సంక్షిప్త వార్తలు(9)
కళామందిర్ పేరుతో దుస్తుల విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్న హైదరాబాద్ సంస్థ సాయి సిల్క్స్ తొలి పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)కు మంచి స్పందన లభించింది.
సాయి సిల్క్స్ ఐపీఓకు 4.4 రెట్ల స్పందన
ఈనాడు, హైదరాబాద్: కళామందిర్ పేరుతో దుస్తుల విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్న హైదరాబాద్ సంస్థ సాయి సిల్క్స్ తొలి పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)కు మంచి స్పందన లభించింది. 3,84,86,309 షేర్లకు గాను 16,94,58,544 షేర్లకు బిడ్లు వచ్చినట్లు సంస్థ వెల్లడించింది. అంటే 4.4 రెట్ల వరకూ దరఖాస్తులు వచ్చాయి. ఈ ఐపీఓ ద్వారా రూ.1,201 కోట్ల నిధులను సమీకరించనుంది. ఈ నిధులతో తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలలో కొత్త విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తామని సంస్థ తెలిపింది.
ఎస్బీఐ రూ.10,000 కోట్ల సమీకరణ
ముంబయి: మౌలిక బాండ్ల జారీ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వెల్లడించింది. ఈ బాండ్లపై 7.49 శాతం వడ్డీ(కూపన్) రేటును చెల్లించనున్నట్లు పేర్కొంది. కాగా, ఎస్బీఐ మౌలిక బాండ్లను జారీ చేయడం ఇది నాలుగో సారి. ఇలా సమీకరించిన నిధులను మౌలిక రంగ ప్రాజెక్టులకు, అందుబాటు గృహ రంగానికి రుణాలుగా అందిస్తోంది. తాజా మౌలిక బాండ్ల ఇష్యూను రూ.4,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఎస్బీఐ ప్రారంభించింది. దీనికి ఐదు రెట్లకు పైగా స్పందన లభించిందని, రూ.21,045 కోట్ల విలువైన 134 బిడ్లు వచ్చాయని ఎస్బీఐ తెలిపింది.
ఎంఎస్ఎంఈల కోసం నియో ఫర్ బిజినెస్
అందుబాటులోకి తీసుకొచ్చిన యాక్సిస్ బ్యాంక్
ఈనాడు, హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల కోసం ప్రత్యేకంగా నియో ఫర్ బిజినెస్ను ప్రారంభించినట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. మారుతున్న వ్యాపార అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని తీసుకొచ్చినట్లు పేర్కొంది. చెల్లింపుల్లో 28 శాతం నగదు, 72 శాతం డిజిటల్ విధానంలో జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని, పేమెంట్ గేట్ వే, బల్క్ పేమెంట్స్ తదితరాలను నియో అందించనుంది. అన్ని వ్యాపార అవసరాలకు సరిపోయేలా, రోజులో ఎప్పుడైనా లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఇది తోడ్పడుతుందని యాక్సిస్ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్, హోల్సేల్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ హెడ్ నీరజ్ గంభీర్ అన్నారు. మొబైల్ బ్యాంకింగ్తోపాటు, ఇతర పద్ధతుల్లోనూ దీన్ని వినియోగించుకునే వీలుందన్నారు.
రేణిగుంటలో ఆటోమోటివ్ సర్వీస్ కేంద్రం
ఈనాడు, హైదరాబాద్: వాణిజ్య వాహనాలతోపాటు, వ్యక్తిగత వాహనాలకు సర్వీస్ సేవలను అందించే ఆటోమోటివ్ మాన్యుఫాక్చరర్స్ లిమిటెడ్ (ఏఎంపీఎల్) ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంటలో అత్యాధునిక సర్వీసు కేంద్రాన్ని ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా 104 సర్వీస్ టచ్పాయింట్లతో విస్తరించిన ఏఎంపీఎల్.. అశోక్ లేల్యాండ్కు సంబంధించిన అతి పెద్ద డీలర్లలో ఒకటి. 716 జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఈ కేంద్రం తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య తిరిగే అన్ని రకాల అశోక్ లేల్యాండ్ వాహనాలకు అవసరమైన సేవలను అందించనుంది. ఈ సందర్భంగా ఏఎంపీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇది అతిపెద్ద సర్వీస్ కేంద్రమని పేర్కొన్నారు. 24×7 బ్రేక్డౌన్ అసిస్టెన్స్లాంటి సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.
భూములను విక్రయించిన ఇండియా సిమెంట్స్
హైదరాబాద్: నగదు సమీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో ఉన్న 73.75 ఎకరాల భూమిని ఇండియా సిమెంట్స్ విక్రయించింది. దీన్ని రూ.70 కోట్లకు అమ్మేందుకు అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. మూలధన అవసరాల కోసం ఇండియా సిమెంట్స్ కొన్ని నిరుపయోగ ఆస్తులను విక్రయించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.
మహీంద్రా ఇన్సూరెన్స్లో మహీంద్రా ఫైనాన్స్కు 20% వాటా
దిల్లీ: మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్ (ఎంఐబీఎల్)లో 20 శాతం వాటాను రూ.206.39 కోట్లకు కొనుగోలు చేసినట్లు మహీంద్రా ఫైనాన్స్ శుక్రవారం వెల్లడించింది. దీంతో మహీంద్రా ఫైనాన్స్కు పూర్తి అనుబంధ సంస్థగా ఎంఐబీఎల్ మారింది. రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో ఎంఐబీఎల్ షేరును రూ.1,000 చొప్పున మొత్తం 20,61,856 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశామని, ఇందుకు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ అనుమతి ఇచ్చిందని ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో మహీంద్రా ఫైనాన్స్ తెలిపింది. దీంతో సెప్టెంబరు 22 నుంచి ఎంఐబీఎల్ అనుబంధ సంస్థగా మారిందని పేర్కొంది.
రూ.1500 కోట్ల సమీకరణలో కర్ణాటక బ్యాంక్
దిల్లీ: వ్యాపార వృద్ధి కోసం ఒకటి లేదా ఎక్కువ విడతల్లో షేర్ల విక్రయం ద్వారా రూ.1500 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతి ఇచ్చినట్లు కర్ణాటక బ్యాంక్ శుక్రవారం వెల్లడించింది. ప్రిఫరెన్షియల్ ఇష్యూ లేదా రైట్స్ ఇష్యూ లేదా క్యూఐపీ లేదా ఇతర అనుమతించిన పద్ధతుల్లో నిధుల సమీకరణకు బోర్డు అనుమతి ఇచ్చినట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్, క్వాంట్ మ్యూచువల్ ఫండ్, భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్కు 3,34,00,132 షేర్లను జారీ చేసేందుకు కూడా బోర్డు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. ఒక్కో షేరు రూ.239.52 చొప్పున వీటి విలువ రూ.800 కోట్ల వరకు ఉంటుంది.
అజియో ‘ఆల్ స్టార్స్ సేల్’ వచ్చేసింది
హైదరాబాద్: ఖరీదైన ఫ్యాషన్ ఉత్పత్తుల ఆన్లైన్ ప్లాట్ఫామ్ అజియో ‘ఆల్ స్టార్స్ సేల్’ పేరుతో విక్రయాల కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో వినియోగదార్లు 5500కు పైగా బ్రాండ్లకు చెందిన 1.5 మిలియన్ ఫ్యాషన్ ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చని అజియో ఒక ప్రకటనలో తెలిపింది. సరికొత్త సంప్రదాయ ఉత్పత్తుల బ్రాండు ‘రి-వాహ్’ను కూడా ఇదే వేదికగా ప్రారంభించినట్లు, ఈ బ్రాండు కింద 2,000కు పైగా ఉత్పత్తులు లభ్యమవుతాయని పేర్కొంది. వివిధ బ్రాండ్లు, విభాగాల్లో వినియోగదారుల జరిపే కొనుగోళ్లపై 50-90 శాతం వరకు డిస్కౌంటును పొందొచ్చని పేర్కొంది. ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే మరో 10 శాతం అదనంగా తగ్గింపు లభిస్తుందని వెల్లడించింది. ఉత్తమ కొనుగోలుదార్లు ప్రతి ఆరు గంటలకు ఐఫోన్ 14 ప్రో మాక్స్, యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ ఎం2, రూ.1 లక్ష విలువైన పసిడిని గెలుచుకోవచ్చు.
ఎన్సీసీకి కొత్త ఆర్డర్లు
ఈనాడు, హైదరాబాద్: నిర్మాణ రంగంలోని ఎన్సీసీకి కొత్త ఆర్డర్లు లభించాయి. ముంబయిలో 2 సొరంగ మార్గాల నిర్మాణం నిమిత్తం లభించిన ఈ ఆర్డర్లను పూర్తి చేసేందుకు జె.కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్(జేకేఐఎల్)తో కలిసి ఒక ఉమ్మడి భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేసినట్లు ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రూ.6,301.08 కోట్ల ఆర్డర్లు లభించాయి. ఉమ్మడి సంస్థలో ఎన్సీసీకి 51%, జేకేఐఎల్కు 49% వాటా ఉండనుంది. గోరేగావ్ ఫిల్మ్సిటీ నుంచి ఖిండీపడ (అమర్నగర్) వరకూ రెండు సొరంగ మార్గాలను డిజైన్, నిర్మాణం, నిర్వహణ కోసం ఈ ఆర్డరు లభించింది. ఈ ప్రాజెక్టులో ఎన్సీసీ రూ.3,213.55 కోట్ల విలువైన పనులను నిర్వహిస్తుంది. ప్రాజెక్టును అయిదేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. 10 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Infinix Smart 8 HD: ‘మ్యాజిక్ రింగ్’తో ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 హెచ్డీ ఫోన్.. ధర, ఫీచర్లివే!
Infinix Smart 8 HD: స్మార్ట్ 7 హెచ్డీకి కొనసాగింపుగా స్మార్ట్ 8 హెచ్డీ ఫోన్ను ఇన్ఫీనిక్స్ శుక్రవారం భారత్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం! -
డిజిటల్ రుణాలపై ఆర్బీ‘ఐ’.. లోన్ అగ్రిగేటర్లకు త్వరలో రూల్స్
RBI on Digital loans: డిజిటల్ రుణాలపై ఆర్బీఐ దృష్టి సారించింది. లోన్ అగ్రిగేటర్ల కోసం త్వరలో కొత్త నిబంధనలను తీసుకురానుంది. -
Stock Market: ఆర్బీఐ ఎఫెక్ట్.. తొలిసారి 21,000 మార్క్ అందుకున్న నిఫ్టీ!
Stock Market Closing bell: సెన్సెక్స్ 303.91 పాయింట్లు పుంజుకొని 69,825.60 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 68.25 పాయింట్లు లాభపడి 20,969.40 వద్ద ముగిసింది. -
Tata group: మరో ఐఫోన్ల ప్లాంట్కు టాటాలు రెడీ.. 50 వేల మందికి ఉపాధి!
Tata group- iphone: టాటా గ్రూప్ మరో అతిపెద్ద ఐఫోన్ ప్లాంట్ను నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. దీనిద్వారా 50 వేల మందికి ఉపాధి లభించనుంది. -
UPI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆటో డెబిట్, ఆ యూపీఐ చెల్లింపుల పరిమితి పెంపు
UPI payments: ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలను శుక్రవారం వెల్లడించింది. రెపోరేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. మరోవైపు యూపీఐ, ఆటో డెబిట్ పరిమితి విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. -
Flipkart: ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
Flipkart Year End Sale: ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ తేదీలను ప్రకటించింది. పెద్ద ఎత్తున క్యాష్బ్యాక్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ సేల్ను తీసుకొచ్చినట్లు వెల్లడించింది. -
India Shelter Finance IPO: 13న ఇండియా షెల్టర్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి రూ.469-493
India Shelter Finance IPO: రూ.1,200 కోట్ల సమీకరణే లక్ష్యంగా ఇండియా షెల్టర్ ఫైనాన్స్ ఐపీఓ ఈ నెల 13న ప్రారంభం కానుంది. -
Onion Exports: ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం..
Onion Exports: దేశంలో ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి వరకు వీటి ఎగుమతులపై నిషేధం విధించింది. -
RBI: ఐదోసారీ వడ్డీరేట్లు యథాతథం.. వృద్ధిరేటు అంచనాల పెంపు
RBI: ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. -
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market Opening bell | ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్ల లాభంతో 69,716 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 66 పాయింట్లు పెరిగి 20,967 దగ్గర ట్రేడవుతోంది. -
ఐటీ సెజ్ల్లో స్థలాలకు గిరాకీ
ఐటీ/ఐటీఈఎస్ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)ని అభివృద్ధి చేసిన ఒక డెవలపర్ విజ్ఞప్తి నేపథ్యంలో.. అందులో ప్రాసెసింగేతర ప్రాంతాలకు సెజ్ హోదాను రద్దు చేసే అధికారం అంతర్ మంత్రిత్వ శాఖల బోర్డుకు ఉందని ఒక అధికారిక నోటిఫికేషన్ స్పష్టం చేసింది. -
వచ్చే బడ్జెట్లో అద్భుత ప్రకటనలుండవు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న వెల్లడించే తన ఆరో బడ్జెట్లో ‘అద్భుత ప్రకటనలు’ ఉండవని, సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం ఓట్ ఆన్ అకౌంట్గానే సమర్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం, కొత్త ప్రభుత్వం జులైలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుందని సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరమ్లో మంత్రి తెలిపారు. -
సంస్థల్లో నియామకాలు 12% తగ్గాయ్
వేర్వేరు రంగాల కార్యాలయాల్లో నైపుణ్యంతో కూడిన (వైట్-కాలర్) ఉద్యోగాల నియామకాలు గత 2 నెలల్లో తగ్గినట్లు నౌకరీ జాబ్స్పీక్ సూచీ నివేదిక వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఉద్యోగ పోస్టింగ్లు 2022 అక్టోబరు, నవంబరులో 2781 కాగా, ఈ ఏడాది అదే సమయంలో 12 శాతం తగ్గి 2,433 కు పరిమితమయ్యాయని తెలిపింది. -
