వడ్డీ రేట్లలో ఈసారీ మార్పులేదు
మూడేళ్ల పాటు అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నా, భారత్లో మాత్రం వృద్ధి పుంజుకుంది. ధరలు కూడా అదుపులోకి వస్తున్నాయి. అయినా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని గరిష్ఠ లక్ష్యమైన 4 శాతం లోపునకు పరిమితం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.
ద్రవ్యోల్బణంపై ఆధారపడే భవిష్యత్తు నిర్ణయాలు
రూ.1.8 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు వెనక్కి వచ్చాయ్
‘సెటిల్మెంట్ల’కు సహకార బ్యాంకులకూ అనుమతి
‘మోసపూరిత ఖాతా’లపై సవరించిన మార్గదర్శకాలు త్వరలో
విదేశాల్లో వాడుకోవడానికి వీలుగా రుపే కార్డులు
ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష
మూడేళ్ల పాటు అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నా, భారత్లో మాత్రం వృద్ధి పుంజుకుంది. ధరలు కూడా అదుపులోకి వస్తున్నాయి. అయినా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని గరిష్ఠ లక్ష్యమైన 4 శాతం లోపునకు పరిమితం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ధరలతో పాటు ఆర్థిక స్థిరత్వానికి ఎదురయ్యే సవాళ్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ నిరంతరం అప్రమత్తంగా ఉంటుంది. 2022 ఏప్రిల్ నుంచి రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల మేర పెంచిన ప్రభావం రాబోయే నెలల్లో కనిపిస్తుంది.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ముంబయి: వరుసగా రెండో ద్రవ్య, పరపతి విధాన సమీక్షలోనూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. దీనితో పాటు పలు నిర్ణయాలు తీసుకుంది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు మాత్రమే పరిమితమైన రుణాల రైటాఫ్ (సాంకేతిక రద్దు)నకు సహకార బ్యాంకులకూ అనుమతినిచ్చింది. విదేశాల్లో వాడుకునేందుకు వీలుగా రుపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులను జారీ చేయడానికి బ్యాంకులను అనుమతిస్తోంది. మోసపూరిత ఖాతా వర్గీకరణకు త్వరలో సవరించిన మార్గదర్శకాలను జారీ చేస్తామని ప్రకటించింది.
* వృద్ధికి సహకరిస్తూనే.. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ప్రాధాన్యమిస్తున్నట్లు ఆర్బీఐ తన తాజా పరపతి విధాన సమీక్షలో సంకేతాలిచ్చింది. కమొడిటీ ధరలు అదుపులోకి వస్తున్నందున, అంతర్జాతీయంగా పలు కేంద్ర బ్యాంకులు రేట్ల పెంపును నిలిపివేశాయి. ఆస్ట్రేలియా, కెనడా మాత్రం రేట్లను మళ్లీ పెంచుతున్నాయి. మన కేంద్రబ్యాంక్ మాత్రం ‘ధరలు మరీ గణనీయంగా పెరగకపోతే ఎక్కువ కాలం పాటు రేట్లను యథాతథంగా కొనసాగిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది (2023)లో వడ్డీరేట్ల తగ్గింపూ ఉండదనే భావనను వ్యక్తం చేస్తున్నారు.
* కీలక రెపో (బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ) రేటును మార్పు లేకుండా 6.5 శాతం వద్దే ఉంచడానికి 3 రోజుల పాటు జరిపిన సమీక్ష అనంతరం, పరపతి విధాన కమిటీ(ఎమ్పీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. జూన్లో రోజు వారీగా సగటున రూ.2.3 లక్షల కోట్ల మేర ద్రవ్యలభ్యత కనిపించడంతో.. గతేడాది ఏప్రిల్లో మొదలుపెట్టిన ‘సర్దుబాటు ధోరణిని వెనక్కి తీసుకునే’ ధోరణిని కొనసాగించడానికి 5-1 తేడాతో సభ్యుల ఆమోదం లభించింది. ప్రభుత్వ వ్యయాలు పెరగడం, చెలామణీలో కరెన్సీ తగ్గడం ద్రవ్యలభ్యత పెరగడానికి కారణమయ్యాయి.
ద్రవ్యోల్బణం, వృద్ధిపై అంచనాలు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనా 6.5 శాతంలో మార్పు చేయలేదు. (వరుస నాలుగు త్రైమాసికాల్లో 8%, 6.6%. 6%, 5.7 శాతం చొప్పున వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేసింది) గతేడాది 7.2% వృద్ధిరేటుతో, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించిన పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మనదేశం నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాను 5.2% నుంచి 5.1 శాతానికి ఆర్బీఐ తగ్గించింది. అంటే వచ్చే మార్చి వరకు ద్రవ్యోల్బణం 4 శాతం ఎగువనే కొనసాగుతుందని అంచనా వేసింది.
విధాన చర్యలన్నీ.. దానిపైనే..
ద్రవ్యోల్బణం ఆధారంగానే భవిష్యత్తు విధాన చర్యలుంటాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం తగ్గడమే కీలకమని అన్నారు. రుతుపవనాల పురోగతి, ఎల్నినో ప్రభావాన్ని గమనించాల్సి ఉందని పేర్కొన్నారు.
రూ.2,000 నోట్లు సగం మేర తిరిగొచ్చాయ్
చెలామణీలో ఉన్న రూ.2,000 నోట్లలో సగం వరకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేశాయని దాస్ తెలిపారు. మార్చి ఆఖరుకు రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చెలామణిలో ఉండగా.. వీటిని ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ మే 19న ప్రకటించింది. తదుపరి ఇప్పటివరకు రూ.1.8 లక్షల కోట్ల విలువైన నోట్లు వెనక్కి వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. రూ.500 నోట్లను ఉపసంహరించి, మళ్లీ రూ.1000 నోట్లు తెస్తారనే ఊహాగానాల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
తదుపరి పరపతి విధాన కమిటీ (ఎమ్పీసీ) సమావేశం
ఆగస్టు 8-10 తేదీల్లో
రుపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులొస్తున్నాయ్
విదేశాల్లోని ఏటీఎంలు, పీఓఎస్ మెషీన్లతో పాటు ఆన్లైన్ చెల్లింపులు జరుపుకునేందుకు వీలుగా రుపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులను జారీ చేయడానికి బ్యాంకులకు ఆర్బీఐ అనుమతులు ఇచ్చింది. రుపే డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డులను విదేశాల్లో జారీ చేయడానికీ అనుమతించనున్నారు. భారత్తో పాటు అంతర్జాతీయంగా వీటిని వినియోగించుకోవచ్చు.
* ఇ-రుపీ డిజిటల్ ఓచర్లను ఇకపై నాన్-బ్యాంక్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్(పీపీఐ) జారీదార్లు కూడా జారీ చేయొచ్చు. వ్యక్తుల తరఫున ఇ-ఓచర్లను జారీ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. రూ.10,000 పరిమితితో నిర్దిష్ట వ్యక్తి, నిర్దిష్ట అవసరానికి ఒకసారి వాడుకునేందుకు ఇ-ఓచర్లు ఉపయోగపడతాయి.
మోసగాడు ఎవరంటే..
ఎవరైనా ఒక ఎగవేతదారును ‘మోసగాడు’గా వర్గీకరించే ముందు సహజసిద్ధమైన న్యాయాన్ని పాటించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. త్వరలోనే మోసపూరిత ఖాతాల వర్గీకరణకు సవరించిన మార్గదర్శకాలను ఆర్బీఐ జారీ చేయనుంది.
డిజిటల్ రూపాయికి క్యూ ఆర్ కోడ్
యూపీఐతో పరస్పరం పనిచేసేలా కేంద్ర బ్యాంకు తన డిజిటల్ కరెన్సీ (సీడీడీసీ)కి క్యూఆర్ కోడ్లను తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. సీబీడీసీకి ఈ నెలాఖరుకల్లా 10 లక్షల మంది యాక్టివ్ వినియోగదార్లను సంపాదించాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది.
* సామాజిక మాధ్యమాల్లో ఇన్ఫ్లూయెన్సర్లపై నియంత్రణ చేపట్టేందుకు విడిగా ఎటువంటి నిబంధనలనూ జారీ చేయాలని భావించడం లేదని ఆర్బీఐ తెలిపింది. ఇప్పటికే ఆర్థిక మార్కెట్లపై వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకునేవారిపై సెబీ దృష్టి సారించినట్లు గుర్తు చేసింది.
సహకార బ్యాంకులూ రైటాఫ్ చేయొచ్చు
రుణ ఎగవేతదార్లతో సెటిల్మెంట్తో పాటు సాంకేతికంగా రద్దు (రైటాఫ్) చేయడానికి సైతం సహకార బ్యాంకులకు త్వరలోనే అనుమతులు రానున్నాయి. ఒత్తిడిలో ఉన్న ఆస్తుల పరిష్కార ప్రణాళికను మరింత విస్తృతం చేయాలని ఆర్బీఐ నిర్ణయించడం ఇందుకు నేపథ్యం. ఇప్పటి దాకా ఈ అధికారం షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ఎంపిక చేసిన బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ (ఎన్బీఎఫ్సీ)లకే ఉండేది. ఈ అంశంపై త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
Cab Services: అదనంగా డబ్బులు వసూలు చేసినందుకుగాను ఉబర్ ఇండియాకు కన్జ్యూమర్ కమిషన్ రూ.28 వేలు జరిమానా విధించింది. -
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
మొబైల్లో వచ్చిన మెసేజ్ను హెడ్డర్ సాయంతో ఎవరు పంపారో ఇట్టే కనిపెట్టేయొచ్చు. అదెలాగంటే..? -
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
Air India Express: తొలిసారి ఓటు వేయబోయే వారిని దృష్టిలో ఉంచుకొని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. అదేంటో చూద్దాం.. -
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
Best Airports: స్కైట్రాక్స్ ఏటా ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాను విడుదల చేస్తుంటుంది. వీటిలో తొలి 20 స్థానాల్లో ఏవి నిలిచాయి? భారత్లోని ఎయిర్పోర్టుల పరిస్థితి ఏంటో చూద్దాం.. -
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
Google layoffs: గూగుల్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు జపాన్ కంపెనీ తోషిబా సైతం ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్లు లాభపడి 73,278 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 22,268 దగ్గర కొనసాగుతోంది. -
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
తాజా వార్తలు (Latest News)
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం