ శాఖ, డీజీఎఫ్టీతో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఐసీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
Best Airports: స్కైట్రాక్స్ ఏటా ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాను విడుదల చేస్తుంటుంది. వీటిలో తొలి 20 స్థానాల్లో ఏవి నిలిచాయి? భారత్లోని ఎయిర్పోర్టుల పరిస్థితి ఏంటో చూద్దాం.. -
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
Google layoffs: గూగుల్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు జపాన్ కంపెనీ తోషిబా సైతం ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్లు లాభపడి 73,278 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 22,268 దగ్గర కొనసాగుతోంది. -
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు