వర్చుస్‌, తైగున్‌లో కొత్త వేరియంట్లు

ఫోక్స్‌వ్యాగన్‌ ప్యాసింజర్‌ కార్స్‌ ఇండియా తమ మధ్య స్థాయి సెడాన్‌ వర్చుస్‌, స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) తైగున్‌లో కొత్త రకాలను (ట్రిమ్‌) విడుదల చేసినట్లు గురువారం వెల్లడించింది.

Published : 09 Jun 2023 02:18 IST

దిల్లీ: ఫోక్స్‌వ్యాగన్‌ ప్యాసింజర్‌ కార్స్‌ ఇండియా తమ మధ్య స్థాయి సెడాన్‌ వర్చుస్‌, స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) తైగున్‌లో కొత్త రకాలను (ట్రిమ్‌) విడుదల చేసినట్లు గురువారం వెల్లడించింది. వర్చుస్‌ కొత్త కారును 6-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో జీటీ ప్లస్‌ వేరియంట్‌లో పరిచయం చేసింది. దీని ధర రూ.16.89 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). తైగున్‌లో జీటీ డీఎస్‌జీ, జీటీ ప్లస్‌ వేరియంట్లను తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.16.79 లక్షలు, రూ.17.79 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని