అప్పులు చేసి మరీ.. ఆస్తులు కొంటున్నారు!
దేశంలో కుటుంబాల నికర ఆర్థిక పొదుపు 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 55 శాతం క్షీణించినట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది.
కుటుంబాల పొదుపు సగానికి తగ్గింది
రుణాలు రెండింతలయ్యాయ్
ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక
ముంబయి
దేశంలో కుటుంబాల నికర ఆర్థిక పొదుపు 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 55 శాతం క్షీణించినట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఇది స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 5.1 శాతానికి సమానమని వెల్లడించింది. మరోవైపు కుటుంబాల రుణ భారం 2020-21 నుంచి రెండింతలు పెరిగి రూ.15.6 లక్షల కోట్లకు చేరినట్లు పేర్కొంది. ఇందులో బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకున్నట్లు విశ్లేషించింది. నివేదిక ప్రకారం..
- తగ్గిన పొదుపులో అధిక భాగం భౌతిక ఆస్తులకు మళ్లింది. 2022-23లో పెరిగిన రూ.8.2 లక్షల కోట్ల కుటుంబ రుణాల్లో రూ.7.1 లక్షల కోట్లు బ్యాంకుల నుంచే ఉన్నాయి. ఇందులోనూ అధిక భాగం గృహ రుణాలు, ఇతర రిటైల్ రుణాలు ఉన్నాయి.
- 2022-23లో కుటుంబాల పొదుపు 50 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయి జీడీపీలో 5.1 శాతానికి తగ్గింది. 2020-21లో ఇది 11.5 శాతంగా ఉంది. కొవిడ్కు ముందు ఆర్థిక సంవత్సరం (2019-20)లో జీడీపీలో పొదుపు వాటా 7.6 శాతంగా నమోదైంది.
- బీమా, భవిష్య నిధి, పింఛను నిధులకు కుటుంబాల నుంచి రూ.4.1 లక్షల కోట్ల మేర పెరిగాయి. గత రెండేళ్లలో కుటుంబాల రుణాల్లో 55 శాతం రిటైల్ రుణాలే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా గృహ, విద్య, వాహన రుణాల వాటా ఉంది.
- 2011-12 ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల పొదుపులో దాదాపు 2/3 వంతు పైగా ఆస్తుల్లోనే ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది 48 శాతానికి తగ్గింది. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ధోరణి మారుతోంది. ప్రజలు తిరిగి ఆస్తుల కొనుగోలుపై దృష్టి సారిస్తున్నారు. మళ్లీ ఇది 70 శాతానికి చేరే అవకాశం ఉంది.
- కుటుంబాల రుణ భారం-జీడీపీ నిష్పత్తి కొవిడ్ సమయంలో పెరిగినా, తర్వాత నుంచి తగ్గుతోంది. 2020 మార్చిలో కుటుంబాల రుణాలు జీడీపీలో 40.7 శాతంగా ఉండగా, 2023 జూన్కు 36.5 శాతానికి దిగొచ్చాయి.
ఎలాంటి సంక్షోభం లేదు
-సీతారామన్
కుటుంబాల నికర ఆర్థిక పొదుపు తగ్గి, రుణ భారం పెరుగుతుండటంతో వివిధ వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. స్థూలంగా దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, దీనిపై ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. ప్రజలు తమ పొదుపును ఇతర ఆర్థిక సాధనాల్లోకి పెట్టుబడులుగా మళ్లిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. గణాంకాలు గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందని, దేశంలో ఎలాంటి సంక్షోభానికి తావు లేదని ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనవరి నుంచి కార్లు ప్రియం
కొత్త ఏడాదిలో కార్ల ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. జనవరి నుంచి వాహనాల ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్ వెల్లడించాయి. -
6 నెలల గరిష్ఠానికి బంగారం ధరలు
అంతర్జాతీయ విపణిలో బంగారం ధరలు 6 నెలల గరిష్ఠానికి చేరాయి. ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర సోమవారం 2013.99 డాలర్లకు చేరింది. -
రేమండ్ వ్యాపారం సాఫీగా సాగుతుంది
వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఉద్యోగులు, బోర్డు సభ్యులకు కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా భరోసా ఇచ్చారు. -
రూ.13,000 కోట్లతో భారత్లో ఫాక్స్కాన్ విస్తరణ!
ఐఫోన్ తయారీ సంస్థ హాన్హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ భారత్లో మరింత విస్తరించనుంది. ఫాక్స్కాన్గా సుపరిచితమైన ఈ సంస్థ ఇక్కడి నిర్మాణ ప్రాజెక్టులపై 1.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.13,000 కోట్లు) పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. -
ఐడీబీఐ బ్యాంక్లో పూర్తి వాటా విక్రయించం
బ్యాంకస్యూరెన్స్ ప్రయోజనాలు పొందేందుకు, ఐడీబీఐ బ్యాంక్లో కొంత వాటా అట్టే పెట్టుకోవాలని.. ఆ బ్యాంక్ ప్రమోటర్, ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) యోచిస్తోంది. -
ఏఐ నైపుణ్యాలను నేర్చుకుందాం
కృత్రిమ మేధ సాంకేతికత, ఐటీ నిపుణులకు తప్పనిసరి అవసరంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది దీని గురించే మాట్లాడుకుంటున్నారని ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ పేర్కొంది. -
66,500 పాయింట్ల స్థాయి కీలకం!
అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలతో గత వారం దేశీయ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. కీలక పరిణామాలు లేకపోవడంతో మార్కెట్లు స్తబ్దుగా ట్రేడయ్యాయి. -
అల్యూమినియంలో కొనుగోళ్లు!
పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.61,985 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.62,351; రూ.62,967 వరకు రాణిస్తుందని భావించొచ్చు. -
దివ్యాంగుల కోసం అమెజాన్ ప్రత్యేక కార్యక్రమం
చదువులో ఇబ్బందిపడే దివ్యాంగుల్లో నైపుణ్యాలను వెలికితీసి, వారికి ఉపాధి కల్పించేందుకు అమెజాన్ ఇండియా ప్రత్యేక కార్యక్రమం ‘ఆరోరా’ను ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
వినియోగదారు సేవా ఏజెంట్ల పని భారం తగ్గించేందుకు ఏఐ చాట్బాట్ను వినియోగించడం ప్రారంభించినట్లు విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది.