కోనసీమ పవర్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్కు
ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంకరప్ట్సీ కోడ్- 2016 అమలు తీరుతెన్నులను పర్యవేక్షించే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంకరప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది.
రూ.2 లక్షల జరిమానా ఐబీబీఐ నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంకరప్ట్సీ కోడ్- 2016 అమలు తీరుతెన్నులను పర్యవేక్షించే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంకరప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. ఒక కంపెనీకి సంబంధించిన లిక్విడేషన్ ప్రక్రియలో ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్(ఐపీ) నిబంధనలకు విరుద్ధంగా ఆస్తులను విక్రయించారనే ఆరోపణలపై విచారణ నిర్వహించింది. ఐఆర్పీ తప్పుచేసినట్లు నిర్ధారణ కావటంతో ఆయనకు రూ.2 లక్షల పెనాల్టీ విధించటంతో పాటు ఎక్కడైనా 4 నెలల పాటు ప్రొబేషనర్గా పనిచేసి చట్టంపై అవగాహన పెంచుకొనిరావాలని ఆదేశించింది.
ఇదీ జరిగింది..: కోనసీమ గ్యాస్ పవర్ లిమిటెడ్పై దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టేందుకు ఎన్సీఎల్టీ 2018లో ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఈ కంపెనీని పునరుద్ధరించటానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో ‘లిక్విడేషన్’ ప్రక్రియ మొదలు పెట్టారు. కానీ ఈ ప్రక్రియ తీరుతెన్నులపై ఆరోపణలు రావటంతో ఐబీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో కొన్ని లొసుగులు బయటకు వచ్చాయి. లిక్విడేషన్ ప్రక్రియను ఎదుర్కొంటున్న కంపెనీ ఆస్తులను వేలం ద్వారానే విక్రయించాలి. ప్రైవేటుగా విక్రయించరాదు. ఒకవేళ ప్రైవేటుగా విక్రయించదలచినా, అందుకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలను ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ తప్పనిసరిగా పాటించాలి. వీటిని ఉల్లంఘిస్తూ, కోనసీమ గ్యాస్ పవర్కు చెందిన కార్బన్ క్రెడిట్లను, ఈకేఐ ఎనర్జీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు రూ.48.84 లక్షలకు ప్రైవేటుగా విక్రయించారు. అంతేగాక కోనసీమ గ్యాస్ పవర్ ఆస్తులకు విలువ కట్టే సమయంలో ఈ కార్బన్ క్రెడిట్లకు పరిగణనలోకి తీసుకోలేదు. దీనికి బాధ్యుడైన ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ సాయి రమేష్ కానుపర్తిని ఐబీబీఐ వివరణ కోరింది. దానికి ఆయన, సంస్థ ఆస్తులను ప్రైవేటుగా విక్రయించరాదనే విషయం తనకు తెలియదని బదులిచ్చారు. దీంతో ఆయన తప్పుచేసినట్లుగా ఐబీబీఐ నిర్ధారించి రూ.2 లక్షల పెనాల్టీ విధించింది. ఈ పెనాల్టీని 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)