వాట్సాప్ చాట్లోనే నేరుగా చెల్లింపులు
సంక్షిప్త సందేశం(మెసేజ్) పంపినంత సులువుగా చెల్లింపులు చేసేలా భారత్లో తమ చెల్లింపుల సేవలను విస్తరిస్తున్నట్లు బుధవారం మెటా నేతృత్వంలోని వాట్సాప్ ప్రకటించింది.
బ్యాంకు ఖాతా తెరిచేందుకు, ఆహార పదార్థాల ఆర్డరుకూ వీలు
ముంబయి: సంక్షిప్త సందేశం(మెసేజ్) పంపినంత సులువుగా చెల్లింపులు చేసేలా భారత్లో తమ చెల్లింపుల సేవలను విస్తరిస్తున్నట్లు బుధవారం మెటా నేతృత్వంలోని వాట్సాప్ ప్రకటించింది. భారత్లో వేగంగా విస్తరిస్తున్న వాణిజ్య విపణిలో వ్యాపార సంస్థలకు మరింత ఊతమివ్వడంలో భాగంగా వాట్సాప్ ఫ్లోస్, మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్ లాంటి సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. మెసేజింగ్ ద్వారా ప్రజలు, వ్యాపార సంస్థల మధ్య అనుసంధానంలో ప్రపంచంలోనే భారత్ ముందు వరుసలో నిలిచిందని ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ మెటా వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తెలిపారు.
పోటీ యాప్ల్లోనూ..
‘వాట్సాప్ బిజినెస్ ప్లాట్ఫామ్ ద్వారా భారత్లోని వ్యాపారులందరికీ మా చెల్లింపు సేవలను విస్తరిస్తున్నాం. వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులను కార్ట్లో చేర్చుకొని, వాటికి వాట్సాప్ లేదా ఇతర చెల్లింపు పద్ధతుల్లో(యూపీఐ యాప్లు, డెబిట్, క్రెడిట్ కార్డులు) చెల్లింపులు చేయొచ్చు. ఇందుకోసం వేరే వెబ్సైట్లకు లేదా ఇతర యాప్ల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉండద’ని కంపెనీ చెబుతోంది. వాట్సాప్కు పోటీ చెల్లింపు సేవల యాప్లైన ఫోన్పే, గూగుల్పే లాంటి వాటితో కూడా ఆ యాప్ల్లోకి వెళ్లకుండానే నేరుగా చెల్లింపులు చేయొచ్చన్నమాట. మెసేజ్ పంపినంత సులభంగా చెల్లింపులు చేసేందుకు రేజర్పే, పేయూతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకునే పనిలో ఉన్నట్లు వాట్సాప్ తెలిపింది.
త్వరలో వీళ్లకూ ‘మెటా వెరిఫైడ్’
వ్యాపార సంస్థల కోసం తీసుకొచ్చిన వాట్సాప్ ఫ్లోస్ సదుపాయం ద్వారా రిజర్వేషన్ బుకింగ్, ఆహార పదార్థాలకు ఆర్డరు ఇవ్వడం, ఫ్లైట్ చెకింగ్, బ్యాంకు ఖాతా తెరవడం లాంటి వాటిని వినియోగదార్లు వాట్సాప్లో చాట్ థ్రెడ్ ద్వారానే చేయొచ్చు. ఛాట్ థ్రెడ్లో నుంచి బయటకు వెళ్లకుండానే వీటన్నింటినీ పూర్తి చేయొచ్చు. అలాగే.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లోని వ్యాపార సంస్థలకు మెటా వెరిఫైడ్ను విస్తరించనున్నారు. దీని ప్రకారం వ్యాపారులు చందా రుసుము చెల్లించి వెరిఫైడ్ బ్యాడ్జ్ను, ఖాతా సహకారం, భద్రత, ప్రీమియం ఫీచర్లను పొందొచ్చు. రానున్న వారాల్లో ఎంపిక చేసిన దేశాల్లోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లోని వ్యాపార సంస్థలకు దీనిని అందుబాటులోకి తేనున్నారు. ఆ తర్వాత వాట్సాప్కూ ఈ సేవలను విస్తరించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
QR code scams: క్యూఆర్ కోడ్ స్కామ్లతో జాగ్రత్త!
QR code scams: తరచూ క్యూఆర్కోడ్ స్కాన్ చేసి లావాదేవీలు జరుపుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి. -
5G services: 738 జిల్లాల్లో.. 10 కోట్ల మంది వినియోగదారులు
దేశవ్యాప్తంగా 738 జిల్లాల్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిందని.. సుమారు 10కోట్ల మంది వీటి సేవలను వినియోగించుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. -
UCO bank: వేలాది ఖాతాలు అప్పుడే ఎలా తెరుచుకున్నాయ్?
UCO bank Funds: యూకో బ్యాంక్ ఖాతాదారుల ఖాతాల్లోకి పొరపాటున కోట్లాది రూపాయల నగదు జమ అయిన వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నగదు లావాదేవీలు జరిగిన తేదీల్లో తెరుచుకున్న ఖాతాలపై ఇప్పుడు సీబీఐ దృష్టి సారించింది. -
Apple: యూఎస్బీ-సి టైప్ నుంచి మినహాయింపు కోరిన యాపిల్
యూఎస్బీ-సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యాపిల్ సంస్థ కేంద్రాన్ని కోరింది. -
గోఫస్ట్ కథ కంచికేనా?
దేశీయ విమానయాన కంపెనీల్లో మరో సంస్థ కథ కంచికి చేరినట్లే!.. ఈ ఏడాది మే 2న విమాన సర్వీసులు నిలిపేసి.. స్వచ్ఛందంగా దివాలా ప్రకటించిన గోఫస్ట్.. ఇక ఎగరకపోవచ్చు. -
ఏఎల్ఎస్ వ్యాధికి నూతన ఔషధం
నరాల వ్యాధులకు సంబంధించిన ఒక బయోలాజికల్ మిశ్రమ ఔషధాన్ని వాణిజ్య ప్రాతిపదికన అభివృద్ధి చేసి వివిధ దేశాల్లో విక్రయించడానికి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, అమెరికాలోని టెక్సాస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కోయ థెరప్యూటిక్స్ ఇంక్., అనే బయోటెక్నాలజీ కంపెనీతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. -
కార్లు, బైక్లకు భలే గిరాకీ
ప్రయాణికుల వాహనాల (కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల)తో పాటు ద్విచక్ర వాహనాల (బైక్లు, స్కూటర్ల)కు లభించిన అధిక గిరాకీ వల్లే, నవంబరులో రికార్డు స్థాయిలో వాహన రిటైల్ విక్రయాలు సాగాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. -
కొనసాగిన రికార్డుల పరుగు
వరుసగా ఏడో రోజూ పరుగులు తీసిన సెన్సెక్స్, నిఫ్టీ.. తాజా జీవనకాల గరిష్ఠాలకు చేరాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ షేర్లు మార్కెట్లను ముందుకు నడిపించాయి. -
తుపాను బాధిత ప్రాంతాల్లోని వినియోగదార్లకు వాహన సంస్థల మద్దతు
ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో మిగ్జాం తుపాను, వరదల వల్ల ఇబ్బంది పడుతున్న వినియోగదార్లకు మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ మోటార్, ఆడి, ఫోక్స్వ్యాగన్ తదితర వాహన సంస్థలు మద్దతుగా నిలుస్తున్నాయి. -
ఎయిరిండియా విమానాల ఆర్డరులో మార్పులు
టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా, ఈ ఏడాది మొదట్లో ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్కు 250 విమానాలకు ఆర్డరు పెట్టింది. -
పునరుత్పాదక ఇంధనాలపై అదానీ గ్రూప్ రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడి!
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) పునరుత్పాదక ఇంధన పోర్ట్ఫోలియోను విస్తరించేందుకు, అదానీ గ్రూప్ 75 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6.23 లక్షల కోట్ల) పెట్టుబడి పెట్టబోతోందని గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ బుధవారం వెల్లడించారు. -
సుజుకీ మోటార్ గుజరాత్ నుంచి 30 లక్షల వాహనాల ఉత్పత్తి
మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ)కు కార్లు తయారు చేసే సుజుకీ మోటార్ గుజరాత్ (ఎస్ఎంజీ), ఇప్పటివరకు మొత్తం 30 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసినట్లు బుధవారం తెలిపింది. -
రతన్ టాటా పేరుతో ‘ఫేక్’ సిఫారసులు
టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా పేరును దుర్వినియోగం చేస్తూ.. వచ్చిన ‘ఫేక్’ వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనం ఇచ్చింది. -
1,14,902 అంకురాలకు గుర్తింపు
పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) అక్టోబరు 31 వరకు దేశంలోని 1,14,902 సంస్థలను అంకురాలుగా గుర్తించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు
రైల్వే ప్రభుత్వ రంగ సంస్థ ఇర్కాన్లో 8% వాటాను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)లో విక్రయించడం ద్వారా రూ.1,100 కోట్ల నిధుల్ని ప్రభుత్వం సమీకరించబోతోంది.