4 రోజుల లాభాల జోరుకు విరామం
సూచీల 4 రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యథాతథంగా కొనసాగించిన నేపథ్యంలో వాహన, బ్యాంకింగ్, ఐటీ షేర్లకు లాభాల స్వీకరణ ఎదురైంది.
సమీక్ష
సూచీల 4 రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యథాతథంగా కొనసాగించిన నేపథ్యంలో వాహన, బ్యాంకింగ్, ఐటీ షేర్లకు లాభాల స్వీకరణ ఎదురైంది. డాలర్తో పోలిస్తే రూపాయి 1 పైసా లాభపడి 82.51 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.31% నష్టపోయి 76.71 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో నష్టపోగా, షాంఘై, హాంకాంగ్ లాభపడ్డాయి. ఐరోపా సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 63,140.17 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్లో 63,321.40 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 62,789.73 వద్ద కనిష్ఠాన్ని తాకి, చివరకు 294.32 పాయింట్ల నష్టంతో 62,848.64 వద్ద ముగిసింది. నిఫ్టీ 91.85 పాయింట్లు కోల్పోయి 18,634.55 దగ్గర స్థిరపడింది.
* ఆర్బీఐ కీలక రేట్లలో మార్పు చేయనందున, స్థిరాస్తి, బ్యాంకింగ్, వాహన షేర్లు నష్టపోయాయి. స్థిరాస్తి షేర్లలో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ 3.12%, మ్యాక్రోటెక్ డెవలపర్స్ 2.73%, డీఎల్ఎఫ్ 2.28%, శోభా 2.11%, ఒబెరాయ్ రియాల్టీ 1.43%, గోద్రేజ్ ప్రోపర్టీస్ 1.40%, ఐబీ రియల్ ఎస్టేట్ 1.36% చొప్పున నష్టపోయాయి. వాహన షేర్లలో కమిన్స్ 1.87%, మహీంద్రా అండ్ మహీంద్రా 1.79%, ఐషర్ మోటార్స్ 1.75%, టీవీఎస్ 1.70%, బాష్ 1%, మారుతీ 0.69% డీలాపడ్డాయి. బ్యాంకింగ్ షేర్లలో బంధన్ బ్యాంక్ 1.72%, ఏయూ స్మాల్ బ్యాంక్ 1%, ఇండస్ఇండ్ బ్యాంక్ 0.59%, ఐసీఐసీఐ బ్యాంక్ 0.28% నీరసించాయి.
* సెన్సెక్స్ 30 షేర్లలో 24 నష్టపోయాయి. కోటక్ బ్యాంక్ 2.68%, సన్ఫార్మా 2.68%, టెక్ మహీంద్రా 2.21%, ఎం అండ్ ఎం 1.79%, టాటా మోటార్స్ 1.46%, యాక్సిస్ బ్యాంక్ 1.43%, హెచ్యూఎల్ 1.30%, టీసీఎస్ 1.17%, బజాజ్ ఫైనాన్స్ 1.03% చొప్పున డీలాపడ్డాయి. ఎన్టీపీసీ 2.62%, ఎల్ అండ్ టీ 1.09%, పవర్గ్రిడ్ 0.98% మాత్రం లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో స్థిరాస్తి 1.51%, టెలికాం 1.06%, వాహన 0.97%, ఐటీ 0.88%, ఎఫ్ఎమ్సీజీ 0.81%, బ్యాంకింగ్ 0.80% మేర పడ్డాయి. పరిశ్రమలు, యుటిలిటీస్, యంత్ర పరికరాలు, విద్యుత్ రాణించాయి.
* వ్యర్థాల నిర్వహణ సేవలు అందించే అర్బన్ ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈ నెల 12న ప్రారంభమై 14న ముగియనుంది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.11.42 కోట్లు సమీకరించనుంది. ఐపీఓ అనంతరం కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫామ్పై నమోదుకానున్నాయి.
* ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియెంట్ తయారీ సంస్థ వ్యాలియంట్ లేబొరేటరీస్ సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.15 కోట్ల తాజా షేర్లు విక్రయించనుంది. ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో ఎటువంటి షేర్లనూ విక్రయించడం లేదు.
* షేర్ల విభజన ప్రతిపాదనను పరిశీలించేందుకు ఈ నెల 27న బోర్డు సమావేశం కానున్నట్లు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది.
* ఐకియో లైటింగ్ ఐపీఓ చివరి రోజున 66.29 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 1,52,24,074 షేర్లను ఆఫర్ చేయగా.. 1,00,92,76,892 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీల నుంచి 163.58 రెట్లు, ఎన్ఐఐ విభాగంలో 63.35 రెట్లు, రిటైల్ మదుపర్ల నుంచి 13.86 రెట్ల స్పందన కనిపించింది.
* హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ ఐపీఓ ఈ నెల 20న ప్రారంభమై 23న ముగియనుంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిగా రూ.555- 585ను నిర్ణయించారు. యాంకర్ మదుపర్లు 19వ తేదీన బిడ్లు దాఖలు చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
Gold price: బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా గిరాకీ తగ్గడంతో అంతర్జాతీయంగా వీటి ధరలు దిగివచ్చాయి. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
రాబోయే 3-4 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో భారీ పెట్టుబడులు
రాబోయే 3-4 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ.. వాటి విడిభాగాల ఉత్పత్తి నిమిత్తం రూ.25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ICRA తెలిపింది. -
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
OTP frauds: ఓటీపీ స్కామ్లకు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అందులోభాగంగానే టెలికాం, ఎస్బీఐ కార్డ్స్తో కలిసి పనిచేస్తోంది. -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 89 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
విమానాల్లో తల్లిదండ్రులకు పక్కనే చిన్నారులకు సీటు కేటాయించాలని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది. -
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
Patanjali: పతంజలి ఉత్పత్తుల ప్రయోజనాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఆ కంపెనీపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని తెలపగా.. అది ఏ సైజ్లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