43 నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయ్: ఎన్హెచ్బీ
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (జనవరి- మార్చి) దేశంలోని 43 నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.
దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (జనవరి- మార్చి) దేశంలోని 43 నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. మరో 7 నగరాల్లో తగ్గాయని పేర్కొంది. గృహ రుణ రేట్లు ఇప్పటికీ కొవిడ్-19 ముందు స్థాయి కంటే తక్కువగానే ఉన్నాయని పేర్కొంది. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో స్థిరాస్తి ధరలు పెరిగాయని నివేదిక తెలిపింది. అహ్మదాబాద్లో 10.8%, బెంగళూరులో 9.4%, చెన్నైలో 6.8%, దిల్లీలో 1.7%, హైదరాబాద్లో 7.9 శాతం, కోల్కతాలో 11%, ముంబయిలో 3.1 శాతం, పుణెలో 8.2 శాతం మేర స్థిరాస్తి ధరల్లో పెరుగుదల నమోదైందని ఎన్హెచ్బీ ప్రకటించే హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ (హెచ్పీఐ) ఆధారంగా తెలుస్తోంది. 50 నగరాలకు సంబంధించి స్థిరాస్తి ధరల విలువ పెరుగుదల వివరాలను ఈ సూచీ తెలియజేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్లో ప్రభాస్తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)