2025కు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 170 గిగా వాట్లకు: ఇక్రా
దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2025 నాటికి 170 గిగా వాట్లకు చేరుకుంటుందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్, సెక్టార్ హెడ్ - కార్పొరేట్ రేటింగ్స్ వి.విక్రమ్ అంచనా వేశారు. ప్రస్తుతం దేశీయ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 130 గిగా వాట్లుగా ఉంది. -
ఏడు రోజుల జోరుకు విరామం
సూచీల ఏడు రోజుల వరుస లాభాలకు గురువారం అడ్డుకట్ట పడింది. ఇటీవల భారీగా పెరిగిన షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించడమే ఇందుకు కారణం. బలహీన అంతర్జాతీయ సంకేతాలు ప్రభావం చూపాయి. ఆర్బీఐ పరపతి నిర్ణయాలు శుక్రవారం (నేడు) వెలువడనుండటంతో, మదుపర్లు కొంత అప్రమత్తత పాటించారు. -
వివో కేసులో తొలి ఛార్జిషీట్ దాఖలు
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ కంపెనీ వివో అనుబంధ సంస్థ వివో ఇండియాపై, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. వివోతో పాటు మరికొందరిపై వచ్చిన మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేసిన ఈడీ, తొలి ఛార్జిషీట్ను ప్రత్యేక కోర్టులో వేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద వివో ఇండియాపై అభియోగాలు మోపింది. -
దూసుకెళ్తున్న ఈవీలు
విద్యుత్ వాహనాల (ఈవీల) అమ్మకాలు రాణిస్తున్నాయి. విద్యుత్తు విభాగంలో ప్రయాణికులు- వాణిజ్య వాహనాలు కలిపి నవంబరులో 1,52,606 యూనిట్లు అమ్ముడైనట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా గురువారం వెల్లడించింది. -
1 నుంచి హ్యుందాయ్ ధరల పెంపు
వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎమ్ఐఎల్), జనవరి 1 నుంచి ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. పెరిగిన ముడి పదార్థాల ధరలు, ప్రతికూల మారకపు రేటు, అధిక కమొడిటీ ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. -
స్టార్బక్స్కు రూ.91,500 కోట్ల నష్టం
సియాటెల్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్బక్స్ కార్పొరేషన్ ఆదాయంపై, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం వేగంగా కనిపించింది. విక్రయాలు తగ్గడంతో, సుమారు 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ.91,500 కోట్ల) మేర విలువను కంపెనీ నష్టపోయింది. -
పంచదార ధరల అదుపునకు చర్యలు
దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇథనాల్ ఉత్పత్తికి చెరకు రసం వినియోగించకుండా నిషేధం విధిస్తూ, చక్కెర మిల్లులు, డిస్టిలరీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశీయ అవసరాలకు తగినంత చక్కెరను అందుబాటులో ఉంచడంతో పాటు, ధరలు అదుపులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. -
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో వార్బర్గ్ పింకస్ 1.3 శాతం వాటా విక్రయం
ఐడీఎఫ్సీ బ్యాంక్లో అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్బర్గ్ పింకస్ 1.3 శాతం వాటాను రూ.790.18 కోట్లకు విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా ఈ విక్రయం జరిగింది. ఈ వార్తలతో బీఎస్ఈలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు 3.02 శాతం నష్టపోయి రూ.87.69 వద్ద ముగిసింది.


తాజా వార్తలు (Latest News)
-
Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’.. ఆరోజు ఎంతో కంగారుపడ్డా: మీనాక్షి చౌదరి
-
Team India: యువ టాలెంట్కు కొదవేం లేదు.. జట్టు కూర్పే భారత్కు సవాల్: మాజీ క్రికెటర్
-
డిజిటల్ రుణాలపై ఆర్బీ‘ఐ’.. లోన్ అగ్రిగేటర్లకు త్వరలో రూల్స్
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
TSRTC: పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
-
Canada visa: కెనడా కీలక నిర్ణయం.. స్టూడెంట్ వీసా డిపాజిట్ రెట్టింపు!